ఏపి అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం కూడా.. అలాంటి ఈ రెండు ప్రాజెక్ట్ లు పూర్తి చెయ్యటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తుంటే, మిగిలిన వారు ఇబ్బంది పెడుతున్నారు..... పోలవరం విషయంలో, కేంద్రం ఇబ్బంది పెట్టిన సంగతి చూశాం... అమరావతి విషయంలో, కొంత మంది అదృశ్య శక్తులు ఆపటానికి చూస్తున్నారు... అమరావతిని అడ్డుకోవటమే ధ్యేయంగా రాష్ట్రంలో ఉన్న కొంత మంది, రాజధాని నిర్మాణం కోసం లోన్ ఇస్తున్న ప్రపంచ బ్యాంకుకి, లోన్ ఇవ్వద్దు అంటూ, లేఖలు రాసిన సంగతి తెలిసిందే.. వీరికి తోడు, మేధా పాట్కర్, ప్రపుల్ల సమంత్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ ఈఏఎస్ శర్మ తోపాటు 46 మంది సామాజిక కార్యకర్తలు "నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్ మెంట్" పేరిట ప్రపంచ బ్యాంకు అమరావతికి రుణం ఇవ్వద్దు అంటూ, లెటర్ రాసారు..

amaravati 01062018 2

ఈ విషయం పై క్షేత్ర స్థాయి పరిశీలనకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతి వచ్చారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు అమరావతి ప్రాంత రైతులు కొన్ని విషయాలు స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి నిధులను త్వరితగతిన మంజూరు చేస్తే రాజధానితో పాటుగా భూములిచ్చిన తాము అభివృద్ధి పథంలో పయనిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో రాజధానిలో బాగానే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. రాజధాని గ్రామాల్లో గురువారం 9 మందితో కూడిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం పర్యటించింది. వెంకటపాలెం, మందడం, రాయపూడి, తుళ్ళూరు గ్రామాల్లో ప్రతినిధులు పర్యటించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. తుళ్ళూరు సీఆర్డీఏ యూనిట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతినిధి అన్న డిజార్డ్ మాట్లాడారు.

amaravati 01062018 3

ఏదేని ప్రాజెక్టుకు సంబంధించి ప్రపంచ బ్యాంకు సహాయం చేయాలంటే వివిధ అంశాలతో కూడిన పర్యటనలు తరచూ చేయాల్సి ఉంటుందని చెప్పారు. బహుశా ఇది చివరి పర్యటన కావచ్చేమోనని తెలిపారు. మందడం గ్రామంలో పేదలకు నిర్మిస్తున్న గృహ నిర్మాణ సముదాయాన్ని, రాయపూడిలో రోడ్డు నిర్మాణంలో గృహాలు కోల్పోయిన వారికి కేటాయించిన స్థలాల్లో నిర్మిస్తున్న గృహాలను, తుళ్ళూరులోని వృత్తి నైపుణ్యాభివృద్ధి సంస్థ కేంద్రాన్ని పరిశీలించారు. ఒక పక్క కేంద్రం నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే, రాష్ట్రం లోన్ కోసం వెళ్తుంటే, ఆ లోన్ కూడా రాకుండా, రాష్ట్రంలోని అదృశ్య శక్తులు, ఆ లోన్ రాకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు...

విద్యార్ధులను తగిన విధంగా ప్రోత్సహిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జాతీయ స్థాయి విద్యా సంస్థలకు జరిగే పోటీ పరీక్షలకు ఎంపికై ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు ఎక్కువ సీట్లు సాధిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. 2018- నేషనల్ ఎఛీవ్‌మెంట్ సర్వే (NAS) లో ఆంధ్రప్రదేశ్ పదోతరగతి విద్యార్ధులు గణితంలో నెంబర్ -1 స్థానం సంపాదించినందుకు ఆయన అభినందనలు తెలిపారు. కార్పొరేట్ కాలేజీలకంటే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి సదుపాయాలు కల్పిస్తున్నామని, విద్యార్ధులను ప్రోత్సహిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే మన రాష్ట్రానికి సాంఘిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, ఆంగ్లం, మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉత్తీర్ణతలో నెంబర్-టూ ర్యాంక్ దక్కినందుకు ఆయన అభినందనలు తెలిపారు.

