మాకు న్యాయం చెయ్యండి అని అంటున్నందుకు, కేంద్ర ప్రభుత్వం మన మీద కక్ష కొనసాగిస్తూనే ఉంది. చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలని, కేసులు పెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా, అవినీతి జరిగినట్టు చిన్న ఆధారం కూడా దొరక్కపోవటంతో, అమరావతి పై, పోలవరం పై, ఆ కక్ష తీర్చుకుని, తన పై ఎదురు తిరుగుతున్న ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించటం కోసం, కేంద్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కొన్ని రోజుల క్రితం, అమరావతి పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో వాదనలు జరిగాయి... అమరావతి నిర్మాణం ఆపెయ్యమని, కొంత మంది రాష్ట్ర ద్రోహులు, కేసులు వేసారు... అయితే, అప్పట్లో, అమరావతి నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది.. పర్యవనానని ఎటువంటి ఆటంకం కాకుండా, నిర్మాణాలు చేసుకోమని తీర్పు ఇచ్చింది...

అప్పటికి ఇంకా చంద్రబాబు ఎన్డీఏ లోనే ఉన్నారు... అయితే ఇప్పుడు పరిస్థుతులు వేరు.. మోడీ పై ఒక యుద్ధమే చేస్తున్నారు చంద్రబాబు.. మా హక్కు ప్రకారం, మా రాష్ట్రానికి సాయం చెయ్యమని పోరాడుతున్నారు.. ఈ తరుణంలో, మళ్ళీ కొంత మంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు... తీర్పును పునర్‌ సమీక్ష చెయ్యాలి అంటూ మరో పిటీషన్ వేసారు.. నిజానికి, ఒక్కసారి కొట్టేస్తే, వెంటనే మరో పిటీషన్ స్వీకరించరు.. మరీ ప్రత్యెక పరిస్థుతుల్లో తప్ప ఇది జరగదు... అయితే, కేసు కొట్టేసి 7-8 నెలలు కాకముందే, అమరావతి నిర్మాణంపై దాఖలైన పునర్‌ సమీక్ష పిటిషన్‌కు సంబంధించి ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేస్తామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొంది.

అమరావతి నిర్మాణం పై ఎన్జీటీ, గతంలో ఇచ్చిన తీర్పును పునర్‌ సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ పై, నిన్న గురువారం జస్టిస్‌ జావేద్ ర‌హీం ధర్మాసనం విచారించింది... గతంలో తీర్పును ఇచ్చిన న్యాయమూర్తులు పదవీ విరమణ పొందారని, అందుకే కొత్త బెంచ్‌ ఏర్పాటు చేస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది... అంటే, ఇప్పుడు అమరావతి నిర్మాణం పై మళ్ళీ వాదనలు జరుగుతాయి... మనం ఎంత సమర్ధవంతంగా వాదించినా, కేంద్రం తలుచుకుంటే, ఈ విషయంలో మనల్ని ఇబ్బంది పెట్టటం, పెద్ద సమస్య కాదు.. మరోసారి, చంద్రబాబుని, అమరావతి విషయంలో ఇబ్బంది పెట్టే స్కెచ్ అంటూ, ప్రభుత్వ వర్గాలు కూడా గుసగుసలాడుతున్నాయి.. కొట్టేసిన కేసు, మళ్ళీ రీ ఓపెన్ చెయ్యటం ఏంటో అంటూ, మాట్లాడుకుంటున్నారు... చివరకు ఇది ఎటు పోతుందో చూడాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read