టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతూ ఉంటుంది. ఇక రాజకీయాల్లో అయితే, రోజు రోజుకీ మారి పోతూ ఉంటుంది. ఇప్పుడు బీజేపీ, వైసిపీ మధ్య అదే జరుగుతుందా అనే సందేహం కలుగుతుంది. మొన్నటి దాకా ఇద్దరూ లోపాయకారీ ఒప్పందంతో పని చేసారు. ఎలా అయినా చంద్రబాబుని దింపాలి అనే ఉద్దేశంతో, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కలిసి, వివిధ రకాలుగా రాజకీయం నడిపి, చంద్రబాబు దిగిపోవటానికి, అన్ని విధాలుగా సహకరించుకుని, మొత్తానికి జగన్ ను ఎక్కించారు. అయితే మొదట నెల రోజులు అంతా సాఫీగా సాగిపోయినా, తరువాత నుంచి మాత్రం, జగన్ కు బ్రేక్ లు ఇస్తూ వస్తున్నారు. చిన్న చిన్న పనులు కూడా చెయ్యటం లేదు. కనీసం స్టీఫన్ రవీంద్ర, శ్రీలక్ష్మీ లాంటి వారిని, పక్క రాష్ట్రం నుంచి డిప్యుటేషన్ పై తెచ్చుకుంటానికి కూడా కేంద్రం ఒప్పుకోలేదు. ఇక నిధులు సంగతి అయితే సరే సరి. విభజన హామీల ఊసే లేదు.

amitshah 02102019 2

పోలవరంలో జగన్ ప్రభుత్వ వైఖరిని తప్పు బడుతూ, పార్లమెంట్ లోనే ప్రకటన చేసారు. ఇక విద్యుత్ పీపీఏ ల విషయంలో అయితే, ఒక అడుగు ముందుకు వేసి, జగన్ తప్పుడు సమాచారం చెప్తూ, తప్పుదోవ పట్టిస్తున్నారని, ఏకంగా కేంద్ర మంత్రి మీడియా ముందు చెప్పారు. అయితే, ఢిల్లీలో లాబీయింగ్ లో బిజీగా ఉండే విజయసాయి రెడ్డి, పప్పులు కూడా ఇప్పుడు అక్కడ ఉడకటం లేదని సమాచారం. మొన్నా మధ్య, మేము చేసే ప్రతి పనికి, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని చెప్పిన దగ్గర నుంచి, విజయసాయి రెడ్డిని, ఢిల్లీ వర్గాలు దూరం పెట్టాయని తెలుస్తుంది. అయితే, ఇప్పుడు సిబిఐ నుంచి, జగన్ మోహన్ రెడ్డికి అదిరిపోయే జర్క్ వచ్చింది. కోర్ట్ విచారాణ నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ, జగన్ వేసిన పిటీషన్ పై, సిబిఐ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

amitshah 02102019 3

జగన్ మోహన్ రెడ్డి సియం హోదాలో ఉన్నారని కూడా చూడకుండా, సిబిఐ, కోర్ట్ లో బలమైన వాదనలు వినిపించింది. జగన్ మోహన్ రెడ్డి ఆర్ధిక నేరాల పై సుప్రీం కోర్ట్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూడా తమ వాదనల్లో వినిపించారు. అంతే కాదు, జగన్ మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడే సాక్ష్యులను బెదిరించారని, ఇపుడు సియంగా ఉంటూ, ఏదైనా చేస్తారని, ఘాటుగా వాదనలు వినిపించారు. అయితే అంతా బాగుంది అనుకున్న టైంలో, సిబిఐ, ఇలా రివర్స్ అవ్వటం పై, వైసిపీ పార్టీలో గుబులు మొదలైంది. అమిత్ షా నుంచి వచ్చిన ఇన్ డైరెక్ట్ వార్నింగా అంటూ, గుసగుసలాడు కుంటున్నారు. సిబిఐ ఉన్నట్టు ఉండి స్పీడ్ పెంచటం పై, వైసిపీలో అంతర్మధనం మొదలైంది. ఒక వేళ కోర్ట్ కనుక, ప్రతి శుక్రవారం విచారణకు రావాలి అని అంటే, అంతకంటే అప్రతిష్ట ఏమి ఉండదని, గుబులు పడుతున్నారు. మరి, ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.

