మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 13 వ తారీఖు ఆంధ్రప్రదేశ్ వచ్చి జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. ఆ రోజు మీడియా ముందుకు వచ్చిన చిరంజీవిని, ఏపి ఎందుకు వచ్చారు అని అడిగిన ప్రశ్నకు, సినిమా పరిశ్రమకు ఉన్న సమస్యల గురించి చర్చించడానికే వచ్చాను అని, దీని పట్ల జగన్ కూడా సానికులంగా స్పందిచారని, మంచి భోజనం పెట్టారని, భారతి గారు స్వయంగా వడ్డించారని, త్వరలోనే శుభవార్త వింటారని, అలాగే ఇక్కడ జరిగిన విషయాలు అన్నీ కూడా మా సినిమా వాళ్లతో కూడా చర్చించి, మంచి జరిగేలా చూస్తానని చెప్పుకొచ్చారు. సినిమా టికెట్ల వివాదం ముదురుతున్న నేపధ్యంలో ఆ సమస్య గురిచి చర్చించడానికే జగన్ తనను తన నివాసానికి రమ్మన్నారని చెప్పుకొచ్చారు. తనను పండగ పూట విందుకు జగన్ ఆహ్వానించటం, చాలా సంతోషంగా ఉందని చిరు అన్నారు. అ సమావేశం తనకు చాలా సంతృప్తి ని ఇచ్చిందని, స్యయానా భారతీ గారే తనకు వడ్డించారని మీడియా దగ్గర మురిసిపోయారు. సినిమా వర్గానికి ఏ నష్టం జరగదని జగన్ చాల భరోసా ఇచ్చారని గొప్పగా చెప్పారు. తరువాత నాగర్జున కూడా స్పందిస్తూ, చిరంజీవి, జగన్ ఏమి మాట్లాడకున్నారో తనకు తెలుసు అని, అంతా మంచి జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయం పై అంతా మంచి జరుగుతుందని అందరూ భావించారు.

chiru 24012022 2

అయితే తాజాగా AP మంత్రి పేర్నినాని శుక్రవారం మీడియాతో మాట్లడుతూ చిరంజీవి, జగన్ భేటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. సినిమా పరిశ్రమ సమస్యలు చర్చించడానికి అయితే ఆయన వచ్చినట్టు తెలియదని అన్నారు, అయన కేవలం మా సియం ఆహ్వానన్ని మన్నించి విందుకు మాత్రమే వచ్చారని, అంతే గాని సినిమా టికెట్ల గురించి ఎటువంటి చర్చ జరగలేదని చెప్పటం, అంతే కాకుండా ఏమైనా ఉంటే గింటే, ఇలాంటివి సెక్రటేరియట్ లో చర్చిస్తారు కానీ, ఇంట్లో భోజనం చేస్తూ ఎందుకు మాట్లాడుకుంటారు అంటూ బాంబు పేల్చారు. ఈ మీటింగు గురించి చిరంజీవి అబద్దం చెప్పరా? లేక పెర్ని నాని అబద్దం చెపారా? అనే చర్చ మొదలయింది. చిరంజీవి ఏమో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ అమరావతి వచ్చి, ఉత్సాహంగా మీడియా దగ్గర జగన్ తనకు సినిమా వివాదం ముగిసి పోయేలా చాలా హామీలే ఇచ్చారని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు మంత్రి పేర్ని నాని చిరంజీవి గాలి తీసిపడేసారు. చిరంజీవిని అవమానిస్తూ పేర్ని నాని మాట్లాడిన మాటలకు, చిరంజీవి స్పందిస్తారో లేదో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read