ఆంధ్రప్రదేశ్ లో బూతులు మాట్లాడే ఎమ్మెల్యేలు, మంత్రులు, అంటూ, ప్రజానికానికి టక్కున కొన్ని పేర్లు గుర్తుకు వస్తాయి. మొదట్లో బూతులు, ఇప్పుడు అవి చెప్పలేని మాటల వరకు వెళ్ళిపోయాయి. చివరకు అసెంబ్లీ వేదికగా కూడా జుబుక్సాకరంగా మాటలు మాట్లాడే స్థాయికి వచ్చారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీరు మాట్లాడే భాష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్న శుక్రవారం నాడు, అంబటి, ద్వారంపూడి, కొడాలి నాని వాడిన భాష గురించి అందరికీ తెలిసిందే. అంతకు ముందు వంశీ కూడా ఇదే భాష వాడారు. తరువాత జరిగిన పరిణామాల నేపధ్యంలో, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సోషల్ మీడియా ద్వారా అనేక బెదిరింపులు వస్తున్నాయి అంట. అందుకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొడాలి నానికి 2+2 భద్రతా ఉండగా, దాన్ని 1+4 కి పెంచి, ఆయన కాన్వాయ్ లో మరో వాహనాన్ని కేటాయించారు. అలాగే వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి, 1+1 నుంచి 4+4కి భద్రత కల్పించారు. అదనంగా భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నోరు మంచిది అయితే, ఊరు మంచిది అవుతుంది అంటారు ఇందుకే మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read