ప్రత్యేక హోదా, విభజన హామీలు కంటే, మన రాష్ట్రానికి రావలసిన అతి పెద్ద ఆస్తి, 9, 10వ షెడ్యూల్‌లోని సంస్థల్లో వాటా... ఇది తెలంగాణా రాష్ట్రంలో నుంచి రావాలి కాబట్టి, అటు జగన్ కాని, ఇటు పవన్ కాని అడగడు... హైదరాబాద్ లో ఉంటూ, ఏపి రాజకీయలు చేసే ఎవరూ అడగరు... అటు కేంద్రం, పట్టించుకోదు... ముందు నుంచి ఈ సమస్య పై, కేవలం చంద్రబాబు మాత్రమే పోరాడుతున్నారు... తాజాగా చీఫ్ సెక్రటరీ స్థాయిలో మరో సమావేశం జరిగింది... రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం 9వ షెడ్యూల్‌లోని 40 సంస్థల ఆస్తుల పంపకాలపై నాన్చుడు ధోరణిని విడనాడాలని తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వీటి పంపిణీ కోసం కేంద్వ్రం నియమించిన షీలాబిడే కమిటీ ఇచ్చిన సిఫారసులను అంగీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చేసిందని, వాటి పంపకాలు కూడా దాదాపుగా జరిగిపోయినట్లేనని చెప్పింది.

telangana 12052018 2

సీఎస్‌ల పరంగానే గాక అధికారుల స్థాయిలోనూ భేటీలు జరపాలనే ప్రతిపాదనను ఆమోదించారు. విభజన సమస్యలపై శుక్రవారం మెట్రోరైలు భవన్‌లో ఏపీ సీఎస్‌ దినేశ్‌కుమార్‌, తెలంగాణ సీఎస్‌ ఎస్‌కే జోషి, ఇరు రాష్ట్రాల ఎస్‌ఆర్‌ విభాగం ఉన్నతాధికారులు రామకృష్ణారావు, ప్రేమచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీల ప్రక్రియకు అనుమతించాలని నిర్ణయించారు. సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఉపాధ్యాయుల పరస్పర బదిలీల అంశానికి సానుకూలత వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాత అనుమతించాలని నిర్ణయించారు. ఏపీలోని తెలంగాణ ఉద్యోగుల బదిలీలకు ఏపీ అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించారు.

telangana 12052018 3

మరోవైపు హైదరాబాద్‌లో సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఏపీ వాటాగా వచ్చిన భవనాలు తమకు అప్పగించేయాలని తెలంగాణ ప్రభుత్వం అడిగింది. తమ ముఖ్యమంత్రి తో చర్చించి చెప్తామని దినేశ్‌ సమాధానమిచ్చారు. మరోవైపు 9వ షెడ్యూలులో స్థిరాస్తులు లేని సంస్థలు కొన్ని అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. ఇలాంటి సంస్థల్లో కొందరు ఉద్యోగులు, కొద్దిపాటి నిధులు మాత్రం ఉన్నాయి. వీటి విషయంలోనూ సానుకూల పంపకాలకు సుముఖత వ్యక్తమైంది. మరోవైపు హైదరాబాద్‌లోని మ్యూజియంలలో ఉన్న పురావస్తు సంపదను కూడా పంచాలని ఏపీ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించారు. ఆయా మ్యూజియంలలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కళాఖండాలు, ఇతర పురావస్తు సంపదను అప్పగించాలని అడిగారు. ఏపీ జెన్‌కోకు తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించాలని కోరారు. ఈ బకాయిలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకుంటోంది. బకాయిల చెల్లింపుల విషయంలో సానుకూలంగా వ్యవహరించేలా చూడాలని తెలంగాణ ప్రధాన కార్యదర్శిని అడిగారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు రూ. 15.50 లక్షల విరాళాన్ని అందజేసిన తెనాలి పట్టణం ఐతానగర్ కు చెందిన రైతులు... పట్టిసీమ పూర్తితో సాగు నీటి వనరులు పుష్కలంగా అందజేసినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్జ్ఞతలు తెలిపిన రైతులు... తెనాలి రైతులు విరాళాలివ్వడం స్పూర్తి దాయకం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు... ప్రజాదర్బార్ లో తెనాలి రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు... పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2019 నాటికల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి నీళ్ళందిస్తామన్నారు.... రాష్ట్రంలో కరవును తరిమేస్తానన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, "పంటలను కాపాడుకుంటాం. కృష్ణా డెల్టానే కాకుండా నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా కూడా నీరందిస్తాం. రాష్ట్రంలో అయిదు నదుల అనుసంధానం చేయగలగడం ఏపీకే సాధ్యమైన విషయం. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూతొమ్మిది జిల్లాలకు సాగు, తాగు నీటికి కొరత లేకుండా చేస్తాం"

