హైదరాబాద్ లో కూర్చుని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తున్న జగన్, పవన్, అతి ముఖ్యమైన విషయంలో మాత్రం మౌనంగా ఉంటున్నారు... ఇప్పటి వరకు కనీసం, ఈ మాట కూడా ఎత్తలేదు... అదే తెలంగాణా మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన విద్యుత బకాయలు... ఒకటి రెండు కాదు, 5700 కోట్లు మనకి బాకీ ఉన్నాడు, కెసిఆర్... కెసిఆర్ ప్రత్యెక హోదాకు మద్దతు ఇస్తున్నారని, ఆహా ఓహో అంటున్న వారు, మనకు తెలంగాణా నుంచి రావల్సిన వాటి గురించి మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు ఎత్తరు... జగన్ మాట్లాడడు, పవన్ మాట్లాడడు, మిగతా వారు మాట్లాడరు... వీటి మీద కేంద్రాన్ని అడగరు... వీటి కోసం ఆందోళన చెయ్యరు... మోడీ అంటే, వీరిద్దరికీ ఎలాగూ భయం, కనీసం కెసిఆర్ ని అయినా అడుగుతారు అనుకుంటే, కెసిఆర్ కు భజన చేస్తారు కాని, మన రాష్ట్రానికి రావాల్సిన 5700 కోట్ల బాకీ గురించి ఎవరూ మాట్లాడారు... మరి చంద్రబాబు ఏమి చేస్తున్నాడు అంటారా ?

pawan jagan 10052018 2

రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై, మోడీనే వాయిస్తున్నాడు చంద్రబాబు, ఈ కెసిఆర్ ఒక లెక్కా ? ఏకంగా తెలంగాణా సంస్థల పై, దివాళా ప్రక్రియ ప్రారంభించాలని కేసు వేసారు.. మాది ధనిక రాష్ట్రం, మాకు ఆంధ్రప్రదేశ్ తో పోలిక ఏంటి అంటూ డాంబికాలు పోయిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, మన ఆంధ్రప్రదేశ్ కరెంటు వాడుకుని, మనకి బాకీ ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయాడు... మానకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, బిల్డ్ అప్ ఇస్తూ, బయట తిరుగుతూ, ఫోజులు కొడుతున్న కెసిఆర్ పై దూకుడుగా ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా, ఒక ప్రభుత్వ సంస్థ, మరొక ప్రభుత్వ సంస్థ నుండి తన బకాయిలను తిరిగి పొందడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) వద్దకు వెళ్లి, ఆ సంస్థ పై దివాలా ప్రక్రియ ప్రారంభించి, ఆస్తులు జప్తు చేసి, మా బాకీ మాకు తీర్చేలా చెయ్యండి అంటూ, పిటీషన్ వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ...

pawan jagan 10052018 3

తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌), ఉత్తర ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌)ల నుంచి రూ.5732.40 కోట్లు బకాయి రాబట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ విద్యుదుత్పత్తి కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ జెన్‌కో) న్యాయపోరాటం ప్రారంభించింది. నోటీసులిచ్చినా తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలు స్పందించలేదని.. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ల దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌లో ఏపీ జెన్‌కో వేర్వేరుగా రెండు దరఖాస్తులు దాఖలు చేసింది. ఏపీ జెన్‌ కో తరఫున ఎండీ కె.విజయానంద్‌ ఈ దరఖాస్తులను దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన ఎన్‌సీఎల్‌టీ జ్యుడీషియల్‌ సభ్యులు మురళి.. కౌంటరు దాఖలు చేయాలని తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్‌ 1వ తేదీకి వాయిదా వేశారు. కనీసం, ఇప్పటికైనా కొంచెం ధైర్యం తెచ్చుకుని, పవన్, జగన్, ఈ విషయం పై పోరాడాలని ఆశిద్దాం...