andhra 01062018 2

కాగా ఏపీ గణిత శాస్త్రంలో నెంబర్ -1 ర్యాంకు సాధించడం, ఇతర సబ్జెక్టులలో దేశంలో నెంబర్-2 గా నిలిచినందుకు గురువారం ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం విద్యార్ధులను, ఉపాధ్యాయులను, విద్యార్ధులను ప్రోత్సహించినందుకు తల్లిదండ్రులను ప్రత్యేకంగా ప్రశంసించింది. సర్వేలో ఢిల్లీ,గోవా, కర్ణాటక వరుసగా రెండు, మూడు,నాలుగో స్థానాలు దక్కించుకున్నాయి. దేశవ్యాప్తంగా ఆరువందల పది జిల్లాలకు చెందిన 1.544 మిలియన్ల విద్యార్ధులను సర్వే చేయగా గణితంలో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్ధులు గణితంలో టాప్ ర్యాంక్ సాధించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ కు ఈ ఘనత దక్కింది.

andhra 01062018 3

ప్రపంచ బ్యాంకు సహకారంతో జాతీయ స్థాయిలో ICDS బలోపేతం కోసం చేస్తున్న ప్రత్యేక పధకం అమలులో మన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కల్పించడం ద్వారా గర్భిణి మరియు బాలింతలు ఆహారపు అలవాట్లలో మార్పు, శ్రీమంతం మరియు అన్నప్రసన వంటి కార్యక్రమాలు ద్వారా పొష్టికాహారం మరియు ఆరోగ్యపరీక్షలపై అవగాహన మరియు మొబైల్ అప్ సాంకేతికత ద్వారా అమలవుతున్న పథకాలపై పర్యవేక్షణ వంటి కార్యక్రమాలు అమలులో మధ్య ప్రదేశ్ మరియు చత్తీస్గర్ రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి ఈ గుర్తింపు లభించింది. మే 24న ఢిల్లీ లో జరిగిన కార్యక్రమములో ఈ ప్రశంస పత్రాన్ని భారత ప్రభుత్వ మహిళ సంక్షేమ శాఖ కార్యదర్శి అందజేశారు.

అగ్రిగోల్డ్‌ బాధితులను సొంతంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నమొత్తంలో డిపాజిట్లు చేసిన నిరుపేద వర్గాలకు ప్రభుత్వమే సొంత ఖర్చుతో సహాయం చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే అగ్రిగోల్డ్‌ కేసు ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉన్నందున ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించాలని, ఈ కేసులో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రత్యేక న్యాయనిపుణుడిని రప్పించి కోర్టులో వాదనలు వినిపించాలని గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశ వివరాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఏపీలో కనీసం 19లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులున్నారు. ఏపీకి చెందిన వారికే లబ్ధిచేకూరుస్తామని స్పష్టం చేశారు.

agrigold 01062018 2

ఇదే అంశంపై అధ్యయనం చేస్తున్న మంత్రివర్గ ఉపసంఘాన్ని త్వరగా అధ్యయన నివేదిక సమర్పించాలని మంత్రివర్గం ఆదేశించినట్లు కాలువ వివరించారు. మరో పక్క నిన్న, అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును గురువారం కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 13 జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేసుకుని, కోర్టుకు హాజరై, తమ సమస్యల్ని వివరంగా చెప్పాలని సూచించారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వపరంగా అన్ని చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిన్న ఆగ్రిగోల్డ్ బాధితులు 24 గంటల దీక్ష చేపట్టారు. వీరితో ప్రభుత్వం చర్చించింది.

agrigold 01062018 3

అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యను అతి త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు హామీ ఇచ్చారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బుధవారం నాడు అగ్రిగోల్డ్‌ బాధితులు ప్రారంభించిన నిరసన దీక్షను ఆయన గురువారం విరమింపచేశారు. గురువారం ప్రకటించిన అగ్రిగోల్డ్‌ బాధితుల ఆత్మఘోష పాదయాత్రను కూడా విరమిస్తున్నట్టు బాధితుల అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రకటించారు. జూన్‌ 5 వరకు ఉన్న కోర్టు సెలవులు పూర్తయ్యే నాటికి ప్రభుత్వం స్పష్టమైన హామీతో రాకపోతే తిరిగి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

