దేశ రాజధాని ఢిల్లీలో, నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తీవ్ర అవమానం జరిగింది. నలుగురు ముఖ్యమంత్రులు, ఢిల్లీ ముఖ్యమంత్రిని కలిసి సంఘీభావం తెలపాలి అనుకుంటే, ఢిల్లీ పోలీసులు, గవర్నర్ అవమాన పరుస్తూ, నలుగురు ముఖ్యమంత్రులకు పర్మిషన్ ఇవ్వలేదు. అంతకు ముందు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశ్చిమ్‌ బంగ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్‌, కర్ణాటక సీఎం కుమారస్వామి, ఆంధ్రా భవన్ లో కలిసారు. ఈ భేటీ అనంతరం రాత్రికి చంద్రబాబు, మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వద్దకు వెళ్ళటానికి, ఢిల్లీ గవర్నర్ కు ఉత్తరం రాసారు. రాత్రి 9 గంటలకు కలుస్తామని చెప్పారు.

cbn 16062018 4cm 2

అయితే నలుగురు సియంలు బయలుదేరిన తరువాత, అనూహ్యంగా, గవర్నర్ భావనానికి వెళ్ళే దారులు అన్నీ పోలీసులు బ్లాక్ చేసారు. అక్కడకు వెళ్ళటానికి పర్మిషన్ లేదని చెప్పారు. గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పారు. దీంతో, చేసేది లేక, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ ఇంటికి వెళ్లి, ఆయన తల్లి, భార్య, పిల్లలను పరమార్సించారు. అయితే, ఈ పరిణామం పై, నలుగురు సియంలు చాలా కోపంగా ఉన్నారు. నలుగురు ముఖ్యమంత్రులు కలిసి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలి అంటే, ఇన్ని ఆంక్షలు పెడతారా ? ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ, కేంద్రం పై మండి పడ్డారు. ఇదంతా, మోడీ చేస్తున్న కుట్రగా చెప్పారు. అయితే, ఈ విషయం పై ధర్నా చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం పై చర్చిస్తున్నారు.

cbn 16062018 4cm 3

పలు సమస్యల పరిష్కారం కోసం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా దీక్షకు దిగిన కేజ్రీవాల్‌కు నేతలు సంఘీభావం తెలపటానికి వెళ్ళాలనుకున్నారు. మరో పక్క, దిల్లీ పాలనలో లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) తీరును నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఎల్జీ కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్న దిల్లీ సీఎం, మంత్రులపై కేసు నమోదైంది. దీక్షతో ఎల్జీ విధులకు ఆటంకం కల్గించారని ఆరోపిస్తూ అధికారులు నగరంలోని పటేల్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, మంత్రులు సత్యేంద్ర జైన్‌, గోయల్‌ రాయ్‌పై పోలీసులు 124 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కొద్ది సేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. రేపు జరగనున్న నీతి ఆయోగ్‌ సమావేశంలో ఏపీ సీఎం పాల్గొననున్నారు. చంద్రబాబు భాజపా యేతర సీఎంలతో సమావేశమవుతున్నారు. ఏపీ భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పశ్చిమ్‌ బంగ సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వాజ్‌పేయీని పరామర్శించిన దీదీ నేరుగా ఏపీ భవన్‌కు చేరుకోగానే ఆమెకు సాదరస్వాగతం పలికిన సీఎం.. ఆ తర్వాత ఆమెతో సుమారు 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. వీరి భేటీలో పలు కీలక అంశాలను చర్చించినట్టు సమాచారం.

cbndelhi 16062018 2

అనంతరం కేరళ సీఎం పినరయి విజయన్‌, కర్ణాటక సీఎం కుమారస్వామితోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రస్తుతం నలుగురు సీఎంల కీలక భేటీ కొనసాగుతోంది. రేపు జరగబోయే నీతి ఆయోగ్‌ సమావేశంలో రాష్ట్రాలకు సంబంధించిన అధికారాల విషయంలో ఎలాంటి తేడా వచ్చినా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై నేతలంతా కూలంకుషంగా చర్చించినట్టు సమాచారం. ఏపీ భవన్‌ వేదికగా జరిగిన ఈ భేటీలో దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చిస్తున్నారు. ఈ భేటీ అనంతరం రాత్రికి చంద్రబాబు, మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వద్దకు వెళ్లనున్నారు. పలు సమస్యల పరిష్కారం కోసం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా దీక్షకు దిగిన కేజ్రీవాల్‌కు నేతలు సంఘీభావం తెలపనున్నారు.