చంద్రబాబు అధికారంలో ఉండగా, ప్రతి రెండు మూడు రోజులకు మీడియా ముందుకు వచ్చి, అక్కడ ఏదో జరిగిపోయింది, ఇక్కడ ఏదో జరిగిపోయింది, పోలవరం నిర్మాణంలో క్రాక్ లు వచ్చాయి, ఇలా అనేక ఆరోపణలు చేస్తూ, అప్పటి ప్రభుత్వానికి చిరాకు తెప్పిస్తూ ఉండేవారు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మాత్రం అసలు అడ్డ్రెస్ లేరు. కేవలం చంద్రబాబు అధికారంలో ఉంటే మాత్రమే, వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తారా ? జగన్ ప్రభుత్వం పై ఏమి విమర్శలు చెయ్యరా, ఇసుక కొరత, పేపర్ లీక్, వాలంటీర్లుగా వైసిపీ నేతలు, ప్రభుత్వ మద్యం దుకాణాలు, పోలవరం ఆగిపోవటం, అమరావతి ఆగిపోవటం, ఇలా అనేక సమస్యల పై ఎందుకు ఉండవల్లి మాట్లాడటం లేదు అంటూ, విమర్శలు వస్తూ వచ్చాయి. విమర్శలు మరీ ఎక్కువ అయితే బాగోదు అనుకున్నారో ఏమో కాని, నాలుగు నెలల తరువాత, ఉండవల్లి మీడియా ముందుకు వచ్చారు.

undavalli 02102019 1

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, ఆనం రోటరీ హాలులో మంగళవారం ఉండవల్లి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ముందుగా జమ్ము కాశ్మీర్ అంశం పై మొదలు పెట్టారు. రెండు నెలలుగా అక్కడ కర్ఫ్యూ పెట్టి, గొప్పగా చెప్పుకుంటున్నారని, బీజేపీని విమర్శించారు. కాశ్మీర్ లో, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని చెప్తూ, మోడీ లాంటి మత పిచ్చి ఉన్న వాడిని, ట్రాంప్ జాతి పిత అనటం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఇక జగన్ పై మాట్లాడుతూ, ఈ నాలుగు నెలల్లో జగన్ పై చెప్పుకోవటానికి బీబత్సమైన చెడు లేదని, అలాని ఎదో పొడిచేసారు అని చెప్పుకునే పరిపాలన లేదని చెప్పారు. ఇసుకతో విపరీతమైన మైనస్ లో ఉన్నారని, కొత్త పాలసీతో ఈ సమస్యను అధిగామిస్తారాని అనుకుంటున్నా అని అన్నారు. ప్రత్యెక హోదా పై విలేఖరులు అడగగా, ఆయన ఇవ్వరు , మెజారిటీ ఉందని ఈయన చెప్పేసారుగా అని అన్నారు.

undavalli 02102019 1

ఇక జగన్ కు వచ్చిన మెజారిటీ పై, తరువాత వచ్చే పరిణామాల పై సంచలన వ్యాఖ్యలు చేసారు ఉండవల్లి. జగన్ మోహన్ రెడ్డి గారు, మీకు అధికారం శాశ్వతం అనుకుని ఉండమాకండి, మీ ఎమ్మెల్యేలే మీ పై తిరగబడే అవకాసం ఉంది. మీ ఎమ్మెల్యేలను సంతృప్తిపరచండి. అందరూ ఆనందంగా ఉంటేనే, మీకు మంచిది అని ఉండవల్లి అన్నారు. చరిత్రలో 50 శాతం పైన ఓట్లు రెండు సార్లు వచ్చాయని, రెండు సార్లు వారు తొమ్మిది నెలలు తిరగకుండానే బోల్తా పడ్డారని అన్నారు. "1972లో పీవీ నరసింహారావు ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు 56 శాతం ఓట్లు, 219 సీట్లు వచ్చాయి. కానీ ఆయన్ను కేవలం 9 నెలల్లో దింపేశారు. 1994లో టీడీపీ, కమ్యూనిస్టులకు 54 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీకి 213 సీట్లు, సీపీఐ, సీపీఎంలకు 34 సీట్లు వచ్చాయి. కాంగ్రె్‌సకు కేవలం 26 సీట్లే వచ్చాయి. కానీ 9 నెలల్లో ఎన్టీఆర్‌ను దింపేశారు. ఎన్టీఆర్‌ మీద చంద్రబాబు తిరగబడతారని ఎవరైనా అనుకున్నారా?’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సీఎం జగన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు.