pattiseema 12052018 2

"కృష్ణా నదిలో నీరు రావడం కష్టమైన స్థితిలో పట్టిసీమ పూర్తితో కోస్తా రైతుల కష్టాలు తీర్చాం. తెనాలి రైతుల స్పూర్తి కేంద్రానికి కనువిప్పు కావాలి. భారత్ లో ఏపీ నెంబరు వన్ కావాలి. రాష్ట్రప్రజల సహకారంతో ఇది సాధ్యం అవుతుంది.ప్రతిపక్షం అడ్డుకున్నా, కేంద్రం నిధులివ్వకున్నా పోలవరం ఆగదు. రాజధాని నిర్మాణానికి ఒక్క పిలుపుతో రైతులు 33వేల ఎకరాలిచ్చారు. పులివెందులకూ నీళ్ళిచ్చాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా విరాళాలిచ్చి ప్రభుత్వానికి బాసటగా నిలవాలి. విభజన చట్టం అమలులో కేంద్రం రిక్తహస్తం చూపింది.రావాల్సిన నిధులు అడిగితే మనపైనే బీజేపీ ప్రభుత్వం ఎదురుదాడి చేయడం సరికాదన్నారు."

pattiseema 12052018 3

15 తర్వాత ఎక్కడికో పంపుతామని బీజేపీ అధికార ప్రతినిధి బెదిరిస్తున్నారు. పద్ధతి లేని రాజకీయ విధానాన్ని పాటించడం సహించమన్నారు. రాజకీయాలు హుందాతనంగా ఉండాలి. ఇచ్చిన హామీలు చెప్పిన మేరకు అమలు చేయాలి. రాష్ట్రప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులను కూడా ఇవ్వరా. కేంద్రం బెదిరింపులకు బెదరం. మాకు అన్యాయం జరిగితే కొండనైనా ఎదురిస్తాం, పిండి చేస్తాం. ఎన్టీఆర్ స్పూర్తితొ ముందుకు వెళతాం. మంచి వాతావరణానికి నాందిపలికుదాం.ఆదర్శ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుదాం. దేశంలో ఏపీని నంబరు వన్ గా అభివృద్ధి చేద్దాం. రైతుల చొరవ స్పూర్తి అభినందనీయం. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిధులు కేటాయించని కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఖండించిన రైతులు పోలవరం పూర్తయితే రాష్ట్రంలోని మాలాంటి లక్షలాది రైతు కుటుంబాల జీవితాలు బంగరమయం అవుతాయన్న రైతులు.

pattiseema 12052018 4

పోలవరం నిర్మాణానికి అడ్డుపడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని సీఎం వద్ద నిరసన తెలిపిన రైతులు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా చిత్తశుద్ధితో పని చేస్తున్న సీఎం చంద్రబాబుకు అండగా నిలబడతామన్న రైతులు. తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో 150 మందికి పైగా తెనాలి నుంచి వచ్చిన రైతులు. పోలవరం నిర్మాణం నిధుల సమీకరణలో సీఎం చంద్రబాబుకు అండగా ఉంటామన్న రైతులు తమవంతు భాగస్వామ్యంగా రూ. 15.50 లక్షల విరాళాన్ని సేకరించుకుని తెచ్చి సీఎం చంద్రబాబుకు అందజేసిన రైతులు. పట్టిసీమ ద్వారా మూడేళ్ళుగా పంటలు పండించుకుని లబ్దిపొందుతున్న రైతులు విరాళాలిచ్చారని ఆలపాటిరాజేంద్రప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. స్వచ్చందంగా ముందుకు వచ్చి కనీసం వంద రూపాయలైనా రైతులు విరాళంగా ఇచ్చారని పేర్కొన్నారు.

శుక్రవారం జరిగిన టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్‌ చేసిన ఒక ప్రతిపాదనతో చంద్రబాబు అవాక్కయ్యారు... ప్రత్యేక హోదా సహా కేంద్రం ఇచ్చిన హామీల అమలు కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని చంద్రబాబు అడగగా, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్‌ ఒక ఐడియా ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 600 సైకిళ్లు చొప్పున మొత్తం లక్ష సైకిళ్లతో నిరసన ప్రదర్శన నిర్వహిద్దామని, మన ఎన్నికల గుర్తు కూడా సైకిలే కాబట్టి మన సైకిల్‌ దెబ్బకు కేంద్రం దద్దరిల్లుతుందని రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్‌ పేర్కొన్నారు. ‘‘ప్రదర్శన ఎక్కడికి.. అమరావతికా! దిల్లీకా!’’ అని చంద్రబాబు అడగడంతో సమావేశం నవ్వులతో నిండిపోయింది. ‘‘అయ్యయ్యో.. అమరావతికే.. దిల్లీకి అనుకుంటున్నారా!’’ అంటూ మురళీమోహన్‌ వివరించే ప్రయత్నం చేశారు.