నాకు ఎవరో చెప్పారు, అందుకే చెప్తున్నా అంటాడు... అవినీతి చేసి రసీదులు ఇస్తారా ? నేను చెప్తున్నా అంటే అవినీతి జరిగినట్టే అంటాడు... ఈ గాలి మాటలు ఎందుకు అయ్యా పవన్ కళ్యాణ్, ఒక్క ఆధారం చెప్పు, ఎక్కడ అవినీతి జరిగందో చెప్పు అంటే, మ్మేమ్మేమ్మే బ్బేబ్బేబ్బే అంటాడు... ఇప్పటికే లోకేష్ అనేక సార్లు, పవన్ కు ఛాలెంజ్ చేసాడు. "మేము అప్పట్లో జగన్ మీద ఆరోపణలు చేసాం, ఆ ఆరోపణలు అన్నీ కోర్ట్ కి ఇచ్చాం, కోర్ట్ సిబిఐ ఎంక్వైరీ వేసింది, చివరకు జైలుకు వెళ్లి, ఇప్పుడు బెయిల్ మీద తిరుగుతున్నాడు.. అలాగే నేను తప్పు చేస్తే, ఆ ఆధారాలు చూపించండి. కోర్ట్ కు వెళ్ళండి. ఇలాంటి గాల్లో మాటలు వద్దు" అంటూ లోకేష్ అనేకసార్లు కోరాడు.. అయినా పవన్ అదే ఫ్లో లో ఉన్నాడు. శ్రీకాకుళం వెళ్లి, అమరావతి మీద ఏడుపులు.. మరి నువ్వు ఇల్లు, నీ పార్టీ ఆఫీస్ అమరావతిలో ఎందుకు కడుతున్నావ్ అంటే సమాధానం ఉండదు... ఇప్పుడు విజయనగరం వెళ్లి ఇక్కడ రోడ్డులు లేవు, అమరావతికి మాత్రం అనేక రోడ్లు వేస్తున్నారు అంటూ, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు పవన్..

lokesh 01062018 2

దీని పై లోకేష్ స్పదించారు. ‘రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో అసలు రోడ్లే వేయలేదని, రూ.10 కోట్లు కూడా ఖర్చుపెట్టలేదని పవన్‌ అన్నారు. మేం వేసిన రోడ్లపై నడుస్తూ రోడ్లే వేయలేదన్నారు. ఇప్పుడేమో ఈ రోడ్లన్నీ సొంత సొమ్ముతో ఏమైనా వేశారా? అంటున్నారు. అసలాయన ఏమంటున్నారో అర్థం కావడం లేదు’ అని లోకేశ్‌ అన్నారు. గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఫైబర్‌గ్రిడ్‌ కాంట్రాక్టును హెరిటేజ్‌ ఉద్యోగికి ఇచ్చారన్న పవన్‌ ఆరోపణపై ప్రశ్నించగా.. ఫైబర్‌గ్రిడ్‌ ఆలోచనకు ఆదుడైన హరిప్రసాద్‌కు ప్రభుత్వం ఈ కాంట్రాక్టు ఇచ్చిందన్నారు. ఆయన హెరిటేజ్‌ ఉద్యోగి కాదని, ఫైబర్‌గ్రిడ్‌ సలహాదారు మాత్రమేనని వెల్లడించారు అంతే కాదు, ట్విట్టర్ లో కూడా స్పందించారు.. పవన్ కళ్యాణ్ గారు, అంటూ గౌరవంగా సంబోధిస్తూ, అన్ని వివారాలు చెప్పారు.

lokesh 01062018 3

Dear Pawan Kalyan Garu, kindly note your claim that AP Govt is not even spending Rs. 10 crores in tribal regions is false. You are being misinformed by your team members. Since TDP took over, we have completed 21,48,312 works with a budget of Rs. 2476.32 Crore. The roads & bridges you are walking on, the clean water you are drinking, the delightful sight of coffee plantations, Anganwadi centres, farm ponds and every development you can see have been built with the generous allocations made by Hon’ble CM @ncbn. Kindly don’t get carried away by the false information provided by your team and make needless accusations to score political brownie points. We will gladly accept your suggestions on improvement, but not lies packaged in empty rhetoric.

Advertisements

Latest Articles

Most Read