బాబాయ్‌ని చంపాం..బెయిల్ తెచ్చుకున్నామ‌ని సంబ‌రాలు చేసుకుంటున్న అబ్బాయిల‌కి నారా లోకేష్ చుక్క‌లు చూపిస్తున్నాడు. సొంత బాబాయ్‌ని చంపేసి, నారాసుర ర‌క్త‌చ‌రిత్ర అంటూ త‌మ‌కి ర‌క్తం అంటించే  కుతంత్రాల‌ని అప్ప‌ట్లోనే ఎండ‌గ‌ట్టిన నారా లోకేష్ తాజాగా త‌న యువ‌గ‌ళం పాద‌యాత్ర వేదిక‌గా అబ్బాయిల ర‌క్త‌చ‌రిత్ర‌ని క‌డ‌ప గ‌డ‌ప‌ల‌కి తీసుకెళుతున్నాడు. ప్రొద్దుటూరు పాద‌యాత్ర‌లో  హూ కిల్డ్ బాబాయ్ ప్లకార్డులు టిడిపి కేడ‌ర్‌ ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా డిఎస్పీ వ‌చ్చి ప్ల‌కార్డులు ప‌ట్టుకుంటే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు. ఎందుకు అని నిల‌దీసిన నారా లోకేష్ తో డిఎస్పీ వాగ్వాదానికి దిగారు. దీంతో అబ్బాయిలే బాబాయ్‌ని చంపార‌నే ప్ల‌కార్డులు లోకేష్ ప‌ట్టుకుని మ‌రీ చూపించారు. హూ కిల్డ్ బాబాయ్ ప్లకార్డులు ప్రజలకి చూపించి బాబాయ్ ని లేపేసింది ఎవరు అంటూ ప్ర‌జ‌ల‌ని అడుగుతుంటే, అబ్బాయిలే చంపేశార‌నంటూ జ‌నం రియాక్ష‌న్స్‌తో యువ‌గ‌ళం ద‌ద్ద‌రిల్లిపోయింది. అదే ప్రొద్దుటూరులో వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చిన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని వైకాపా ఉత్స‌వాలు చేసింది. అదే ప్రొద్దుటూరులో బాబాయ్‌ని చంపింది ఎవ‌రంటూ జ‌నం నుంచే అబ్బాయిలే అని స‌మాధానంతో క‌డ‌ప గ‌డ‌ప‌ల్లో అబ్బాయిల నేర‌చరిత్రని బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డంలో లోకేష్ మొండిగా మ‌రో అడుగు ముందుకేశాడు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read