మొన్న జగన్ మాట్లాడుతూ, చంద్రబాబుని ఏదన్నా బావిలో దూకి చస్తే, రాష్ట్రానికి పాట్టిన శని వదులుతుంది అంటూ, పిచ్చ తలకెక్కి మాట్లాడాడు... అయితే, ఇప్పుడు ఈ రైతు మాట్లాడిన మాటలు వింటే, జగనే దూకాలి... బావిలో దూకుతాడో, హెలికాప్టర్ లో నుంచి దూకుతాడో కాని, అలా దులుపి దులిపి పెట్టాడు, ఈ రైతన్న... ఈయన పేరు రమణయ్య... నెల్లూరు జిల్లా వాసి... నెల్లూరు జిల్లాలో, వైసిపీ పార్టీ గోవర్ధన్ రెడ్డి చేస్తున్న పచ్చి అబద్ధపు ప్రచారాన్ని, జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టారు... అన్నం పెట్టినోడుని, అన్నం పెట్టలేదు అని, మా రైతన్నలని చెప్పమంటే నేను సిద్ధంగా లేము అంటూ, దులిపి దులిపి పెట్టారు... ఈ తాత మాటలు వింటే, నిజంగా జగన్ తల ఎక్కడ పెట్టుకుంటారో... ఆయన మాటలు ఇవే...

jagan farmer 10042018 2

"నేను రైతుని... వ్యవసాయం చేసుకుని బ్రతకాలి... ఇంకా ఏమి ఆధారం లేదు... మాకు నెల్లూరులో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లాలో నీళ్ళు కావాల్సినన్ని ఇప్పించి, మాకు ఇబ్బంది లేకుండా, ధాన్యం పండేలా చేసారు... అంతే కాదు, ధాన్యం అమ్ముకునే దానికి కూడా సహాయ పడ్డారు... ముఖ్యమంత్రి గారితో చెప్పి, ఏ ఇబ్బంది లేకుండా చేసారు... వైసిపీ నాయకులు, మీరెందుకు సభ్యత లేకుండా, విషయం తెలీకుండా మాట్లాడుతారు.. ఆయన అనేవాడు లేకపోతే, మాకు చుక్క నీరు వచ్చేది కాదు.. అయన వల్ల మేము ఈ రోజు అన్నం తింటున్నాం... మాకు ఇంత చేస్తే, మీరు ఏదేదో మాట్లాడుతారు.. విషయం తెలీదు.. నేను వైసిపీ పార్టీ వాడిని... ఇప్పుడు మాత్రం, ఇందంతా చూసిన తరువాత టిడిపిలోకి వచ్చాను.."

jagan farmer 10042018 3

"కాలాన్ని బట్టి రాజకీయం చెయ్యాలి కాని... ఎన్నికలు అయ్యిన దగ్గర నుంచి, మనసులో ఏదేదో పెట్టుకుని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు... ఊరికే మాటలు కాదు, నాతో రండి... ఎన్ని గ్రామాలు నిండాయో ఎంత పంట పండిందో ఎంత గొడ్డు..గోదాను కాపడినాడో చూపిస్తా రండి నాతో.... అప్పుడు చూసి మాట్లాడండి... సభ్యత లేకుండా మాట్లాడి, మీ రాజకీయాల కోసం, మా రైతులని ఇబ్బంది పెట్టకండి... అన్నం పెట్టినోడిని , పెట్టలేదు అని మేము చెప్పలేము... ఎదో ఒక కాలువ లేని చెరువు చూపించి, అసలు జిల్లాలో నీళ్ళే లేవు అని చెప్తే ఎట్లాగండి... సబ్జెక్టు లేకుండా మాట్లాడకండి... మీకు ఏది కావాలన్నా నేను చూపిస్తా, నాతో రండి... అన్నీ చూపిస్తాం..." ఈ తాత మాటలు మీరూ వినండి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read