సుప్రీం కోర్టు ఎన్నికలు జరిపించాలని చెప్పగానే, నిమ్మగడ్డ దూకుడు పెంచారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా, కరోనా వ్యాక్సిన్ వచ్చే దాకా, ఎన్నికాల్ విధుల్లో పాల్గునబోము అని చెప్తున్నాయని, అందుకే ఈ నేపధ్యాలోనే, కేంద్ర ఎన్నికల సిబ్బందిని, ఎన్నికల నిర్వహణ కోసం కేటాయించాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి కొద్ది సేపటి క్రితం లేఖ రాసింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ ఉంది, కరోనా ఉంది, ఈ నేపధ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు అని ప్రకటించటంతో పాటుగా, నేరుగా ప్రకటనలు చేయటంతో పాటుగా లేఖలు రాస్తున్నాయి. అందుకే కేంద్ర సిబ్బందిని ఈ ఎన్నికల నిర్వహాణ కోసం, పంపించాలని చెప్పి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. ఇక ఈ రోజు సుప్రీం కోర్టులో ఉద్యోగులకు కూడా ఘాటుగా వాతలు పడ్డాయి. ఉద్యోగులు సంఘం న్యాయవాదులు, సుప్రీం కోర్టు వాదనల్లో పాల్గునగా, సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇందులో మీకేమి సంబంధం ? రాజ్యాంగ సంస్థలు, తమ పని తాను చేసుకుంటున్నప్పుడు, మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు, మీరు ప్రభుత్వానికి అనుకూలంగా వాదిస్తున్నారా అని నిలదీసింది. దీంతో పాటుగా, మీరు ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అని కూడా వ్యాఖ్యలు చేసింది.

sec 25012021 2

దీంతో ఉద్యోగులు సంఘం తరుపున న్యాయవాది, మరింత సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురి కాకుండా, తమ వాదనలు ఆపేశారు. ఈ నేపధ్యంలోనే ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వేళ ఉద్యోగ సంఘాలు సహకరించక పొతే మాత్రం, కేంద్రం సిబ్బందిని ఇస్తే, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు నిర్ణయం తీసుకుంటామని కేంద్రానికి లేఖ రాసింది. ఇక మరో పక్క ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు రీషెడ్యుల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొదటి విడత ఎన్నికలను నాలుగో విడతగా ఎలక్షన్ కమిషన్ మార్చింది. రెండు, మూడు, నాలుగు విడతల ఎన్నిలను ఒకటి, రెండు, మూడు విడతలగా ఎలక్షన్ కమిషన్ మార్చింది. ఇక ఎన్నికల కమిషన్ దూకుడు, సుప్రీం కోర్టు చీవాట్లతో, ఉద్యోగుల సంఘం మాట మార్చింది. ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని మేం చెప్పలేదని, ఆరోగ్యం బాగాలేనివారు తప్ప మిగతావారితో నిర్వహించుకోవచ్చని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి ఇప్పుడు ట్యూన్ మార్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read