ప్రముఖ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ – జనసేనాని పవన్‌కల్యాణ్‌ మధ్య జరిగిన భేటీపై సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నది. ఒక సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పవన్‌కల్యాణ్‌ను ఎందుకు కలిశారో అర్ధంకాక రాజకీయ వర్గాలు, జనం, అభిమానులు తలలు పట్టుకున్నారు.అసలు నాదెండ్ల మనోహర్‌, పవన్‌కల్యాణ్‌ను ఎందుకు కలవాల్సి వచ్చింది? అనే సందేహాలు షికార్లు చేస్తున్నాయి. నాదెండ్ల భేటీపై పుకార్లు కూడా దావానంలా వ్యాపించాయి. అసలే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిన నేప ధ్యంలో వీరిద్దరి భేటీ పలు అనుమానాలకు తావిస్తోంది. నాదెండ్ల పార్టీ మారే ప్రస క్తేలేదని, ఆయన కాంగ్రెస్‌కు కొండంత అండగా ఉంటారే కాని ఇటువంటి పరిస్ధితుల్లో పార్టీ వదిలి వెళ్లారని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. పవన్‌కల్యాణ్‌తో నాదెండ్ల కలిసి ఉంటే ఏదైనా వ్యక్తిగతంగా కలిసి ఉండొచ్చని అంటున్నారు.

pk 24062018 2

కాగా వచ్చే సంవత్సరం అసెంబ్లి ఎన్నికలు ఉండడంతో పాటు ప్రస్ధుత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్న నేపధ్యంలో అనేక నూతన సమీకరణలకు తెర లేచింది. రానున్న ఎన్నిక ల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న క్రమంలో వీరిద్దిరి భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందంటున్నారు. అయితే ఇంకో ప్రచారం కూడా చక్కర్లు కొడుతోంది. ఇంకా సంవత్సరం వ్యవధిలో అసెంబ్లి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌తో జనసేన పొత్తు గురించి కూడా చర్చించేందుకే నాదెండ్ల మనోహర్‌ , జనసేనానిని కలిశారనే మరో వాదన వినిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో అవలంభించాల్సిన రాజకీయ అంశాలు, పొత్తులు, పార్టీ అభివృద్ధి గురించి రాహుల్‌గాంధీతో ఇటీవల ఢిల్లిలో చర్చించిన నాదెండ్ల మనోహర్‌ , ఆ అంశాలపై పవన్‌తో చర్చించేందుకే భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది.

pk 24062018 3

రానున్న ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసి పోటీ చేసేందుకు ఉన్న అవకాశాల పై చర్చించేందుకు మనోహర్‌ , పవన్‌తో కలిసి,చర్చించారంటున్నారు. రానున్న ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ , వైసీపీ పార్టీతో కలిసి పని చేసేందుకు అంత ఇష్టంగా లేరన్న సమాచారంతోనే నాదెండ్ల ముందస్తు వ్యూహంతో పవన్‌తో ప్రాథమికంగా కలిశారంటున్నారు. ఈ క్రమంలో తాజాగా గుంటూరు జిల్లా నంబూరులో దశావతార శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్ధానంలో జరిగిన ధ్వజస్తంభం కార్యక్రమంలో కూడా నాదెండ్ల మనోహర్‌, పవన్‌కల్యాణ్‌ ఇద్దరూ కలిసి, మాట్లాడుకున్నారు. ఈ విషయంలో ఏర్పడిన రాజకీయ సందిగ్ధతకు తెర తొలగాలంటే ఆ ఇద్దరు నేతల్లో ఎవరో ఒకరు నోరు తెరిచి, మాట్లాడితే తప్ప వాస్తవాలు బహిర్గతమయ్యే పరిస్దితి లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయినా రాష్ట్రంలో చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీతో పవన్ వెళ్ళే అవకాసం లేదని, ఇప్పటికే ఆయన బీజేపీతో పూర్తి అవగాహనతో పని చేస్తున్న విషయాన్ని, రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