cbndelhi 16062018 3

అయితే, కేజ్రీవాల్‌ను కలిసేందుకు మమత ఎల్జీ కార్యాలయాన్ని అనుమతి కోరగా.. అధికారులు మమతకు అనుమతి నిరాకరించారు. చంద్రబాబు, మమత, కుమారస్వామి కేజ్రీని కలిసేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఎల్జీ కార్యాలయం తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి వైఖరి అనుసరించాలి?, కేజ్రీవాల్‌ను ఎలా కలవాలనే అంశాలపై నలుగురు ముఖ్యమంత్రులు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు ముస్లింలు రంజాన్‌ పండుగ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. మరోవైపు ఢిల్లీలో రేపు నీతి ఆయోగ్‌ సమావేశం జరగనుంది. దీంతో ఆ సమావేశం వాయిదా వేయాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేఖలు రాసినప్పటికీ నీతి ఆయోగ్‌ అందుకు ఒప్పుకోలేదు. తాజాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంపై మాట్లాడారు. ఈద్ ఉన్న విషయం కేంద్ర ప్రభుత్వ అధికారులకు తెలియదా? అని నిలదీశారు. అందుకే ఎవరికీ ఇబ్బంది లేకుండా తేదీని మార్చాలని గతంలో తాను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు.

విభజన హామీలు అమలు, కోసం జనవరి నెల నుంచి చంద్రబ్బు పోరాటాన్ని ఉధృతం చేసారు. ఓ వైపు ప్రధాని మోదీ మోసాన్ని, మరోవైపు కేంద్రం చేసిన అన్యాయాన్ని ఎండగడుతూ ఢిల్లీపై యుద్ధమే ప్రకటించారు. ఇంకోవైపు టీడీపీకి రాజకీయంగా కూడా ఆ పార్టీకి జాతీయస్ధాయిలో మద్దతు పెరుగుతూ వస్తోంది. ఈ పరిణామాల మధ్య టీడీపీని ఒంటరి చేసి, చంద్రబాబును ఏకాకి చేసేందుకు విపక్ష వైసీపీ ఎన్ని చేయాలో అన్నీ చేస్తోందనే ఆరోపణలొస్తున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు వ్యతిరేకులందరినీ వైసీపీ కలుస్తోందనే విమర్శలొస్తున్నాయి. ఢిల్లీ పీఎంఓలో ప్రధానిని కలిసినప్పటి నుంచి నిన్నటి మోత్కుపల్లి నరసింహులు భేటీ వరకు ఎంపీ విజయసాయిరెడ్డి ఒకటే ఎజెండాగా పనిచేస్తున్నారు. అంతేకాదు చంద్రబాబును బోనులో నిలబెట్టడమే తమ లక్ష్యమని అసలు ఉద్దేశాన్ని చెప్పేశారు ఆయన.

cbn 16062018 5

ఇటు చంద్రబాబుపై తీవ్ర విమర్శలతో టీడీపీ నుంచి బహిష్కరణకు గురయిన మోత్కుపల్లితో విజయసాయి భేటీ అయ్యారు. చంద్రబాబును గద్దెదింపడమే ఉమ్మడి లక్ష్యమని వీరిద్దరు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా అన్నీ పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు తిరుమల శ్రీవారి ఆభరణాల లెక్కల్లో అవకతవకలు, కొండపై అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేసిన రమణదీక్షితులు కూడా జగన్‌ను కలిశారు. మిరాశి వ్యవస్ధను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని అందుకే ఆయన్ను కలిశానని దీక్షితులు చెప్పుకొచ్చారు. అంతేకాదు జగన్ న్యాయం చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

cbn 16062018 4

అంతకు ముందు దీక్షితులు ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతో పాటు మరికొందరిని కలిసిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. కొండమీద జరిగే అన్యాయాలను చెప్పేందుకే వాళ్లను కలిశానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయంలో న్యాయపోరాటానికి సిధ్దమని ప్రకటించారు. ఆపరేషన్ గరుడలో భాగంగానే దీక్షితులను బీజేపీ ప్రయోగించిందని, మతవిధ్వేషాలు రెచ్చగొట్టి, వెంకన్న మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కలిసి బీజేపీ నేత రాంమాధవ్‌తో భేటీ అవ్వడం రాజకీయంగా సంచలనం సృష్టించింది.

