నామినేషన్ల ఉపసంహరణప్రక్రియను కూడా వైసీపీ అపహస్యం చేసిందని, చిత్తూరులో టీడీపీ అభ్యర్థులెవరూ అందుబాటులో లేకున్నా, 4, 14వార్డులకు చెందిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల నామి నేషన్లను వైసీపీవారే అధికారులను భయపెట్టి బలవంతంగా ఉపసంహరింపచేశారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నామినేషన్లు వేయడం, మొదలు ప్రతి చర్యను వీడియో రికార్డింగ్ చేయాలని తాము ఎస్ఈసీనికోరినా పట్టించుకోలేదన్నారు. ఎవర్ నామినేషన్లు వేశారు, ఎవరు వాటిని ఉపసంహరించుకున్నారో కూడా తెలియకుండా అధికారలసాయం తో వైసీపీవారు బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించడం ఏమి టని అశోక్ బాబు వాపోయారు. ఎన్నికలఏజెంట్, అభ్యర్థితో సంబం ధంలేకుండా వైసీపీప్రోద్భలంతో జరిగే నామినేషన్ల ఉపసంహరణ కు ఎన్నికల కమిషనే బాధ్యతవహించాల్సి ఉంటుందని టీడీపీనేత స్పష్టంచేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికలకమిషన్ ప్రకటించాల్సిఉందని, ఈలోపే అభ్యర్థులు వారికివారే నామినేషన్లు ఉపసంహరించుకున్నా రా లేదా ఎవరైనా వాటిని ఉపసంహరింపచేశారా అనేదిశగా ఎస్ఈ సీ విచారణ జరపాలన్నారు.

sec 04032021 2

ఈ విధంగా జరిగిన మున్సిపాలిటీలపై ఎన్నికలకమిషనర్ ప్రత్యేకశ్రద్ధ పెట్టాలన్నారు. చిత్తూరుజిల్లాలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఫోర్జరీసంతకాలతో అధికారులే బాహటంగా ఉపసంహరింపచేస్తున్నారని అశోక్ బాబు మండిపడ్డా రు. అభ్యర్థులను ప్రకటించేముందు ఎన్నికలకమిషన్ ఒకసారి నా మినేషన్లుఉపసంహరించుకున్నవారితో సంప్రదించాలని, వారికి వారే విత్ డ్రా చేసుకున్నారాలేక ఎవరైనా చేశారా అనేది తెలుసుకో వాలని అశోక్ బాబు సూచించారు. బలవంతంగా టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణజరిగినప్రాంతాలపై ఎన్నికల కమిషనర్ ప్రత్యేకదృష్టిపెట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులప్రమేయం లే కుండా జరిగిన నామినేషన్ల ఉపసంహరణప్రక్రియలపై టీడీపీ తరు పున ఎన్నికలకమిషనర్ కు ఫిర్యాదుచేయబోతున్నామన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read