muralimohan 12052018

ఎమ్మెల్యేలు అమరావతికి, ఎంపీలు దిల్లీకి సైకిల్‌ యాత్రలు చేస్తే బాగుంటుందని మరికొందరు చమత్కరించారు. మురళీమోహన్‌ సినీ నటుడు కాబట్టి, ఆయన అలాంటి ప్రతిపాదన చేశారని, అది ఊహించుకోవడానికి బాగానే ఉందని, ఆచరణలో ఎంత వరకు సాధ్యమో చూడాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘అది చేస్తే మెగా ఈవెంట్‌ అవుతుంది. అయితే వేసవిలో కాకుండా సమయం సందర్భం చూసుకుని చేస్తే బాగుంటుందని’’ సీఎం అభిప్రాయపడ్డారు. సమావేశంలో పాల్గొన్నవారిలో ఎవరూ ఈ ప్రతిపాదనతో ఏకీభవించలేదు. మురళీమోహన్‌ పలు సందర్భాల్లో జోక్యం చేసుకుని సలహాలు, సూచనలు ఇచ్చారు. మురళీమోహన్‌ మంచి నటుడని, కానీ పార్టీకి ఏమీ ఉపయోగపడటం లేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవ్వుతూ వ్యాఖ్యానించారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు కూడా కొన్ని ప్రతిపాదనలు చేశారు.

muralimohan 12052018

ధర్మపోరాట దీక్షకు తిరుపతి, విజయవాడలో మంచి స్పందన వచ్చింది. దిల్లీలోనూ చేస్తే కేంద్రం దిగి వస్తుంది అని జీవీ ఆంజనేయులు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన అన్యాయాన్ని వివరిస్తూ ఇతర రాష్ట్రాల్లోనూ బహిరంగ సభలు నిర్వహించాలి. నమ్మక ద్రోహాన్ని వివరిస్తూ అక్కడి ప్రజల్లో ఆంధ్రప్రదేశ్‌ పట్ల సానుభూతి పెంచాలి అని నిమ్మల కిష్టప్ప అన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 100 మంది చొప్పున 175 నియోజకవర్గాల వారు 175 రోజులు దిల్లీకి వెళ్లి దీక్ష చేయాలి. చివరి రోజు భారీ బహిరంగసభలో చంద్రబాబు పాల్గొనాలి. మన పోరాటాన్ని దిల్లీకి మార్చాలి అని ఎస్వీ మోహన్‌రెడ్డి సలహా ఇచ్చారు.

దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన కర్ణాట ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. కర్ణాటకలోని 222 అసెంబ్లీ స్థానలకు ఇవాళ ఉదయం 7గంట నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ జరిగింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సాయంత్రం 6.30 గంటల తర్వాత వివిధ సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను పరిశీలిస్తే కర్ణాటకలో మరోసారి కాంగ్రెస్‌పార్టీ అధికారం కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియాటుడే: కాంగ్రెస్‌ 106 నుంచి 108 స్థానాల్లో, భాజపా 80-93 స్థానాల్లో జేడీఎస్‌ 20-30 స్థానాల్లో, ఇతరులు 1-4 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఇండియాటుడే తెలిపింది.

exit polls 12052018 2

టైమ్స్‌నౌ-వీఎంఆర్‌: కాంగ్రెస్‌ 90 నుంచి 103 స్థానాల్లో, భాజపా 80-93, జేడీఎస్‌ 31-39, ఇతరులు 2-4 స్థానాల్లో విజయం సాధించ వచ్చని టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌ వెల్లడించింది. ఈ పోల్స్‌లో దాదాపు 7000 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించినట్లు ఆ ఛానల్ తెలిపింది. దాదాపు 600 పోలింగ్ బూత్‌లలో ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది. రిపబ్లిక్‌ టీవీ- జన్‌కీ బాత్‌: కాంగ్రెస్‌ 73-82 స్థానాల్లో, భాజపా 95-114, జేడీఎస్‌ 32-43, ఇతరులు 2-3 స్థానాల్లో విజయం సాధించే అవకాశముంది. ఆజ్‌తక్ ఛానల్ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడబోతోందని తెలుస్తోంది.

exit polls 12052018 3

ఇండియా టుడే-యాక్సిస్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బీజేపీకి 79-92, కాంగ్రెస్‌కు 106-118, జేడీఎస్‌కి 22-30 స్థానాలు లభిస్తాయని ప్రకటించింది. సీ-ఓటర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని తెలుస్తోంది. బీజేపీకి 97-109, కాంగ్రెస్‌కు 87-99, జేడీఎస్‌కి 21-30, ఇతరులకు 1-8 స్థానాలు లభిస్తాయని సీ-ఓటర్ సర్వే చెప్తోంది. ఈ సర్వే శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగినట్లు పేర్కొంది. సాయంత్రం 5 గంటల వరకు 64 శాతం పోలింగ్‌ నమోదయిందని సంబంధిత అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రంలోని రామనగర్‌ జిల్లాలో అత్యధికంగా 84 శాతం పోలింగ్ నమోదుకాగా, బెంగళూరు పట్టణంలో అత్యల్పంగా 44 శాతం నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

Advertisements

Latest Articles

Most Read