రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్న రూ.2 వేల కోట్ల విలువ చేసే ‘అమరావతి బాండ్ల’ను జూన్ 6వ తేదీ తరువాత విడుదల చేయనున్నారు. ఈ బాండ్ల విడుదలకు సంబంధించిన ప్రక్రియను దాదాపు పూర్తి చేశామని, ఆర్బీఐ పాలసీ ప్రకటన తరువాత వీటిని జారీచేస్తారు. రాజధాని అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం సచివాలయంలో జరిగిన 17వ అథీకృత సమావేశంలో ఈ బాండ్లకు సంబంధించిన వివరాలను సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఎంతో గర్వంగా చెప్పుకునేలా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 55 శాతం పనులు పూర్తిచేయగలిగామని, అదే అమరావతి విషయానికి వస్తే ఆ స్థాయిలో పనులు వేగవంతంగా జరగడం లేదని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు.

amaravati 01062018 2

చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేసేలా అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ నిరంతర పర్యవేక్షణ జరపాలని నిర్దేశించారు. పని సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన సమర్ధ వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని, జరిగిన పనిని అంచనా వేయడానికి కూడా అదేస్థాయిలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. అమరావతి ప్రధాన రహదారి పనులు జరుగుతున్న ప్రాంతంలో ఒక చోట దుమ్ము లేచి ఆ దారిన వెళ్లేవారికి ఇబ్బందిగా ఉందని, ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరంగా భావించాలని అన్నారు. వచ్చేది వర్షాకాలం అయినందున నిర్మాణ పనులు అనుకున్నట్టుగా సాగవని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా వుండాలని సూచించారు. ఇదే సమావేశంలో అంతర్జాతీయ సంస్థ ‘డస్సాల్ట్ సిస్టమ్స్’ ప్రతినిధులు అమరావతి 3డీ సిటీ డిజైన్లపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. నగర ప్రణాళికలు, ప్రకృతి వైపరీత్యాలు, భూ ప్రకంపనలకు సంబంధించిన సూచనలు అందజేయడంలో ఈ 3డీ డిజైన్లు కీలకం కానున్నాయి.

అలాగే, నగరంలో జరుగుతున్న నిర్మాణాలను ఎప్పటికప్పుడు వాస్తవ సమయంలో ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి డస్సాల్ట్ సిస్టమ్స్ రూపొందించే 3 డీ డిజైన్లు ఉపకరిస్తాయి. అండర్ గ్రౌండ్ పైప్‌లైన్లు మొదలు భవంతుల మధ్య గాలి, వెలుతురు వరకు 3డీ టెక్నాలజీ సాయంతో అంచనా వేయవచ్చు. కొత్త నగరంలో ఏర్పాటు చేయబోయే అత్యాధునిక రవాణా వ్యవస్థకు 3 డీ సిటీ డిజైన్ ఏ విధంగా దోహదపడుతుందో సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. డ్రైవర్ రహిత వాహనాలకు ఎప్పటికప్పుడు ఏవిధంగా సమాచారం అందేదీ విపులంగా తెలియజేశారు. అమరావతిని ప్రపంచ సంతోష నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి అనుగుణంగా 3డీ సిటీ డిజైన్లను రూపొందిస్తున్నారు. ఇది నగర నిర్మాణ సమయంలోనే కాకుండా భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది. 6 మాసాల వ్యవధిలో 3డీ సిటీ డిజైన్లను పూర్తిచేయాలని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు.

