యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ మధ్య రాజధాని రచ్చబండ కార్యక్రమం, వారినికి రెండు సార్లే చేస్తున్నా, ఆయన పేల్చుతున్న పంచ్ లు మాత్రం, సూపర్ గా పేలుతున్నాయి. ఓవర్ హైప్ లేకుండా లాజికల్ గా మాట్లాడుతూ ఉండటంతో, ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వీక్షిస్తున్నారు. ఇక పొతే, రేపు సోమవారం అంటే, నవంబర్ 16వ తారీఖు టెన్షన్, వైసీపీలో అధికంగా ఉంది. జగన్ మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం రెడ్డి చేసిన పనికి, కంటెంప్ట్ అఫ్ కోర్ట్ కింద సుప్రీం కోర్ట్ లో కేసులు పడ్డాయి. హైకోర్ట్ జడ్జిల పై, అలాగే సుప్రీం కోర్టు కాబోయే చీఫ్ జస్టిస్ పై, జగన్ ఫిర్యాదు చేస్తూ, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు లేఖ రాసారు. అయితే ఆ లేఖను ప్రెస్ మీట్ పెట్టి మరీ బయటకు విడుదల చేయటం, వివాదాస్పదం అయ్యింది. ఒక పక్క చీఫ్ జస్టిస్ నోటీస్ లో ఉండగానే, దాదాపుగా ఏడు మంది జడ్జిల పై ఆరోపణలు చేస్తూ, ఆ ఆరోపణలు బహిరంగ పరచటం పై, దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. అన్ని రాష్ట్రాల బార్ అసోసియేషన్స్, వివిధ వర్గాలు దీన్ని ఖండించారు. మరి కొంత మంది సుప్రీం కోర్టులో జగన్ పై కంటెంప్ట్ అఫ్ కోర్ట్ కింద కేసులు కూడా వేసారు. అయితే దాదాపుగా 45 రోజులు తరువాత, ఈ కంటెంప్ట్ అఫ్ కోర్ట్ కేసుల్లో కదలిక రావటం, నవంబర్ 16న ఈ కేసులు లిస్టు కావటంతో, సుప్రీం కోర్టు ఏమి చెప్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