సంవత్సరానికి ఒక్క రోజు, మద్యం, మాంసం ముట్టకుండా ఉండే రోజు, అక్టోబర్ 2. ఆ మహాత్ముడి జయంతి సందర్భంగా, గాంధీ తాతకు ఈ దేశం ఇచ్చే నివాళి ఇది. అక్టోబర్ 2న, మాంసం, మద్యం అమ్మకూడదు అనేది చట్టం కూడా, సామాన్య ప్రజలు ఎవరైనా మద్యం తాగి కనిపించినా, చిరు వ్యాపారస్తులు ఎవరైనా మాంసం విక్రయాలు అమ్మినా, వాళ్ళను తీసుకు వెళ్లి లోపల వేస్తారు. అయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం, ఇవేమీ పట్టవు. ఏకంగా, ఎమ్మెల్యేల సారధ్యంలోనే, కొత్తగా ఏర్పడిన గ్రామ సచివాలయాల సాక్షిగా, ఆ మహాత్ముడి ఆశయాలకు తూట్లు పొడుస్తూ, మాంసంతో విందు చేసుకోవటం కలకలం రేపింది. ఏకంగా గ్రామ సచివలయాల్లో, ఎమ్మెల్యేలు పాల్గున్న చోట, ఇలా మాంసం తినటంతో, అందరూ అవాక్కయ్యారు. ప్రభుత్వ కార్యక్రమంలోనే అక్టోబర్ 2న మాంసంతో విందు భోజనం పెడితే, ఇక సామాన్యులు, ఎందుకు ఈ రూల్స్ పాటిస్తారు ?

sachivalayam 02102019 2

ఈ సంఘటన, చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెం మండలంలోని 2 చోట్ల ప్రభుత్వ కార్యక్రమంలో జరిగింది. రెండు చోట్లా ప్రభుత్వ కార్యాలయాల్లో మాంసాహారం దర్శనమిచ్చింది. మత్తేరిమిట్ట, చినపాండూరులో గ్రామ సచివాలయం ప్రారంభ కార్యక్రమంలో అక్కడకు వచ్చిన ప్రజలకు మాంసాహారంతో భోజనం పెట్టారు. మత్తేరిమిట్టలో గ్రామ సచివాలయం ఎమ్మెల్యే ఆదిమూలం ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రారంభించి వెళ్లిన తర్వాత మాంసాహారంతో విందు ఏర్పాటు చేసారు. ఇక చినపాండూరు గ్రామ సచివాలయం ప్రారంభ కార్యక్రమంలో నిర్వాహకులు చికెన్ బిర్యాని పెట్టారు. గాంధీ జయంతి రోజు మాంసాహారం నిషేధం ఉన్నా అధికారులు కాని, నేతలు కాని, పట్టించుకోలేదు. వారికే అలా ఉంటే, ఇక ప్రజలు ఏముంది, వారు పెట్టారు కదా అని వీరు లాగించారు.

sachivalayam 02102019 3

మరో పక్క, మద్యం దుకాణాల పై, టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ జయంతి రోజు మద్యం దుకాణాలు నిర్వహించడమేంటని, ఇంతకంటే ఘోరం ఇంకా ఏమి ఉంటుందని ప్రశ్నించారు. ఒక ప్రభుత్వమే దగ్గర ఉండి, పోలీసులను పెట్టి మరీ మద్యం అమ్మిస్తూ గాంధీ జయంతి రోజున ఎలాంటి సందేశాలు ఇస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎవరి విశ్లేషణకూ అర్థంకాని రీతిలో జగన్‌ వ్యవహారశైలి ఉందని, రాష్ట్రం జగన్‌ జాగీరు కాదని అన్నారు. బ్రిటీష్‌ వారైనా చట్టాన్ని అనుసరించేవారని, జగన్ కనీసం చట్టాన్ని కూడా గౌరవించడం లేదని విమర్శించారు. అలాగే ప్రభుత్వం మొదలు పెట్టిన మద్యం దుకాణాల పై, ప్రజలు కూడా తిరగబడుతున్నారు. జనావాసాల మధ్య మద్యం అమ్మకాలు ఏమిటంటూ మహిళలు భగ్గుమంటున్నారు.