amaravati 01062018 3

కొత్త రాజధానిలో ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు రూపొందించిన ప్రెజెంటేషన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. నిర్మాణ శైలి, పచ్చదనం, జల వనరులు, కాలుష్య నియంత్రణపై ప్రభుత్వ విధానాలు.. ఈ నాలుగింటిపై సమగ్ర దృష్టి పెట్టడం ద్వారా కనీసం 5 నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చునని ప్రెజెంటేషన్‌లో వివరించారు. అమరావతిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్‌ను ‘సింగపూర్ పవర్’ సంస్థ చేపడుతోందని, ప్రతి 440 మీటర్లకు కూల్ స్పాట్స్ ఏర్పాటు చేయడం ద్వారా 10 డిగ్రీల ఉష్ణోగ్రతల వ్యత్యాసం తీసుకురావచ్చునని సీఆర్‌డీఏ కమిషనర్ చెప్పారు. హైకోర్టు భవంతులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నామని, రూ.1685 కోట్ల వ్యయంతో దీనిని ఐకానిక్ నిర్మాణంగా చేపట్టబోతున్నామని సీఆర్‌డీఏ కమిషనర్ చెప్పారు. ప్రి ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్‌తో రాజధానిలో మూడు నక్షత్రాల హోటల్ నిర్మాణాన్ని చేపట్టడానికి ‘ఫార్య్చూన్ మురళీ’ యాజమాన్యం ముందుకొచ్చిందని వివరించారు. రహదారులకు సంబంధించి పనులు శీఘ్రగతిన జరుగుతున్నాయని, ప్రధాన ఆటంకంగా ఉన్న తాడేపల్లి ప్రాంతంలో గత వారమే సర్వే పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు.

చంద్రబాబుని యువతను ఉద్దేశిస్తూ ఎప్పుడూ అంటూ ఉంటారు, కష్టపడాలి పని చెయ్యాలి... ప్రపంచం మీ ముందు ఉంది, అవకాశాలు మీ ముందు ఉన్నాయి, వెతుక్కుంటే వెళ్ళండి, జయించండి, అని చెప్తూ ఉంటారు... కాని కొన్ని రాజకీయ కారణాలు చేత, చంద్రబాబు ఎన్నికల హామీలో, నిరుద్యోగ భృతి ప్రకటించారు... తీవ్ర ఆర్ధిక లోటు ఒక పక్క.... అయినా సరే, ఎలక్షన్ హామీలు ఎలా అయినా తీర్చాలి అనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు... రైతు రుణమాఫీ లాంటి అతి పెద్ద కార్యక్రమం చేస్తూ, 1000 రూపాయలు పెన్షన్ లు ఇస్తూ, ఎలక్షన్ హామీలలోని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, ముందుకు సాగుతున్న చంద్రబాబు, ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు, నిరుద్యోగ బృతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

cbn 01062018 2

మరి, వయసులో ఉన్న వారు కూడా, ముసలి వాళ్ళు లాగా, నెల నెలా ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటే, ఇద్దరికీ తేడా ఏంటి ? కష్టపడి పని చేసుకోవాల్సిన వయసులో, ప్రభుత్వం మీద ఆధారాపడి జీవిస్తే ఎలా ? చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడు, యువతను ఇలా సోమరిపోతులను చేస్తే ఎలా ? వీటన్నటికీ చంద్రబాబు తనదైన శైలిలో, ఈ పధకాన్ని రూపొందించారు... ముసలి వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నట్టు కాకుండా, నిరుద్యుగులు ఈ పధకంతో తమ కాళ్ళ మీద తాము నిలబడేలా, విన్నూతంగా రూపొందించారు... దీని ప్రకారం... నిరుద్యోగులకు భృతి చెల్లిస్తూనే, ఆ సమయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారు... అయితే, ఈ శిక్షణ అయిన తరువాత, వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించి, స్టైఫండ్‌ ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని, దీని పై కూడా వర్క్ అవుట్ చెయ్యాలని అధికారులని ఆదేశించారు.. ఇది ఒక్కటే కాదు, కొన్ని ప్రభుత్వ పనుల్లో కూడా వీరిని ఉపయోగించుకుంటారు. ఇలా ఉపయోగించుకుంటే, అప్పుడు కూడా ప్రోత్సాహకం ఇస్తారు...