గాలి జనార్ధన్ రెడ్డి... గాలి జనార్ధనరెడ్డి... జగన్ మోహన్ రెడ్డికి దేవుడు ఇచ్చిన అన్నయ్య... ఇద్దరూ కలిసి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేసి కొల్లగొట్టారో అందరికీ తెలిసిందే... ఇద్దరూ జైలు జీవితం అనుభవించి, ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నారు... వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండ చూసుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజ సంపదను కొల్లగోట్టేసారు... మైనింగ్ లో, గాలి అక్రమ సంపాదన గురించి చెప్పే పనే లేదు... బంగారపు కుర్చీలతో సహా, గాలి విచ్చలవిడితనం అందరం చూసాం... రాజశేఖర్ రెడ్డి అండ చూసుకుని, ఆ రోజుల్లో గాలి, మొత్తం సహజ సంపద కొల్లగొట్టాడు... అయితే, 2010లో, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై, హై కోర్ట్ కొన్ని ఆదేశాలు ఇచ్చింది...

gali 10052018 1

ఆంధ్రప్రదేశ్ లో మైనింగ్ ఆపెయ్యాలని ఆదేశాలు ఇచ్చింది... ఇదే విషయం పై గాలి బ్యాచ్ సుప్రీమ్ కోర్ట్ కి వెళ్ళింది... అయితే మే 11, 2010లో సుప్రీం కోర్ట్ అత్యుతున్నత జడ్జి తీసుకున్న నిర్ణయం చర్చనీయంసం అయ్యింది.. సరిగ్గా రిటైర్మెంట్ కి ఒక్క రోజు ముందు, ఓబులాపురం మైనింగ్ కంపెనీకి, మళ్ళీ మైనింగ్ చేసుకోమని ఆదేశాలు ఇచ్చారు... అయితే అప్పట్లో దీని పై పలు అనుమానాలు ఉన్నా, ఆధారాలు ఏమి లేకపోవటంతో, ఎవరూ ఏమి మాట్లాడలేని పరిస్థితి... అయితే, ఈ రోజు కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న వేళ, ఇదే విషయం పై, కర్ణాటక టీవీ ఛానల్ చేసిన ఒక స్టింగ్ ఆపరేషన్, ఇప్పుడు అతి పెద్ద సెన్సేషన్ అయ్యింది...

gali 10052018 1

కర్ణాటక డిప్యూటీ సీఎం అభ్యర్థి , గాలి జనార్ధన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు శ్రీరాములు ఆ టివి ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయాడు.. అక్రమ మైనింగ్ మళ్ళీ ఓపెన్ చెయ్యటానికి, సుప్రీం జడ్జికి 160 కోట్లు లంచం ఇచ్చినట్టు చెప్తూ, ఆ స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయాడు... గాలి జనార్ధన్ రెడ్డి, తన బెయిల్ కోసం, 100 కోట్లు ఇస్తూ దొరికిపోయిన సంగతి తెలిసిందే... ఇప్పుడు కేవలం అనుమతులు కోసం 160 కోట్లు లంచం ఇచ్చినట్టు, గాలి సన్నిహితుడు చెప్తున్న విషయం చూస్తుంటే, దిమ్మ తిరుగుతుంది... ఇది ఆంధ్రప్రదేశ్ మైనింగ్ కి సంబంధించిన కేసు కాబట్టి, ఈ 160 కోట్ల మీద విచారణ జరిపితే, ఇంకా పెద్ద తలకాయలు, ఆ రోజుల్లో YSR సన్నిహితులు, జగన్ హస్తం, అన్నీ బయటకు వచ్చే అవకాసం ఉంది... మొత్తానికి, ఎన్నికలకు 48 గంటల ముందు, ఈ విషయం అతి పెద్ద సెన్సేషన్ అయ్యింది... చివరకు, ఇది ఎటు వెళ్తుందో చూడాలి... చివరగా, ఇలాంటి వారిని గెలిపించమని, చెప్తున్న నరేంద్ర మోడీ గారికి, ధన్యవాదాలు...