జగన్ మోహన్ రెడ్డి పై, నిన్న సిబిఐ కోర్ట్ లో, సిబిఐ వేసిన పిటీషన్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ పిటీషన్ లో సిబిఐ పేర్కున్న అంశాల పై జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. ఇలాంటి వ్యక్తి మన సియం అయినందుకు సిగ్గు పడాలని అన్నారు. సిబిఐ నిన్ను ఒక అవినీతి చక్రవర్తి అంటుంటే, మీరు మాత్రం అవినీతిని అంతం చెయ్యటానికి, దేవుడు నన్ను పంపించాడు అని చెప్పటం సిగ్గు చేటు అని చంద్రబాబు అన్నారు. "జగన్‌ జైల్లో ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేసినందున, ముఖ్యమంత్రిగా మరింతగా సాక్షులను ప్రభావితం చేయగలరని సీబీఐ చేసిన వ్యాఖ్యల పై జగన్ సమాధానం చెప్పాలి. అవినీతి నియంత్రణకు తనను దేవుడు పంపాడని ఆయన చెప్పడం సిగ్గుచేటు. సీబీఐ కేసుల్లో నిండా మునిగిన ఆయన నీతులు చెప్పడం విడ్డూరం. అవినీతి ఆస్తుల్ని ప్రభుత్వానికి అప్పగించి నిజాయతీ పాటిస్తే.. అప్పుడు జగన్‌ను నేనూ అభినందిస్తా’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

cbi 02102019 2

రాష్ట్రంలో అన్ని జిల్లాలకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీరాజ్‌ ఛాంబర్ల రాష్ట్ర అధ్యక్షులతో నిన్న రాత్ర గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఇదే సందర్భంలో, జగన్ సిబిఐ కోర్ట్ కు వారం వారం రాకుండా, తనకు మినహాయింపు ఇవ్వాలి అంటూ, సిబిఐ కోర్ట్ లో వేసిన పిటీషన్ పై, సిబిఐ వినిపించిన వాదనలు, వార్తాల్లో రావటంతో, చంద్రబాబు ఆ విషయం ప్రస్తావించారు. సిబిఐ, జగన్ పై చేసిన తీవ్ర వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చట్టం ముందు, ఒక సియం అయినా, సామాన్యుడు అయినా ఒక్కటే అనే విధంగా, సిబిఐ వాదనలు చేసింది. కోర్ట్ విచారణ నుంచి మినహయింపు కోరుతూ, జగన్ వేసిన పిటీషన్ ను కొట్టేయాలని కోర్ట్ ని కోరింది.

cbi 02102019 3

చట్టం ముందు ప్రతి పౌరుడు సమానమేనని, అధికారంలో ఉన్నంత మాత్రాన, కోర్ట్ విచారణ నుంచి వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరటం, రాజ్యాంగంలోని 14వ అధికరణకు విరుద్ధమని సిబిఐ కోర్ట్ కు తెలిపింది. జగన్ జైల్లో ఉన్న సమయంలోనే, తన పలుకుబడిని, ఉపయోగించి సాక్ష్యాలను ప్రభావితం చేసారని, ఇప్పుడు సీఎం హోదాలో, అన్ని అధికారాలూ ఆయనకు ఉన్నాయని తెలిపింది. నిందితుల హోదా, ఆర్థిక నేపథ్యం ఆధారంగా వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వకూడదని, ఇలా చేస్తే, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కోర్ట్ కు చెప్పింది. అధికారాన్ని ఉపయోగించి, సాక్షులు భయాందోళనకు గురయ్యే అవకాశముందని తెలిపింది. అందుకే జగన్ కు కోర్ట్ నుంచి మినహాయింపు ఇవ్వ కూడదు అని తెలిపింది.

Advertisements

Latest Articles

Most Read