2014లో తాను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, రాష్ట్రాన్ని ముందుకు నడిపించటమే చంద్రబాబు పని. తన కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ, ఉదయం 7 గంటల నుంచి మొదలయ్యే సమీక్షలు, రాత్రి 11 గంటల వరకు కొనసాగేయి. ఒక పక్క కేంద్రం పెడుతున్న ఇబ్బందులు, రాష్ట్రంలో కొన్ని పార్టీలు పన్నుతున్న కుట్రలను ఎదుర్కోవాలి. మరో పక్క పెట్టుబడుల కోసం నిరంతరం వివిధ పక్షాలతో చర్చలు. మరో పక్క, ప్రజల సంక్షేమం కోసం పధకాల రివ్యూలు, రాష్ట్రంలో అభివృద్ధి, ఇలా ప్రతి నిమషం రాష్ట్ర అభివృద్ధి కోసమే చంద్రబాబు పాటు పడుతూ వచ్చారు. ఈ క్రమంలో పార్టీకి దూరం అయ్యారనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. రాష్ట్రంలో కొన్ని చోట్ల పార్టీలో ఉన్న కలహాలు, ప్రత్యర్ధికి ఆయుధం అవుతున్నాయని, చంద్రబాబు పట్టించుకుంటేనే ఈ సమస్య తీరుతుందనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది.

tdp 24062018 2

అయితే ఎట్టకేలకు చంద్రబాబు వీరి మోర ఆలకించారు. ఎన్నికలు డిసెంబర్ లోనే వస్తాయి అనే సంకేతాలు రావటంతో, ఇక నుంచి పరిపాలనతో పాటు పార్టీని కూడా చూసుకుంటాను అని చెప్పారు. చెప్పటమే కాదు, చేసి చుపిస్తున్నరు కూడా. గత వారం రోజుల నుంచి, ఉదయం నుంచి సాయంత్రం వరకు సెక్రటేరియట్ లో ఉంటూ, సాయంత్రం నుంచి రాత్రి వరకు పార్టీ సమీక్షలకు టైం కేటాయిస్తున్నారు. ఈ పరిణామంతో, పార్టీ వర్గాలు సంతోషిస్తున్నాయి. ఇక చంద్రబాబు పార్టీ విషయాలు చూసుకుంటారు కాబాట్టి, నిశ్చింతగా ఉండవచ్చు అని, ప్రత్యర్ధి పార్టీల కుట్రలు గట్టిగా తిప్పి కొట్టే వీలు ఉంటుందని అంటున్నారు.

tdp 24062018 3

చంద్రబాబు కూడా సమన్వయ కమిటీ సమావేశం ఎప్పుడు జరిపినా ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కూడా సూచిస్తున్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీ సమీక్షను కూడా మొదలు పెట్టారు. వరుసగా సర్వేలు చేయిస్తున్నారు. 40 నియోజకవర్గాలలో పార్టీ వెనుకబడి ఉందని నిర్దారించుకుని వాటి పై దృష్టి పెట్టారు. పార్టీ నేతలను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతిపక్షాల వ్యూహానికి ప్రతివ్యూహం రూపొందించుకుంటున్నారు. ప్రతి మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు..ఎమ్మెల్యేలు.. ఎంపీలు... జిల్లా పార్టీ అధ్యక్షులు.. ఇన్‌ఛార్జ్‌లు.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు.

మన రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టటానికి, ఢిల్లీ ఆధ్యర్యంలో, కొన్ని తోడేళ్ళు హైదరాబాద్ నుంచి, మన రాష్ట్రానికి వచ్చి, మన మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఒక ప్రాంతం వెళ్లి, ఇంకో ప్రాంతం అభివృద్ధి అయిపోతుంది అని ఏడవటం వీరి పని.. చంద్రబాబు మాత్రం, మూడు ప్రాంతాలని సమానంగా చూస్తున్నారు. కోస్తాలో అమరావతి కేంద్రంగా పరిపాలన, హెల్త్, ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేస్తున్నారు. సీమలో తిరుపతి కేంద్రంగా, ఎలక్ట్రానిక్స్ హబ్ గా, ఉత్తర కోస్తాలో విశాఖ కేంద్రంగా ఆర్ధిక రాజాధానిగా తయారు చేస్తున్నారు. చెప్పటమే కాదు, చేసి చూపిస్తున్నారు కూడా. అయినా, కొంత మంది వచ్చి, మన మధ్యే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి సమాధానమా అన్నట్టు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే స్వచ్ఛత సర్వేక్షణ్‌ పురస్కారాల్లో కూడా మూడు ప్రాంతాలకి అవార్డులు వచ్చాయి.