రెండు రోజుల క్రితం వరకు కర్ణాటకలో, బీజేపీ ఓడిపోతుంది అని, కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది అని, మోడీ చేసిన అన్యాయం పై తెలుగు వారి రగిలి పోతున్నారని, కర్ణాటకలో ఉన్న తెలుగు వారు అందరూ, బీజేపీ ని ఓడించి, మోడీకి బుద్ధి చెప్తారని, హైదరాబాద్ మీడియా ఊదరగొట్టింది... నిజానికి, గ్రౌండ్ రియాలిటీ కూడా అదే... అయితే, గత రెండు రోజుల నుంచి, నెమ్మదిగా ట్యూన్ మారుస్తూ వచ్చారు... ఈ రోజు, ఏకంగా లగడపాటి సర్వే అనే అర్ధం వచ్చేలా, బీజేపీ గెలిసిపోతుంది అని వార్తలు రాసారు... మోడీ వచ్చిన తరువాత సీన్ మారిపోయింది అంటూ, తెలుగు వారిని ప్రభావితం చేసేలా వార్తలు వేసారు... మరీ ముఖ్యంగా, తెలుగుదేశం సానుభూతిపరులు నమ్మే పేపర్ ఒకటి, అలాగే మరో తెలుగు న్యూస్ ఛానల్, ఇలా రాయటంతో, దీని వెనుక ఎదో మతలబు ఉంది అంటూ, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు...

karnataka 10052018 1

నిజానికి గ్రౌండ్ లెవెల్ లో, కర్ణాటకలో బీజేపీ గెలిచే అవకాశమే లేదని, ఇప్పటికీ నోట్ల రద్దు వల్ల కలిగిన కస్టాలు, GST, ATM లలో డబ్బులు లేకపోవటం, ఇవన్నీ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయని, పైగా మోడీ చెప్పే అబద్ధాలు నమ్మే పరిస్థితిలో కర్ణాటక ప్రజలు లేరని అభిప్రాయ పడుతున్నారు... తెలుగు మీడియాలో వచ్చిన వార్తలు, కేవలం చివరి నిమిషంలో చేసే పోల్ మ్యానేజిమెంట్ లో భాగంగానే జరుగుతున్నవి అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు... అందుకే, తెలుగు దేశం సానుభూతి పరులు, ఎక్కువగా చూసే పేపర్ లో, బీజేపీ గెలుస్తుంది అని వార్తా రాసి, కొంత వరకు, కర్ణాటకలోని తెలుగు ప్రజల్లో అలజడి రేపే ప్రయత్నం చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు...

karnataka 10052018 1

బీజేపీ, కేసీఆర్, మీడియాను ప్రభావితం చేసి ,విడుదల చేసే రాతల వలన కర్నాటకలో తెలుగు వారు, ఎలాగూ బీజేపీ గెలుస్తుందని, రిస్క్ తీసుకోవటం ఎందుకని వారికే ఓటేస్తారనేది వారి వ్యూహం... అయినా లగడపాటి సర్వే పేరిట, ఆ పేపర్ ఇలా రాయటం చూస్తుంటే, అక్కడ కాంగ్రెస్ గెలిస్తే, ఇక్కడ తెలంగాణాలో కాంగ్రెస్ బలపడుద్ది అని, అందుకే ఆ పేపర్ ద్వారా, కెసిఆర్ ఆడిస్తున్న డ్రామాగా విశ్లేషకులు భావిస్తున్నారు.. బీజేపీ వెనుకాల ఎలాగూ ఉండనే ఉంది.... మొత్తంగా లగడపాటి పెరు చెప్పి, కర్ణాటక తెలుగు ప్రజల్లో ఒక విధమైన కన్ఫ్యూషన్ క్రియేట్ చెయ్యటంలో, కెసిఆర్, బీజేపీ, హైదరాబాద్ మీడియా సక్సెస్ అయ్యారు... అయినా, కొన్ని నెలల క్రితం ఇలాగే వైసిపీ, లగడపాటి పేరు మీద కొన్ని పిచ్చి సర్వేలు ప్రచారం చేస్తుంటే, అప్పుడు లగడపాటి చెప్పిన మాట "నేను ఏ సర్వే చేసినా, మీడియా ముందుకు వచ్చి చెప్తాను... నా సర్వే అని ఎవరన్నా రాస్తే నమ్మకండి...." అని చెప్పారు... ఈ హైదరాబాద్ మీడియాకు, చంద్రబాబు ఎక్కువ లాభమా, కెసిఆర్ ఎక్కువ లభమా అని బేరీజు వేసుకుంటే, వీరు ఎప్పటికైనా కెసిఆర్ వైపే వెళ్తారు... మనం, ఇలాంటి వారితో ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి.. అందుకే, మన మీడియా మనకు ఉండాలి అనేది...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రికి, కేంద్ర మంత్రులకు వేర్వేరుగా లేఖలు రాశారు. చమురు ధరల తగ్గింపు, ఉపాధి హామీ వేతనాల చెల్లింపు వ్యత్యాసాలపై లేఖలు రాశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కు రాసిన లేఖలో కోరారు. క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా చమురు ధరలు తగ్గడం లేదని తెలిపారు. ముడిచమురు ధరలు తగ్గినా ప్రజలకు ప్రయోజనం చేకూరలేదని, ముడిచమురు ధరలు తగ్గినా 9 సార్లు సుంకం పెంచడం సరికాదని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు, ఉపాధి హామీ నిధుల పై మరో లేఖ రసారు చంద్రబాబు... గ్రామీణ కూలీలు, ప్రత్యేకించి వ్యవసాయ కూలీల (నరేగా) భత్యాల్లో గత నాలుగేళ్లుగా పెరుగుదల శూన్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

