రాజ్యంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విగ్యన్ భవన్ లో, రాజ్యాంగ దినోత్సవ వేడుకులు జరిగాయి. ఈ వేడుకుల్లో, ప్రధాని నరేంద్ర మోడి, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా ఎన్వీ రమణ పాల్గున్నారు. సుప్రీం కోర్టు జస్టిస్ లలిత్ ప్రారంభ ఉపన్యాసం చేసారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు గురించి వివరించారు. తరువాత కొంత మంది ప్రముఖులు ప్రసంగించిన తరువాత, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా, ఎన్వీ రమణ ప్రసంగించారు. రాజ్యాంగ సృష్టికర్తలకు తల వంచి నమస్కరిస్తూ ఉపన్యాసం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ చెప్పిన ఒక విషయాన్ని గుర్తు చేసారు, మన రాజ్యాంగం ఎంత గొప్పది అయినా, దాన్ని ఆచరణలో పెట్టే వారు చెడ్డ వారు అయితే, రాజ్యాంగం కూడా చెడుగా కనిపిస్తుందని అన్నారు. రాజ్యాంగం ఎంత చెడ్డది అయినా, దాన్ని అమలు చేసే వారు మంచి వారు అయితే, రాజ్యాంగం కూడా మంచిగా కనిపిస్తుంది అంటూ, అంబేద్కర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. న్యాయం అనేది, కేవలం జ్యుడీషియరీ నుంచే రావాలని కోరుకోవటం కరెక్ట్ కాదని, మిగత లెజిస్లేచర్, ఎక్జిక్యూటివ్ లకు కూడా అంతే బాధ్యత ఉంటుందని అన్నారు. లెజిస్లేచర్, ఎక్జిక్యూటివ్ నుంచి డీవియేషన్లు ఉంటే, అది న్యాయవ్యవస్థకు ఇబ్బంది అవుతందని అన్నారు.

nvramana 26112021 2

రాజ్యాంగం కల్పించిన హక్కులు విషయంలో, పౌరులకు అనేక విషయాలు తెలియాలని, దీనికి ఒక పెద్ద క్యాంపెయిన్ నడపాల్సిన అవసరం ఉందని అన్నారు. అనేక కేసులు లోవర్ కోర్టుల్లో పెండింగ్ ఉంటున్నాయని అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ మధ్య కాలంలో జడ్జిల విషయంలో, ఫిజికల్ అ-టా-క్స్ తో పాటుగా, సోషల్ మీడియాలో కూడా అనేక రకాలుగా దాడి చే-స్తు-న్నా-ర-ని, ఇవి ప్రేరేపిత దా-డు-లు అని, ఇలాంటి వాటి పై పోలీస్ శాఖ దృష్టి పెట్టల్సిన అవసరం ఉంది అంటూ, ప్రధాని మోడి సమక్షంలోనే వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా సోషల్ మీడియా విషయంలో, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఈ కేసు సిబిఐ విచారణ చేస్తూ, హైకోర్టులో కూడా నడుస్తుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇందులో ఉన్న సంగతి తెలిసిందే. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని, ఇప్పటికే సిబిఐ తెలిపింది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంసం అయ్యాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read