స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న అరాచకం ప్రతి రోజు ఏదో ఒకట చూస్తూనే ఉన్నాం. పోటీలో ఉండ కూడదు అని బెదిరింపు, పోటీలో నుంచుంటే ఉపసంహరించుకోవాలని బెదిరింపు, వేరే పార్టీకి ఓటు వేస్తె బెదిరింపు, సంక్షేమ కార్యక్ర్తమాలు తీసేస్తామని బెదిరింపు, అక్రమ కేసులు, అరెస్ట్ లు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్టు అవుతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తుంది సాంపుల్ మాత్రమే. గత ఏడాది క-రో-నా కారణంగా మొదలైన ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఆగిపోయింది. అప్పట్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా బెదిరించి పెద్ద ఎత్తున ఏకాగ్రీవాలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నోటిఫికేషన్ వస్తూ ఉండటం, గతంలో బలవంతపు ఏకాగ్రీవాలు చేస్తే, తగిన ఆధారాలు చూపిస్తే, మళ్ళీ పోటీ చేయవచ్చు అంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో, అధికార పార్టీ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. అనుకున్నట్టు గానే, పెద్ద ఎత్తున అభ్యర్ధులు నిన్న ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు చేసారు. ఆ వస్తున్న ఫిర్యాదులు చేసి, ఎన్నికల కమిషన్ అధికారులు కూడా అవక్కవుతున్నారు. వస్తున్న ఫిర్యాదులు అన్నీ నిజమా కాదా అని, తేల్చే పనిలో పడ్డారు. అభ్యర్ధుల దగ్గర నుంచి తగిన ఆధారాలు తీసుకుంటున్నారు.

nominations 20022021 2

తాము నామినేషన్ వేయటానికి వస్తే బెదిరించారని కొందరు, నామినేషన్ వేసిన తరువాత ఉపసంహరించుకోవాలని బెదిరించారని మరి కొందరు, ఇలా ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్ధుల నుంచి ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా అరాచకాలు ఎక్కువ జరుగుతున్న చిత్తూరు జిల్లా నుంచి, 18 మంది అభ్యర్ధులు ఫిర్యాదు చేసారు. అలాగే విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్ధులే కాకుండా, మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు కూడా ఉన్నారు. తమ ఫిర్యాదులకు అప్పటి బెదిరించిన వీడియోలు, ఆడియో టేప్ లు, ఫోటోలు, పేపర్ క్లిప్పింగ్ లు లాంటివి కూడా జత పరిచారు. ఈ ఫిర్యాదులకు ఈ రోజు దాకా గడువు ఉండటంతో, ఈ రోజు మరింత మంది వచ్చే అవకాసం ఉందని ఎన్నికల కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. తిరుపతి డివిజన్ పరిధిలో 50 వార్డులకు నామినేషన్లు సమర్పించేందు అవకాసం ఇవ్వాలని, గతంలో బలవంతంగా బెదిరించినట్టు, టిడిపి కూడా ఫిర్యాదు చేసింది. అలాగే గుంటూరు, ముఖ్యంగా మాచర్ల నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read