సోమవారం సచివాలయంలో పోలవరం సహా 54 ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో భాగమైన అప్ స్ట్రీమ్ జెట్ గ్రౌంటింగ్ పనులు పూర్తికావడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 2050 మీటర్లు పొడవున వున్న అప్ స్ట్రీమ్ జెట్ గ్రౌంటింగ్ నిర్మాణం పూర్తి చేశామని, డౌన్ స్ట్రీమ్ జెట్ గ్రౌంటింగ్ పనులు 77% అయ్యాయని అధికారులు వివరించగా, జూలై 9 నాటికి ఆ పనులు కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పోలవరం పనుల పురోగతిపై 65వ సారి ముఖ్యమంత్రి వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేయగా, ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 55.73% పూర్తయిందని అధికారులు వివరించారు. కుడి ప్రధాన కాలువ 90%, ఎడమ ప్రధాన కాలువ 61.62% నిర్మాణం పూర్తయ్యిందని అన్నారు. స్పిల్ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలట్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌ తవ్వకం పనులు 75.60% పూర్తికాగా, స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 27.20% పూర్తయినట్టు తెలిపారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.22%, కాఫర్ డ్యాం జెట్ గ్రౌంటింగ్ పనులు 90.70% చేపట్టినట్టు వెల్లడించారు.

polavaram 26062018 2

గత వారం స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 4.49 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టగా, 42 వేల క్యూబిక్ మీటర్ల మేర స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తం 1,115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటివరకు 843.29 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్‌, స్పిల్ చానల్‌కు సంబంధించి మొత్తం 36.79 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుండగా ఇప్పటికి 10.01 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి. రేడియల్ ఫ్యాబ్రికేషన్ 18 వేల మెట్రిక్ టన్నులకు 11,020 మెట్రిక్ టన్నుల వరకు పనులు పూర్తయ్యాయి.

polavaram 26062018 3

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ‘పునరావాసం-పరిహారం’ కింద ఉద్దేశించిన రూ. 3,115.11 కోట్లకు గాను ఇప్పటివరకు రూ. 219.25 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరాంతానికి ఆర్ఆర్ పనులు పూర్తవ్వాలని తూర్పగోదావరి జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్ఆర్ ప్యాకేజీ త్వరితగతిన అమలు చేసేందుకు ఐఏఎస్ అధికారులు, నిపుణులతో కూడిన 5 ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. తూర్పుగోదావరిలో 7 ఆర్ఆర్ కాలనీలు, పశ్చిమగోదావరిలో 19 ఆర్ఆర్ కాలనీలు పూర్తయ్యాయని చెప్పారు.

ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల్లో ఒక్కటైన కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు ప్రారంభించబోతుంది. సుమారుగా 585 కోట్లు పెట్టుబడి ఆ కంపెనీ రాష్ట్రంలో పెట్టనుంది. ఈ కంపెనీ వల్ల, సుమారుగా 6,600 మందికి ఉద్యోగాల కల్పన జరగనుంది. 30 కి పైగా దేశాల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగస్తులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. రేపు అమరావతికి కంపెనీ ప్రతినిధులు రానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి నారా లోకేష్ తో భేటీ కానున్నారు. కంపెనీ ప్రతినిధులు సమావేశం అనంతరం, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖతో ఈ కంపెనీ ఒప్పందం చేసుకోనుంది. అయితే, ఈ కంపెనీ పేరు మాత్రం ప్రభుత్వం బయట పెట్టటం లేదు. పక్క రాష్ట్రాల నుంచి గట్టి పోటీ ఉండటంతో, ఒప్పందం జరిగే వరకు, పేరు బయటకు చెప్పం అంటుంది ప్రభుత్వం.

ఎలక్ట్రానిక్స్ రంగంలో 2 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారు.దేశంలో బెంగుళూరు,ముంబయి,ఢిల్లీ ఇలా అనేక నగరాలు,అమెరికా,దావోస్ దేశాల్లో పర్యటించి మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధి కి తీసుకుంటున్న చర్యలను వివిధ కంపెనీల ప్రతినిధులకు వివరించారు.ఎలక్ట్రానిక్స్ పాలసీ,రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల గురించి వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అని ఆహ్వానించారు.అందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ అయిన ఫాక్స్కాన్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది.రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్లో ఒక్క మొబైల్ ఫోన్ కూడా తయారు కాలేదు.అలాంటిది ఇప్పుడు దేశంలో తయారు అవుతున్న ప్రతి పది ఫోన్లలో 2 ఆంధ్రప్రదేశ్ లోనే తయారు అవుతున్నాయి.ఒక్క ఫాక్స్కాన్ కంపెనీలోనే సుమారుగా 14 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు.దీనితో పాటు సెల్కాన్,కార్బన్,డిక్సన్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి.

ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పూర్తి స్థాయి అభివృద్ధి,బ్యాటరీ తయారీ నుండి పూర్తి స్థాయి వస్తువు తయారీ వరకూ ఒకే చోట జరగాలి అనే ఉద్దేశంతో ప్రారంభించిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఈఎంసి 1,2 మంచి ఫలితాలను ఇస్తున్నాయి.మొత్తంగా ఒక్క ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోనే ఇప్పటి వరకూ 18 వేల ఉద్యోగాలు వచ్చాయి.ఇటీవల కాలంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో 15 వేల కోట్లు ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ అంగీకరించింది.తిరుపతి విమానాశ్రయం సమీపంలో 150 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఏర్పాటు రిలయన్స్ ఏర్పాటు చేయనుంది.రోజుకి 10 లక్షల జియో ఫోన్లు,సెట్ టాప్ బాక్సులు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు తయారు రిలయన్స్ తయారు చేయనుంది.ఒకే చోట 25 వేల మందికి ఉద్యోగాలు రిలయన్స్
కల్పించబోతుంది.రిలయన్స్ ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు.

ఆరు నెలల క్రితం ముంబై పర్యటన లో భాగంగా రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ తో సుదీర్ఘంగా 2 గంటల పాటు మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు గురించి వివరించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు,రాయితీలు,పాలసీలు,క్లస్టర్ మోడల్ లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల గురించి మంత్రి నారా లోకేష్ చెప్పిన తరువాత అంబానీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధం అయ్యారు.త్వరలోనే డిపిఆర్ పూర్తి చేసుకొని ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కనుంది.ఇప్పుడు అదే వ్యూహాన్ని అమలు చెయ్యడంలో మంత్రి నారా లోకేష్ మరో సారి సఫలీకృతుడు అయ్యారు.

దేశంలోని వివిధ నగరాల నుండి పోటీ ఉన్నా ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల్లో ఒక్కటైన కంపెనీ ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.బెంగుళూరు,తిరుపతిలో ఆ కంపెనీ ప్రతినిధులతో పలుమార్లు సమావేశం అయ్యి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనువైన పరిస్థితుల గురించి వివరించి.అనేక సార్లు వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించి వారిని ఆంధ్రప్రదేశ్ కి వచ్చేందుకు ఒప్పించారు.నిత్యం తన ఎలక్ట్రానిక్స్ టీం ని ఆ కంపెనీ ప్రతినిధులతో టచ్ లో ఉండేలా చెయ్యటం,వారికి అవసరం అయిన సమాచారాన్ని అత్యంత వేగంగా అందించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ కు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఉండే తేడా స్పష్టంగా అర్థం అయ్యేలా వివరించారు.ఈ కంపెనీ రాకతో ప్రపంచంలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న మరిన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చే అవకాశలు ఉన్నాయి.దీనితో పాటు ఈ కంపెనీకి చెందిన సప్లైయర్ కంపెనీలు కూడా త్వరలో ఆంధ్రప్రదేశ్ కి వచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి

తెలుగుదేశం ఎమ్మల్యేను, కేరళ సియం ప్రశంసించటం ఏంటి అనుకుంటున్నారా ? మన రాష్ట్ర ఎమ్మల్యే చేసిన పని, ఇప్పుడు టాక్ అఫ్ ది కంట్రీ అయ్యింది. అనేక రాష్ట్రాల్లో వార్తలు కూడా వచ్చయి. పాలకొల్లు శాసన సభ్యుడు నిమ్మల రామానాయుడు పై, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రశంసలు కురిపించారు. ఆత్మలు, దయ్యాలు లేవంటూ నిరూపించేందుకు కొన్ని రాత్రులు శ్మశానంలో నిద్రించిన ఆయనను విజయన్‌ ఎంతగానో మెచ్చుకున్నారు. విషయం తెలుసుకున్న పినరయి విజయన్‌ ఆయనను పలు విధాలుగా ప్రశంసిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ''మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న యోధుడు రామానాయుడు. దెయ్యాల గురించి భయపడుతున్న పనివాళ్ళలో విశ్వాసాన్ని నెలకొల్పేందుకు మరిన్ని రాత్రులు శ్మశానంలో గడపాలని నిర్ణయం తీసుకున్నారు. రామానాయుడు చేస్తున్న ఈ ప్రయత్నం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశం యావత్తు ఆయన సాహసంపై దృష్టి నిలిపింది.'' అని విజయన్‌ ట్వీట్‌ చేశారు.