andhra 24062018 2

దేశంలోని, టాప్ టెన్‌ క్లీన్ సిటీల్లో, మూడు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్‌వే! 5, 6, 7 ర్యాంకుల్లో వరుసగా విజయవాడ, తిరుపతి, విశాఖ నిలిచాయి. కోస్తా నుంచి విజయవాడ, సీమ నుంచి తిరుపతి, ఉత్తర కోస్తా నుంచి విశాఖ టాప్ స్థానాల్లో నిలిచి, చంద్రబాబు మూడు ప్రాంతాలని ఎలా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారో తెలియచేసింది. ఒంగోలుకు 83, చిత్తూరుకు 95, తెనాలికి 108, కాకినాడకు 118, నరసరావుపేటకు 120, గుంటూరుకు 129, రాజమహేంద్రవరానికి 138, విజయనగరానికి 154, కడపకు 163 ర్యాంకులు దక్కాయి. 10 లక్షలకు మించిన జనాభా ఉన్న నగరాల్లో విజయవాడ స్వచ్ఛ సిటీగా ఎంపిక కాగా, 3 లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో తిరుపతి సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో ఉత్తమ నగరంగా ఎంపికైంది.

andhra 24062018 3

దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణలో సత్తా చాటిన నగరాలు, మున్సిపాలిటీలకు కేంద్రం ప్రభుత్వం శనివారం అవార్డులు అందజేసింది. మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దేశంలో లక్షకు పైబడిన జనాభా ఉన్న మున్సిపాలిటీలు 485 ఉండగా, మన రాష్ట్రంలోనే 31 ఉన్నాయని ఆయన తెలిపారు. ఇవన్నీ 262 ర్యాంకుల్లోపే నిలవడం విశేషమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంలో అధికారులు, ఉద్యోగులు, కార్మికులు అంకితభావంతో పని చేయడంతోపాటు స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. నాలుగేళ్లలో మున్సిపాలిటీల స్థితిగతులను ఎంతో మెరుగు పరిచినట్లు నారాయణ చెప్పారు. ఈ విషయంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఇకముందు కూడా మరింత మెరుగ్గా పని చేసి, దేశంలోని 10 అగ్రగామి మున్సిపాలిటీల్లో అన్నీ రాష్ట్రానికి చెందినవే ఉండేలా చూడాలని కోరారు.

అరుదైన నరాల బలహీనతతో బాధపడుతున్న రోగి చికిత్సకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.15 లక్షలు మంజూరు చేశారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు రోగి అజయ్ కుమార్ ను అతని తల్లిదండ్రులు తీసుకొచ్చి కుమారుడి సమస్యను వివరించారు. అజయ్ కుమార్ ను వేధిస్తున్న తీవ్రమైన నరాల రోగ నివారణ ప్రక్రియలో చికిత్సకు అవసరమైన ఖర్చును మంజూరు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదారతను చాటుకున్నారు. అనంతపురం పట్టణంలోని వేణుగోపాల నగర్ కు చెందిన ఎన్నికపాటి శ్రీరాములు కుమారుడు అజయ్ కుమార్ చిన్నవయసులో బ్రైన్ ఫీవర్ మూలంగా తీవ్రమైన నరాల జబ్బున పడ్డాడు.

32 ఏళ్ల వయసు వచ్చినా మాట్లాడలేకపోవడం, కుడి చేయి మెలితిరిగి ఉండటం, మెడవాపు, బస్సు హారన్ శబ్దానికి నోటి నుంచి నాలుక బయటకు రావడం వంటి పలు ఇబ్బందులతో అజయ్ కుమార్ సతమతమవుతున్నాడని తల్లిదండ్రులు వాపోయారు. నిద్రలోనూ ఉలిక్కపడి లేస్తూ అరుస్తూ మెలితిరిగి పోతూ శారీరక ఇబ్బందులతో బాధ పడుతున్నాడని వివరించారు. పిండిమర నడుపుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తున్న తనకు కుమారుడి చికిత్సకు ఖర్చు తలకుమించిన భారమైందని శ్రీరాములు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చాడు. బెంగుళూరులో యాస్తర్ ఆసుపత్రి న్యూరాలజిస్ట్ డాక్టర్ రవి గోపాల్ వర్మ వద్ద అజయ్ కుమార్ వైద్య చికిత్స చేయిస్తున్నామని తెలిపారు.

విదేశాల ఉంచి తెప్పించి గుండె వద్ద యంత్రాన్ని అమరిస్తే మెలి తిరిగిన చేయి సాఫుగా వస్తుందని క్రమంగా రోగి కోలుకుంటాడని డాక్టర్లు చెప్పారని తెలిపాడు. వైద్యచికిత్సకు రూ.17 లక్షల ఖర్చు అవుతుందని సీఎం చంద్రబాబు వద్ద తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. ఇన్నాళ్ళూ పేదరికంలోనూ కుమారుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నామని ఉన్నంతలో చికిత్స చేయిస్తున్నామని తెలిపారు. అజయ్ కుమార్ అనారోగ్యం గురించి సావధానంగా విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణ స్పందించి రూ. 15 లక్షలు మంజూరు చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

Advertisements

Latest Articles

Most Read