ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు ఉదయం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. నిన్న హైదాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న చంద్రబాబు, ఉండవల్లి నివాసంలో హోం ఇసోలేషన్ లో ఉన్నారు. చంద్రబాబు స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడ్డారు. ఉదయం నుంచి అనేక మంది పార్టీలకు అతీతంగా చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆశించారు. కొద్ది సేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. మా మావయ్య చంద్రబాబు, అలాగే లోకేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు. ఉదయం నుంచి ఎన్టీఆర్ ట్వీట్ చేస్తారా లేదా అని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇదే ఆసరాగా తీసుకుని, పేటీయం బ్యాచ్లు రెచ్చిపోయాయి. అయితే ఎన్టీఆర్ ట్వీట్ చేయటంతో, పాపం వారి ఆశల మీద నీళ్ళు చల్లినట్టు అయ్యింది. జగన మోహన్ రెడ్డి, గవర్నర్, చిరంజీవి, ఇలా అనేక మంది ప్రముఖులు చంద్రబాబు త్వరగా కోలుకోవాలి అంటూ ఆకాంక్షించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read