cbn 10052018 2

ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు లేఖరాశారు. ‘‘ఏపీలో 2014-15లో ‘నరేగా’ వేతనం రూ.180 ఉంది. 2016-17లో రూ.194, ఆ తర్వాత రూ.197, తాజాగా రూ.205 ఉంది. మొత్తంగా ఈ నాలుగేళ్లలో చూస్తే వేతనం 13.8 శాతం పెరిగింది. కానీ అదే సమయంలో ఎనిమిది నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం 72 శాతం పెరిగాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నిస్ప్రహ నెలకొంద’’ని ఆ లేఖలో తెలిపారు. హరియాణా, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో ఇస్తున్న స్థాయిలోనే, ఏపీలో కూడా ఉపాధి హామీ వేతనాన్ని ఇవ్వాలని కోరారు. మరో పక్క ప్రధాని మోడీకి, పీఎంఏవైలో ఏపీకి మొండిచెయ్యి పై మరో లేఖ రసారు. ‘ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌’ (పీఎంఏవై-జి) కింద రాష్ర్టాలకు ఇళ్ల కేటాయింపు విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

cbn 10052018 3

ప్రజాసాధికార సర్వేను ప్రామాణికంగా తీసుకుని ఇళ్ల కేటాయింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై బుధవారం ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో 20.99లక్షల మంది ఇళ్లు లేని పేదలు పీఎంఏవై పథకానికి అర్హులుగా ఉన్నట్లు మా సర్వేలో తేలింది. దానిని కేంద్రం ప్రామాణికంగా తీసుకుని ఇళ్ల కేటాయింపులు చేయాలి’’ అని కోరారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు లేఖలు రాశామని, ఒకసారి అసెంబ్లీలో, మరోసారి కేబినెట్‌లో తీర్మానాలు చేసి పంపామని గుర్తుచేశారు. ‘‘2022 నాటికి ’అందరికీ ఇళ్లు’ అనే పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. అందులోభాగంగా రాష్ర్టాలకు పీఎంఏవై ఇళ్లు మంజూరు చేస్తోంది. అయితే ఏపీకి రావాల్సినన్ని ఇళ్లు రావడం లేదు. పీఎంఏవై-జి ఇళ్ల కేటాయింపునకు 2011లో నిర్వహించిన సోషియో ఎనకమిక్‌ కాస్ట్‌ సర్వేను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల మాకు అన్యాయం జరుగుతోంది. ఆ సర్వే ఏపీలో సక్రమంగా జరగలేదు. అనేక అంతరాయాలతో గందరగోళంగా సర్వే సాగింది. ఆ సర్వే ప్రకారం పీఎంఏవై-జి పథకానికి రాష్ట్రంలో కేవలం 5.83లక్షల మంది మాత్రమే అర్హత సాధించారు. దానికి అనుగుణంగా 2016-17, 2017-18 సంవత్సరాలకు గాను రాష్ర్టానికి 1,23,112 ఇళ్లు మాత్రమే వచ్చాయ’’ని పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read