rrr 14112020 2

ముఖ్యంగా వైసీపీ శ్రేణులు, ఈ విషయంలో ఏమి అవుతుందా అని భయం భయంగా ఉన్నారు. అయితే అదే పార్టీకి చెందిన ఎంపీ రఘురామ రాజు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి, నవంబర్ 16 న జగన్ భవితవ్యం తేలిపోతుందని అంటున్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన, నవంబర్ 16 న జగన్ రాజీనామా కూడా చెయ్యాల్సి రావచ్చని అంటున్నారు. జగన్ చేసిన కంటెంప్ట్ అఫ్ కోర్ట్ అని అందరికీ తెలిసిందే అని, ఆయన ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయని, ఒకటి బేషరతుగా సుప్రీం కోర్టుకు తప్పు అయిపోయిందని చెప్పటం, రెండోది తాను రాజీనామా చేసి, ఆ స్థానంలో మరొకరిని పెట్టి నడిపించటం అని, రఘురామరాజు కుండ బద్దలు కొట్టేసారు. గతంలో నీలం సంజీవ రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, ఇలాగే కోర్టులు తప్పు బట్టటంతో రాజీనామా చేసిన చరిత్ర ఉందని, , రాజ్యాంగంలోని కన్వెన్షన్లకు లోబడి రాజీనామా చేసారని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారికి కూడా అదే పరిస్థితి ఉందని రఘురామరాజు అన్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించి, తప్పుడు సలహాలు వినకుండా, జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టులో తప్పు ఒప్పుకుంటే, అందరికీ మంచిదని, ఆయన ఇచ్చిన హామీలు చాలా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టే, ఆయానే సియంగా ఉండాలని తాను కోరుకుంటున్నాను కాబట్టి, కోర్టులో ఆయన తప్పు ఒప్పుకుని క్షమాపణ కోరితే తప్పితే, ఈ సమస్య ముగిసిపోదని రఘురామ రాజు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, రోజుకి ఒక వార్త ప్రజలను కలవర పెడుతుంది. ముఖ్యంగా 20 రోజులు క్రితం, చంద్రబాబు హయాంలో 55 వేల కోట్లకు ఆమోదించిన పోలవరం అంచనాలు, ఇప్పుడు 20 వేలకు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందనే వార్త కలవర పెడుతుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం, కేవలం ఒక లేఖ రాసి, చంద్రబాబుని టార్గెట్ చేస్తూ గడిపేస్తుంది. అయితే గత వారం మరో సంచలన వార్త బయటకు వచ్చింది. అదే పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తున్నారని. దీని పై ఎక్కడ ఇంకా అధికారికంగా ప్రకటన రాకపోయినా, ఇప్పటికే దీని పై ఏపి ప్రభుత్వం రివ్యూ చేసింది అంటూ వార్తలు వచ్చయి. ఇలా ఎత్తు తగ్గిస్తే, పోలవరం ఖర్చు భారీగా తగ్గించవచ్చని ప్రభుత్వం ప్లాన్ గా ఉంది. అయితే ఇలా ఎత్తు తగ్గించటం వల్ల, మనం దశాబ్దాలుగా కోరుకున్న పోలవరం ప్రాజెక్ట్ ప్రయోజనం చేకూరదు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు నీరు వెళ్ళాలి, అలాగే విద్యుత్ జనరేషన్ కూడా అనుకున్నట్టు జరగాలి అంటే, పోలవరం ఎత్తు 45.72 మీటర్లకు తగ్గకుండా ఉండాలి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే, 45.72 మీటర్లకు పోలవరం కడుతున్నాం కాబట్టి, తెలంగాణాలో ఉన్న 7 ముంపు మండలాలు, ఏపిలో కలపాలని కేంద్రం పై ఒత్తిడి తెచ్చి సాధించారు. ఇప్పుడు ఎత్తు తగ్గిస్తే, ఆ ముంపు మండలాలతో పని ఉండదని కూడా వార్తలు వస్తున్నాయి.