ramanaidu 25062018 2

అభివృద్ధి పనులు వేగవంతంగా జరగడానికి, కార్మికుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించడానికి పాలకొల్లు ఎమ్మెల్యే డాక్ట ర్ నిమ్మల రామానాయుడు నేరుగా శ్మశాన వాటికలోనే ఒక రాత్రి నిద్ర చేశారు. పాలకొల్లు పట్టణంలోని హిందూ స్మశాన వాటికను రూ.3 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి పనులు మందగమనంతో ఉండడాన్ని గమనించిన ఎమ్మెల్యే నిమ్మల పనుల నత్తనడక పై ఆరా తీశారు. శ్మశానంలో పనులు, మరో వైపు తవ్వకాల్లో ఎముకలు బయటపడడం తదితర కారణాలతో కార్మి కులు భయాందోళనలకు గురవుతున్నట్టు ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. వాస్తవానికి అభివృద్ది పనుల్లో 50 శాతం ఈ మాసాంతానికే పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికీ పనుల పురోగతి లేకపోవడంతో ఎమ్మెల్యే నిమ్మల స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు.

ramanaidu 25062018 3

కార్మికుల్లో నెలకొన్న భయాం దోళనలను పోగొట్టడానికి, మనోస్థైర్యం ఇవ్వడాని కి ఎమ్మెల్యే సాహతోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ఆయన శ్మశాన వాటికలోనే అల్పాహారం తీసుకున్నారు. అనంతరం అక్కడే మడత మంచం పై నిద్రకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అభివృద్ధి పనులకు నిధులు తేవడంలోనే ఆనందం లేదని వాటిని సద్వినియోగం చేసి అభివృద్ధి జరిగినప్పుడే సం తృప్తి కలుగుతుందన్నారు. శ్మశానంలో నిద్రించడం పట్ల ఆయన స్పందిస్తూ తనకు ఏవిధమైన భయాందోళనలు లేవని, సాటి మనిషిగా కార్మికుల్లో ధైర్యాన్ని నింపి పనులను వేగవంతం చేయించడానికే రాత్రి బసకు ఉపక్రమించానని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు సత్వరం పూర్తి చేసేందుకు తక్షణం నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. పోలవరం నిర్మాణం కోసం ఖర్చు చేసిన వాటిలో రూ. 1,504.14 కోట్లు ఇవ్వాలని, అలాగే నూతన అంచనాలకు త్వరగా ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విడుదలలో కేంద్రం ఆలస్యం చేయడం లేదని బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను తప్పుబట్టారు. సోమవారం సచివాలయంలో పోలవరం సహా 54 ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

gadkari 25062018 2

ఈ లేఖ రాయటానికి ప్రధాన కారణం, నిన్నటి నుంచి పోలవరం పై, బీజేపీ నేతలు, జీవీఎల్ లాంటి వారు చేస్తున్న ప్రచారం. పోలవరం ప్రాజెక్ట్ కు, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది అంతా ఇచ్చేసాము అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. జీవీఎల్ లాంటి వారు, ఎదో చెప్పిస్తూ ప్రజలను, అదే నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం డబ్బులు అన్నీ ఇచ్చేసామని, పోలవరంను ఏపీ ప్రభుత్వం అక్షయపాత్రలా భావిస్తోందని, ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని, ఇలా ఇష్టం వచ్చినట్టు నిన్నటి నుంచి మాట్లాడుతున్నారు. ఈ తాడు బొంగరం లేని, జీవీఎల్ ఇలాంటి ప్రచారం చెయ్యటంతో, వీటికి చెక్ పెట్టటానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది.

gadkari 25062018 3

ఏకంగా ముఖ్యమంత్రి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. పోలవరం నిర్మాణం కోసం ఖర్చు చేసిన వాటిలో రూ. 1,504.14 కోట్లు ఇవ్వాలని, తొందరగా వచ్చేలా చూడాలని అన్నారు. ఇప్పుడు జీవీఎల్ చెప్పే సొల్లు కబురులు నిజం అయితే, ఇదే విషయం నితిన్ గడ్కరీ లేఖలో ముఖ్యమంత్రికి రాయాలి. మేము అన్ని డబ్బులు ఇచ్చేసాం, మీరు అవినీతి చేస్తున్నారు అని, నితిన్ గడ్కరీ లేఖ రూపంలో చెప్పగలరా ? ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి. ఈ తాడు బొంగరం లేని జీవీఎల్ లాంటి నేతలు చెప్పేవి నిజం అయితే, కేంద్ర మంత్రి, అదే విషయం ఆ లేఖలో రాయాలి. లేకపోతే జీవీఎల్ చెప్పేవి అన్నీ అబద్ధాలే అని, మరోసారి రుజువు అవుతుంది. జీవీఎల్ చెప్పేవి నిజాలు అయితే, ఆయనే నితిన్ గడ్కరీతో మాట్లాడి, చంద్రబాబుకు మీరు అవినీతి చేస్తున్నారు అని లేఖ రాపించాలి.. లేకపోతే, ఆ అరకోటులు వేసుకుని, ఢిల్లీలోనే భజన చేసుకోవాలి..

Advertisements

Latest Articles

Most Read