పాలకొల్లు నుంచి ఏలూరు వరకు తెదేపాఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ పై కలక్టర్ ఆఫీస్ కు బయలేదారు. రైతుల సమస్యలపై ఫోన్‌లో మాట్లాడదామంటే కలెక్టర్‌, ఎస్పీ, తదితర జిల్లా అధికారులు అందుబాటులో ఉండటం లేదని మండిపడ్డారు. ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు, బకాయిలు, సాగునీరు అందించాలని పాలకొల్లు నుంచి సైకిల్​పై ఏలూరు వెళ్లి కలెక్టర్​కు వినతిపత్రం అందచేయనున్నట్లు తెలిపారు. ఆక్వా వ్యవసాయ రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. వారినుంచి స్పందన రాని కారణంగానే రైతుల కష్టాలను ప్రభుత్వానికి మరింత గట్టిగా వినిపించేందుకు సైకిల్‌పై ఏలూరు వెళ్తున్నట్లు చెప్పారు. ఆక్వా వ్యవసాయ రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి గట్టెక్కించడానికి ఎన్ని రకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో రైతుల వ్యదను ప్రభుత్వానికి మరింత గట్టిగా వినిపించడానికి వెళ్తున్నట్టు చెప్పారు.

ఆయన మాట్లాడుతూ, "నా ఇంట్లో నా 4 గురు సభ్యులే నా కుటుంబం అనుకోవడం లేదు , నా నియోజక వర్గ ప్రజలు అందరు నా కుటుంబంగా భావిస్తున్నాను. సమస్యలపై మాట్లాదామంటే కలెక్టర్ , SP , వంటి జిల్లా అధికారులు కనీసం ఫోన్ లో అందుబాటులో ఉండటం లేదు. ప్రజా ప్రతినిధితో మాట్లాడం కంటే ఇంకా ఎక్కువ ముఖ్యమైన పనులు కలెక్టర్ , SP లకు ఎమున్నాయో నాకు తెలియడం లేదు. కలెక్టర్ , SP వంటి జిల్లా అధికారులు అందుబాటులోకి లేకపోవడంతోనే కరోనను ప్రక్కన పెట్టి ఏలూరు వెళ్లవలసి వస్తుంది. ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి, ఆక్వా వ్యవసాయ రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి గట్టెక్కించడానికి ఎన్ని రకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో రైతుల వ్యదను ప్రభుత్వానికి మరింత గట్టిగా వినిపించడానికి సైకిల్ పై వెళ్తున్నాను"

"ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి. వ్యవసాయ రంగంలో మంత్రుల ప్రకటన ధరలకు క్షేత్ర స్థాయిలో ఉన్న ధరలకు పొంతనలేదు. ఆక్వా రైతులను ఆదుకునే విధంగా ఆక్వా ఉత్పత్తులకు ధరల స్థిరికరణ నిధి నుండి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి. ఆక్వా రైతులను ఆదుకోవడానికి ఒక కేజీ ఆక్వా ఉత్పత్తికి రు. 50 లు ప్రభుత్వం మద్దతు ధర అందించాలి. దాళ్వా పంటకు ఎకరాలకు 30 వేలు పెట్టుబడి పెట్టి సాగు నీరు లేక పంట కోల్పోయిన రైతులకు పెట్టుబడి నష్టం ప్రభుత్వం చెల్లించాలి. వరి, మిర్చి , పసుపు, బొప్పాయి, అరటి , ఇలా వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి" అంటూ ఆయన డిమాండ్ చేసారు. అయితే, రామానాయడుని పోలీసులు ఏలూరు వద్ద అడ్డుకున్నారు. పర్మిషన్ లేదని చెప్పారు. అయితే వైసీపీ నేతలు హడావిడి చేస్తూ గుంపులు గుంపులుగా వెళ్తున్నారని, తాను ప్రజా సమస్యల పై, ఒక్కడినే, సైకిల్ మీద వెళ్తుంటే, ఎందుకు ఆపుతున్నారని, మీరు పెళ్ళాం బిడ్డలని వదిలేసి ఎలా ప్రజా సేవ చేస్తున్నారో, నేను కూడా నన్ను ఎన్నుకున్న ప్రజల కోసం, వారి సమస్యల కోసమే, ఒక్కడినే, అదీ సైకిల్ పై వెళ్తున్నాని, రామానాయడు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read