ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసే అంశంలో ప్రతికూల రీతిలో ఆదేశాలను శుక్రవారం జారీ చేసింది. పంచాయితీ కార్యాలయాలకు పార్టీ రంగుల పై ప్రభుత్వం ఇచ్చిన 623 జివోను హైకోర్టు సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం జీవో ఎందుకు ఇచ్చిందో వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో పంచాయితీ కార్యాలయాలకు రంగులు వేయడంపై రాష్ట్ర హైకోర్టు తన తీర్పు వెలువరించింది. పంచాయతీలపై రంగుల అంశంపై వాద ప్రతివాదుల వాదనలు విన్న కోర్టు 623 జివోను కొట్టివేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం జివో ఎందుకు ఇచ్చిందో వివరణ ఇవ్వాలని రాష్ట్ర వంచాయితీరాజ్ సెక్రటరీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈనెల 28వ తేదీలోపు రంగులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలన్నది.

అలా చేయని వక్షంలో కోర్టు దిక్కరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని 623 జీవోను సవాలుచేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలుచేసిన చింతలపాటి సోమయాజులు తెలిపారు. గతంలో రాష్ట్రంలో పంచాయితీ కార్యాలయాలకు రంగులు వేయడాన్ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లాకు చెందిన సర్పంచ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు పంచాయితీ కార్యాలయాలకు వేసిన వైఎస్సార్సీ రంగులు తొలగించాలని ఆదేశించింది. మూడు రంగులు, ఒక్కో రంగు, దేనికి వర్తిస్తుంది అనేది ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

అయితే మళ్లీ అవే రంగులు వేస్తూ జివోను ఎలా ఇస్తా రంటూ 623 జివోను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లాకు చెందిన సోమయాజులు హైకోర్టులో ఫిల్ దాఖలు చేయగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలుచేయగా హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. 623 జీవోను కొట్టివేస్తూ సదరు జివో ఎందు కిచ్చారో ఈ నెల 28లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి కోర్టు నోటీసులు ఇవ్వటం పై చర్చ జరుగుతుంది. నీలం సాహ్ని తన కెరీర్ మొత్తం మీద, మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆమె నిక్కచ్చిగా పని చేస్తారని, పేరు ఉంది. అయితే మరో నెల రెండు నెలల్లో, రిటైర్డ్ అవుతారు అనగా, ఆమె చేసిన పని పై కోర్ట్ సీరియస్ అవ్వటం, కోర్ట్ ముందు సమాధానం చెప్పే పరిస్థితి రావటంతో, ఆమె గురించి తెలిసిన వాళ్ళు బాధ పడుతున్నారు. హైకోర్ట్, సుప్రీం కోర్ట్ తీర్పులు ఇచ్చినా, మళ్ళీ రంగులు జీవో, ఆమె స్వయంగా ఇవ్వటం పై, ఇప్పుడు కోర్ట్ తప్పుబట్టటం, ఇవన్నీ ఇప్పుడు చర్చనీయంసం అయ్యాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read