కరోనా నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ మీడియా సమావేశం నిర్వహించారు. 2019 ఆదాయపన్నుల రిటర్నులు దాఖలు, ఆధార్-పాన్ లింక్, వివాద్ సే విశ్వాస్ పథకం, మార్చి, ఏప్రిల్, మే మాసాల జీఎస్​టీ దాఖలు చివరి తేది జూన్ 30 వరుక పొడిగిస్తున్నట్లు ఇదివరకే స్పష్టం చేసిన నిర్మల, ఇప్పుడు పేద వర్గాలకు కొంత ఊరట ఇచ్చే, విషయాలు చెప్పారు. ఆమె ఏమన్నారంటే, "పేదలు, కార్మికులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాం. వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకునేలా ప్యాకేజీ. లక్షా 70 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ. నగదు బదిలీ, ఆహార భద్రత ఈ రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి. ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా ఆర్థిక ప్యాకేజీ. వైద్యులకు ప్రత్యేక బీమా... నగదు బదిలీ, ఆహార భద్రత ఈ రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి..ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా ఆర్థిక ప్యాకేజీ. శానిటేషన్‌ వర్కర్లు, ఆశా, పారామెడికల్, వైద్యులు, నర్సులకు ప్రత్యేక బీమా. ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున బీమా. కరోనాపై పోరాటంలో కలిసి వచ్చేవారికి భద్రత కల్పించేలా చర్యలు."

"లక్షా 70 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ. గరీబ్‌ కల్యాణ్‌ స్కీమ్‌ పేరుతో ఆర్థిక ప్యాకేజీ. లాక్‌డౌన్‌ వల్ల ప్రభావితమైనవారిని ఆదుకునేలా ప్యాకేజీ. వలస కార్మికులు, మహిళలు, పేదలకు మేలు చేసేలా ప్యాకేజీ. ఈ ప్యాకేజీని రెండు విధాలుగా అందిస్తాం. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా సాయం. పేదవాళ్లలో ఒక్కరూ కూడా ఆహారం లేకుండా ఉండే పరిస్థితి రానీయం. రానున్న 3 నెలలకు ఒక్కొక్కరికి నెలకు 5 కేజీల బియ్యం పంపిణీ. బియ్యం, గోధుమలో ఏదికావాలన్నా అందిస్తాం. ఇప్పటికే ఇస్తున్న 5 కేజీలను అదనంగా మరో 5 కేజీలు అందిస్తాం. కుటుంబానికి కిలో చొప్పున పప్పులు అందిస్తాం. రానున్న 3 నెలలకు కావాల్సిన రేషన్‌ను 2 వాయిదాల్లో తీసుకోవచ్చు. ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా ఆర్థిక ప్యాకేజీ. నగదు బదిలీ, ఆహార భద్రత అంశాలపై ప్రధానంగా దృష్టి. శానిటేషన్‌ వర్కర్లు, ఆశా, పారామెడికల్, వైద్యులు, నర్సులకు ప్రత్యేక బీమా. ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున బీమా. కరోనాపై పోరాటంలో కలిసి వచ్చేవారికి భద్రత కల్పించేలా చర్యలు.

"పీఎం కిసాన్‌ యోజనలో భాగంగా రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు. దేశవ్యాప్తంగా 8.69 కోట్ల మంది రైతులకు ప్రయోజనం. ఉపాధి హామీ వేతనాలు రూ.182 నుంచి రూ.202కు పెంపు. 5 కోట్ల కుటుంబాలకు లబ్ది. ప్రతి కార్మికుడికి దీనిద్వారా రూ.2 వేలు అదనంగా చేకూరుతుంది. ఈ మొత్తం ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వారి ఖాతాల్లోకి చేరుతుంది. జన్‌ధన్‌ యోజన ఖాతాల్లో 3 నెలలపాటు నెలకు రూ.500 చొప్పున జమ. దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం. కుటుంబ అవసరాలకు ఈ మొత్తం చేదోడుగా ఉంటుంది. 3 నెలల్లో మూడు గ్యాస్ సిలిండర్లు... కుటుంబ అవసరాలకు ఈ మొత్తం చేదోడుగా ఉంటుంది.ఉజ్వల పథకం కింద లబ్దిదారులకు 3 గ్యాస్‌ సిలిండర్లు. 3 నెలల్లో మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ ద్వారా 8.3 కోట్లమంది లబ్దిదారులకు ప్రయోజనం. 'ఈపీఎఫ్ చందా ప్రభుత్వమే చెల్లిస్తుంది...' రానున్న 3 నెలలకు ఈపీఎఫ్‌ చందా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉద్యోగి వాటా 12 శాతం, యజమాని వాటా 12 శాతం కలిపి ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉద్యోగుల ఈపీఎఫ్‌ ఖాతాల్లోకి ప్రభుత్వమే జమ చేస్తుంది. వందమంది లోపు ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఇది వర్తిస్తుంది. "

"రూ.15 వేలులోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్‌ కేంద్రమే భరిస్తుంది. స్వయం సహాయక బృందాలు... స్వయం సహాయక బృందాలకు రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపు. ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల పరిమితిని రూ.20 లక్షలకు పెంపు. ఎలాంటి పూచీకత్తు లేని రుణాలు అందజేస్తాం. 63 లక్షల స్వయం సహాయక బృందాలకు లబ్ది. కార్మికుల సంక్షేమం... భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రూ.31 వేల కోట్ల నిధి ఇప్పటికే ఉంది. దేశవ్యాప్తంగా 3.5 కోట్లమంది నమోదిత భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఈ ఆపత్కాలంలో వారి అవసరాల కోసం ఈ మొత్తాన్ని ఉపయోగిస్తాం. 'ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు...' రాష్ట్రాలు డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ను వినియోగించుకోవాలి. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో, ఖాళీ జేబులతో ఉండకూడదు. " అంటూ నిర్మల ప్రకటించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read