cbn 01062018 3

నిన్న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి నారా లోకేష్‌, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ పధకం వివరాలను మీడియాకు వివరించారు. వివిధ రాష్ట్రాలతో పాటు అమెరికా, ఐర్లాండ్‌, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌ తదితర దేశాల్లో అమలుచేస్తున్న నిరుద్యోగ భృతిని పరిశీలించి రూపకల్పన చేసినట్టు చెప్పారు. నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామని, సమాజానికి ఉపయోగపడేలా, విజ్ఞాన సమూహంలా యువతను తీర్చిదిద్దుతామని, అప్పుడే ఈ పధకానికి ఉపయోగం అని చెప్పారు. రుణ మాఫీ, పెన్షన్ లు లాగానే, నిరుద్యోగ బృతి కుడా చాలా పకడ్బందిగా ఇవ్వనున్నారు. ఇందుకోసం, అన్ని రకాలుగా అవసరమైన టెక్నాలజీ, డేటా, ఉపయోగించుకోనున్నారు. ఎవరికీ పడితే వారికి కాకుండా, నిజమైన లబ్దిదారులకు ఇది ఉపయోగపడే విధంగా, నిరుద్యోగ బృతి ఇవ్వనున్నారు.

cbn 01062018 4

ఇవి నిబంధనలు... పేద కుటుంబమై ఉండాలి.. తెల్లకార్డు ఉండాలి... లబ్ధిదారుకు 22-35 ఏళ్ల వయసు ఉండాలి... కనీస విద్యార్హత డిగ్రీ. తత్సమాన విద్యార్హత.... నెలకు వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి... ఒక కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు అర్హులున్నా ఇస్తారు.... నిరుద్యోగ భృతికి తోడు.. వారిని కొన్ని ప్రభుత్వ పనుల్లో ఉపయోగించుకుంటారు. దానికి అదనంగా ప్రోత్సాహకం ఇస్తారు... నిరుద్యోగ భృతిని ప్రతి నెలా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో వేస్తారు...రేషన్‌ను ఎక్కడైనా తీసుకున్నట్లే భృతిని ఎక్కడైనా తీసుకోవచ్చు. బయోమెట్రిక్‌ను అనుసంధానం చేస్తారు.... నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు వారికి ఉచితంగా నైపుణ్యాల అభివృద్ది శిక్షణ ఇచ్చి సమాజానికి ఉపయోగపడే వర్క్‌ఫోర్స్‌గా తయారుచేస్తారు.

55 వేల విద్యుత్ రంగ ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపికబురు చెప్పారు. గురవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో పే రివిజన్ కమిటీ సిఫారసులకు ఆయన ఆమోద ముద్ర వేశారు. 2018-22 కాలానికి 25 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. దీని ద్వారా 15 సంవత్సరాలలోపు సర్వీసు ఉన్న వారికి రెండు వెయిటేజి ఇంక్రిమెంట్లు, 15 సంవత్సరాలకు పైగా సర్వీసులో ఉన్న వారికి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల రూ.800 కోట్లు విద్యుత్ సంస్థలకు అదనపు ఖర్చు అవుతుందని, అయినా ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రతి విద్యుత్ ఉద్యోగి క్రమశిక్షణతో, బాధ్యతతో మెలిగి వినియోగ దారుడికి మెరుగైన సేవలు అందించాలని, విద్యుత్ రంగ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.

cbn 31052018 2

మరో పక్క సంక్షేమ శాఖల సమీక్షలో చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. పథకాల ఫలితాలు నిర్దేశిత వర్గాలకు చేరాలన్నారు. ఇందుకోసం రియల్ టైమ్ గవర్నెన్స్ సాంకేతికతను ఉపయోగించుకోవాలని, 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వినతులను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజలకు తెలియపర్చాలని, మనం దేనికైతే ఖర్చుపెడుతున్నామో ఆ పథకం ఫలవంతం కావాలని, ఫలితాలు లబ్దిదారులకు చేరాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ‘మనం చేసేది బాగానే చేస్తున్నాం. లబ్దిదారులకు ఒక కోరిక ఉంటుంది. ప్రభుత్వం అమలు చేసే పథకాల ఫలితాలు తమకు చేరాలని భావిస్తారు. వాళ్ల కోరినది మనం చేయాలి. అత్యధికంగా సంతృప్తి రావాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.