uma 14112020 2

ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నా, ఇప్పటి వరకు ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే దీని పై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. మాజీ ఇరిగేషన్ మంత్రి, గతంలో పోలవరం ప్రాజెక్ట్ శ్వాసగా పని చేసిన దేవినేని ఉమా, ఈ ఎత్తు తగ్గింపు వార్తల పై మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పిన దాని ప్రకారం, జగన్ నడుచుకుంటున్నారని, ఇదేదో ఆషామాషీగా చెప్పటం లేదని, కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అందులో జగన్ తో నేను మాట్లాడానని, పోలవరం ఎత్తు తగ్గిస్తే మా భద్రాచలం కూడా ముప్పు ఉండదు అని జగన్ తో చెప్తే, ఆయన ఒప్పుకున్నారు అంటూ, కేసిఆర్ చెప్పిన మాటల వీడియో ఉమా ప్లే చేసి చూపించారు. తన రాష్ట్రం మునగుకుండా కేసీఆర్ చెప్పిన దానికి జగన్ ఒప్పుకుని, మన రాష్ట్రాన్ని ముంచేస్తున్నారని, పోలవరం 13 జిల్లాల జీవనాడి అని, 3.57 మీటర్ల వరకు ఎట్టు తగ్గిస్తే, ఎక్కువ నీరు నిల్వ చేసుకునే సామర్ధ్యం ఉండదని, అలాగే గ్రావిటీ ద్వారా నీరు దూర ప్రాంతాలకు వెళ్ళదని, అటు రాయలసీమకు, ఇటు విశాఖకు కూడా ఇబ్బందని, అలాగే విద్యుత్ కూడా అనుకున్నంత మనం జెనరేట్ చేయలేమని, కేసీఆర్ చెప్పినట్టు కాకుండా, రాష్ట్ర ప్రయోజనాల కోసం నడుచుకోవాలని దేవినేను ఉమా అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రజల అవసరాలు కంటే, రాజకీయాలే ఎక్కువ. ముఖ్యంగా పదవిలో ఉన్న వారు, తమ బాధ్యత మర్చిపోయి, పక్క వాళ్ళ పై తప్పులు నెట్టి, సమస్య నుంచి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో చిన్న విషయాల్లో అయితే అనుకోవచ్చు, రాజధాని విషయం, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం విషయంలో కూడా అదే తంతు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర బీజేపీ శాఖ, ఇద్దరూ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పైనే తప్పు నెట్టేసి, పబ్బం గడిపేస్తున్నారు. చంద్రబాబు చేయలేదు, చేయలేడు అనే కదా ప్రజలు ఆయన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. మెడలు వంచేస్తాం అని ఒకరు, మాతోనే అభివృద్ధి అని మరొకరు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. 18 నెలలు పదవిలో ఉన్నారు. ఇప్పటికీ చంద్రబాబు వల్లే అంటే, ప్రజలు నమ్ముతారా ? మెడలు వంచేసి సాధిస్తామని, ఎందుకు సాధించలేదు అంటూ, చంద్రబాబు వైపు వేలు చూపిస్తే నమ్ముతారా ? మాతోనే దేశం వెలిగిపోతుందని అని నమ్మించి, ఇప్పుడు చంద్రబాబు వల్లే వెలుగులు లేవు అంటే ప్రజలు నమ్ముతారా ? తాజాగా జరుగుతున్న పోలవరం రచ్చలో, రెండు పార్టీల తీరు ఇలాగే ఉంది. చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు అంటూ నామస్మరణ చేస్తూ, కాలం గడిపేస్తున్నారు. గతంలో పోలవరం అంచనాలు రూ55 వేల కోట్లకు చంద్రబాబు ఆమోదింప చేసుకుంటే, ఇప్పుడు కేంద్రం 20 వేల కోట్లు మాత్రమే ఇస్తాం అంటుంది. ఇప్పటికే ఆమోదించి, తగ్గించారు. అయితే రాష్ట్రంలో ఉన్న వైసీపీ, ఎప్పుడో 2016లో చంద్రబాబు ఒప్పుకున్నారు, అందుకే కేంద్రం ఇలా చేసింది చంద్రబాబు నెట్టేసి, తమకు ఏమి సంబంధం లేదని తాము ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టామని చెప్తుంది.

verraju 13112020 2

ఇక అసలు ఇది చెయ్యాల్సిన కేంద్రం, ఆ కేంద్రంలో ఉన్న పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునే నిందిస్తుంది. నిన్న తిరుపతిలో ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, చంద్రబాబు అధికారుల్ని మ్యానేజ్ చేసి, పోలవరం అంచనాలు పెంచేసారని తేల్చేసారు. అంటే, చంద్రబాబుని తిట్టటం కోసం, కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వ అధికారులను కూడా నిందించే స్థాయికి వెళ్ళిపోయారు. ఒక పక్క కేంద్రం పోలవరంలో అవినీతి ఏమి జరగలేదు అంటే, చంద్రబాబు మొత్తం తినేసాడు అంటారు. పోలవరం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాటానికి, నీతి అయోగ్ సిఫారుసు అయితే, దీని పై అనుమానం ఉంది అంటారు. అంటే పోలవరం అంచనాలు పెంచటం చంద్రబాబు కుట్ర అని చెప్తూ, కేంద్రం చర్య సమర్ధిస్తూ, మరో పక్క అధికారులను కూడా చంద్రబాబు మ్యానేజ్ చేసారు అంటూ, తమ ప్రభుత్వాన్నే సంకిస్తున్నారు. చంద్రబాబు మీద ఉన్న ద్వేషం, సోము వీర్రాజుకు ఈ స్థాయిలో ఉంది. అయితే ఇది రాష్ట్రానికి చెందిన అంశం. చంద్రబాబుకి ఏమి అవ్వదు. పోలవరం అంచనాలు కోసం పోరాడకుండా, ఈ చంద్రబాబు గోల ఏంటో. పోలవరం ప్రాజెక్ట్ అవ్వకపోతే చంద్రబాబుకు ఏమి అవుతుంది, ఇబ్బందులు పాడేది రాష్ట్ర ప్రజలు.

రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పోకడలు కనిపిస్తున్నాయి. ఏపి ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలు చూసి, ప్రజలు షాక్ అవుతున్నారు. అయితే ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటే, ప్రజలు ఏమి చేయలగలరు. దీని గురించి మాట్లాడుకుని వదిలేయటం తప్ప. మనం పుట్టిన రోజు కానే, ఇతర ముఖ్య దినాలు, మన ఇష్ట దైవం గుడికి కానీ, చర్చికి కానీ, మసీదుకు కానీ, వారి వారి నమ్మకాలను బట్టి వెళ్లి జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థాయి నేతలు అయితే, తిరుమల నుంచి వేద పండితులు కానీ, ఇతర మతాల గురువులు కానీ వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇవి మనం చూస్తూనే ఉంటాం. అయితే ఎప్పుడూ చూడని విధంగా, ఒక ప్రైవేటు స్వామి వారికి, ఇలాంటి సేవలే చేయండి అంటూ, ఏపి దేవాదాయ శాఖ ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు చర్చనీయంసం అయ్యాయి. విశాఖ శారదా పీఠం, స్వరుపానంద స్వామి అంటే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అధినేతలకు ఇష్టులు. బహిరంగంగానే నేను జగన్ గెలవాలని పూజలు చేసానని స్వరుపానంద చెప్పారు కూడా. అయితే అది ఇద్దరి వ్యక్తుల మధ్య ఇష్టంగా ఉన్నంత వరకు బాధ లేదు కానీ, ప్రభుత్వాల వరకు వచ్చేస్తేనే ఇబ్బంది. స్వరుపానంద స్వామి పుట్టిన రోజు నవంబర్ 18. ఆ రోజు ఆయనకు వివిధ ఆలయాల నుంచి వచ్చి ఆలయ మర్యాదులు చేయండి అంటూ, శారదా పీఠం నుంచి, ఏపి ప్రభుత్వానికి నవంబర్ 9 న ఒక లేఖ వెళ్ళింది. దానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, నిన్న దేవాదాయ శాఖ, రాష్ట్రంలోని 23 ప్రముఖ దేవాలయాలకు ఆదేశాలు ఇస్తూ, ఆ రోజున స్వామి వారికి ఆలయ మర్యాదలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

swaroopa 14112020 2

ఇందులో తిరుపతి మినిహా, దాదాపుగా రాష్ట్రంలోని 23 ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. అంటే ఆ రోజు ఆ ఆలయాల్లో వివిధ దేవతా మూర్తులకు అలంకరించిన మాలలను, వేద పండితులు తీసుకు వెళ్లి, స్వరుపానంద స్వామిని ఆశీర్వదిస్తారు. అయితే ఇలా స్వామిజీలు పుట్టిన రోజు వేడుకలు జరపుకోవటమే ఆశ్చర్యం అంటుంటే, దానికి ప్రభుత్వం ఇలా అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వటంతో ప్రజలు విస్మయం చెందారు. స్వరుపానంద స్వామికి ఏ అర్హతతో ఇలా చేస్తున్నారని, రేపు ఇంకో స్వామి కానీ, మరొక బడా బిజినెస్ మ్యాన్ కానీ, మరో నాయకుడు కానీ ఇలాగే అడిగితే ఇచ్చేస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కంచి, శ్రింగేరి పీఠం వారికి కూడా దక్కని గౌరవాలు, ఒక సామాన్య స్వయం ప్రకటిత పీఠంకు దక్కటం పై విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ అధికారులు, ఇవి ఆయా ఈవోలు ఇష్టం పై ఆధారపడి ఉంటాయని, కచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదని, మేము మాములుగా ఉత్తర్వ్యులు ఇచ్చామని చెప్తున్నారు. ఏది ఏమైనా, ఇలా నియమాలు లేకుండా, ఇష్టం వచ్చినట్టు చేస్తే, రేపు మరొకరు కూడా ఇలాగే అడుగుతారు, ఇవన్నీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప ఏమి ఉండదు. అంతగా ప్రభుత్వాది నేతలకు ఇష్టం అయితే, వ్యక్తిగత హోదాలో చేసుకోవాలి కానీ, ఇలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం అభ్యంతరమే.

Advertisements

Latest Articles

Most Read