వైసీపీలో నెల్లూరు పెద్దారెడ్డి సునామీ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ముగ్గురు వైసీపీ రెడ్డి ఎమ్మెల్యేలు పార్టీ దూరం పెట్ట‌గా వారు డైరెక్టుగా జ‌గ‌న్ రెడ్డిపైనే ఎదురుదా-డికి దిగుతున్నారు. ఇంత‌లోనే కోవూరు ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి పార్టీ వీడుతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇవి ఆయ‌న ఖండించారు. అయితే కావ‌లి ఎమ్మెల్యే ప్ర‌తాప్ కుమార్ రెడ్డి ప‌క్క‌చూపులు చూస్తున్నార‌ని స‌మాచారం. కావ‌లి ఎమ్మెల్యే రామి రెడ్డి ప్ర‌తాప‌రెడ్డికి టికెట్ ఇవ్వ‌ర‌ని వైసీపీలో బాగా టాక్ న‌డుస్తోంది. ఐప్యాక్ నివేదిక‌ల్లోనూ ఆయ‌నకి వ్య‌తిరేకంగానే ఉన్నాయ‌ట‌. దీంతోపాటు వంద‌ల‌కోట్ల‌తో వైసీపీలో దిగిన బీద మ‌స్తాన్ రావు త‌న వార‌సుడి కోసం కావ‌లి టికెట్ అడుగుతున్నారు. ఇది తెలుసుకుని ఇక త‌న‌కి టికెట్ వ‌చ్చే అవ‌కాశంలేద‌ని డిసైడైన రామిరెడ్డి ప్ర‌తాప్ కుమార్ రెడ్డి టిడిపి నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం బ‌య‌ట‌కు పొక్కింది. అయితే కావ‌లిలో మ‌రో ఎంపీ వైసీపీకి ఆర్థిక అండ‌దండ‌లు అందించే వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌న భార్య ప్ర‌శాంతిరెడ్డికి టికెట్ అడుగుతున్నారని, ఆయ‌న‌ని కాద‌ని ప్ర‌తాప్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వ‌ర‌ని ప్ర‌చారం సాగుతోంది. మొత్తానికి ఆర్థికంగా అన‌కొండ‌ల్లాంటి ఇద్ద‌రు ఎంపీలు కావ‌లి టికెట్టుపై దృష్టి పెట్ట‌డంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ప‌క్క‌పార్టీల వైపు చూస్తున్నార‌ని టాక్ న‌డుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read