cbn 31052018 3

ఇదిలా ఉంటే సంక్షేమ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై జిల్లాల అధికారులతో ముఖ్యమంత్రి విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ ఆర్డీఓతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన కార్పొరేషన్ ఉత్సత్తులపై నాణ్యతలో రాజీ వద్దని, కర్ణాటక లాంటి పొరుగు రాష్ట్రాలు ఎలా విక్రయిస్తున్నాయి. ఎలా లాభాలు గడిస్తున్నాయో, ఆయా గిరిజన సహకార సంస్థల పనితీరును అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. కాగా 2017-18 లో సాంఘిక సంక్షేమ శాఖకు కేటాయించిన బడ్జెట్ రూ.3692.44. వ్యయం చేసిన మొత్తం రూ. 3144.21. (85%) గా ఉంది. 2018-19లో కేటాయించిన మొత్తం రూ.4278.78 కోట్లు. 2017-18లో గిరిజన సంక్షేమానికి కేటాయించిన మొత్తం రూ. 1815.33 కోట్లు కేటాయించగా రూ.1724.44 కోట్లు (95%) వ్యయం చేశారు. 2018-19లో రూ. 2129.13 కోట్లు మంజూరు చేశారు. ఇక బి.సి సంక్షేమానికి కేటాయించింది రూ.5015.70 కోట్లుకాగా,అ దులో రూ. 4916.23 కోట్లు (98%) వ్యయం చేశారు. 2018-19లో రూ.6213.16 కోట్లు కేటాయించారు

కార్పొరేట్ సర్వీసు రెస్పాన్స్ బిలిటీ నిబంధన కింద APGENCO 90 లక్షల రూపాయలతో వైద్య పరికరాలు, వివిధ వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన ఎక్విప్ మెంట్ గల రెండు ఆరోగ్య రధాలను బుధవారం ముఖ్యమంత్రి ఉండవల్లి నివాసం వద్ద గల గ్రీవెన్సు హాలు దగ్గర ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ రెండు ఆరోగ్య రధాలలో ఒక వాహనాన్ని సీలేరు, రెండవదానిని కడప జిల్లాకు కేటాయించడం జరిగింది. ఈ ఆరోగ్య రధాలతో వివిధ రోగాలకు సంబంధించిన 150 వైద్య పరీక్షలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇసీజీ, రక్త పరీక్షలు, అయిదు పెరామీటర్ మోనిటరింగ్ సిస్టం, నీరుడు పరీక్ష, నెబురైజర్, ఆక్సిజన్, హార్టు ఎటాక్ వచ్చిన రోగి వైద్య సేవలు అందించి ప్రమాదం నుండి రక్షించుటకు తగిన సౌకర్యాలు ఈ ఆరోగ్య రధాలలో ఏర్పాటు చేశారు.

genco 31052018 2

ఆరోగ్య రధాలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ ఆయా గ్రామాలలో ప్రజలకు అందుబాటులోకి ఉండి ఉచిత వైద్య సేవలు అందిస్తాయి. ఆరోగ్య రధంలో ఒక మెడికల్ ఆఫీసరు, ఫార్మసిస్ స్టాఫ్ నర్సు, టెక్నీషియన్ ఉంటారు. అవసరమైన మందులు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధులకు సంబంధించిన పరీక్ష ఉచితంగా నిర్వహిస్తారు. క్యాన్సర్ వంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించి, NTR వైద్య సేవ ఆసుపత్రులకు పంపడం జరుగుతుంది. రోగులకు సంబంధించిన వివరాలను ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులో అప్లోడ్ చేసి రోగి ఆధార్ కార్డును అనుసంధానం చేయడం జరుగుతుంది.

genco 31052018 3

ఆరోగ్య రధాలకు అదనంగా ఒక్కొక్కటి 15 లక్షల విలువగల 3 అంబులెన్స్ లను ఏర్పాటు చేసింది. గిరిజన ప్రాంతాల ప్రజలు ఎవరైనా PHC కి రాలేని వారు ఉంటే ఈ అంబులెన్స్ లు ఆయా గ్రామాలకు పంపి ఇంటి వద్దనే ఉచిత సేవలు అందించడం జరుగుతుంది. 3 అంబులెన్స్ లను సీలేరు, కడప (రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏరియా), ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దులో గల మచ్ ఖండ్ పవర్ ప్రాజెక్టు ఏరియాలకు కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్ కో సీఎండీ విజయానంద్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐ అండ్ ఐ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ పాల్గొన్నారు.

Advertisements

Latest Articles

Most Read