అదిగో లగడపాటి సర్వే, ఇదిగో లగడపాటి సర్వే అంటూ గత రెండేళ్ళుగా, ఎవరికి కావాల్సిన సర్వే ఫలితాలు వాళ్ళు ఇచ్చుకుంటూ, లగడపాటి పేరు మీద తోసేసేవారు.. లగడపాటి సర్వే అంటే అంత గురి జనలాకి, అందుకే అందరూ లగడపాటి సర్వే అంటూ వదిలేవారు. కాకపోతే అవన్నీ పుకార్లే అని అనేక సార్లు లగడపాటి చెప్పారు. అయితే, ఇప్పుడు ఆఫీషయల్ గా లగడపాటి సర్వే రిలీజ్ అయ్యింది. లగడపాటి తరుపున సర్వేలు చేసే ఆర్జీ ఫ్లాష్ టీమ్... శ్రీనివాస్ నేతృత్వంలో ఏపీ పల్స్‌ని ఒడిసి పట్టింది, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో అసలు పరిస్థితి ఏంటో వివరించారు. ఈ క్షణంలో ఎన్నికలు జరిగితే టీడీపీకి 110 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. వైసీపీకి 60 సీట్లు వస్తాయని... ఇతరులు మరో 5 సీట్లు సాధించే అవకాశం ఉందని తేల్చింది.

lagadpati 16062018 2

జగన్ పార్టీ 2014లో 174 సీట్లలో పోటీ చేసింది. 67 సీట్లు గెలిచింది. అంటే ఇప్పుడు 7 సీట్లు కోల్పోయింది ! అటు తర్వాత టీడీపీ 8 సీట్లు మెరుగు పడింది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ 102 సీట్లు సాధించింది. బీజేపీ అప్పట్లో 13 సీట్లలో పోటీ చేసింది. నాలుగు సీట్లు గెలిచింది. ఇప్పుడు ఇక కొత్తగా వచ్చిన జన సేన ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని తేలిపోయింది. ఇతరుల కోటాలో 5 సీట్లు మాతమ్రే కనిపిస్తున్నాయ్. 2014లో నవోదయపార్టీ మాత్రమే ఒక్క సీటు గెలవగల్గింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరుకి ఎన్ని మార్కులు అనే ప్రశ్నకు, చంద్రబాబు సమర్థంగా పనిచేస్తున్నారు అని 53 శాతానికిపైగా జనం అభిప్రాయ పడ్డారు. లేదు పనిచేయడం లేదు అని అంటున్న వాళ్లు 46 శాతం ఉన్నారు. అంటే చంద్రబాబు పనితీరుపై వ్యతిరేకత 46 శాతం ఉంది. ఇందులో ఇప్పుడు వైసీపీ జనసేన కాంగ్రెస్ ఇతరులు పంచుకోవాల్సి ఉంటుంది.

lagadpati 16062018 3

ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నది ఏ పార్టీ, అని ప్రశ్నించగా, టీడీపీ సమర్థంగా పోరాడుతోంది అంటున్నవాళ్లు 43.84 శాతం కాగా, ఏపీ ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాడుతోంది అంటున్నవాళ్లు 37.46 శాతం మంది ఉన్నారు. ఇక జనసేన ప్రత్యేక హోదా పోరాటం చేస్తోంది అంటున్నవాళ్లు 9.65 శాతం మంది. ఏపీకి మోదీ అన్యాయం చేసారా అంటే అని సర్వేలో ప్రశ్నిస్తే ఏపీ ఠక్కున స్పందించింది. అవును అంటూ 83 శాతానికిపైగా అవును అని చెప్పారు. లేదు...అన్యాయం చేయలేదు అంటున్నవాళ్ల శాతం 16శాతం మాత్రమే.

Advertisements

Latest Articles

Most Read