జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు ఉన్నా సరే, ఇక్కడ క్షేత్ర స్థాయిలో పర్యటన చేయకుండా, ఆయన పెళ్లిళ్లకు, భోజనాలకు వెళ్ళటం పై, సర్వత్రా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణా వెళ్లి మరీ, విందుల్లో పాల్గునటం, ఇక్కడ ప్రజలను గాలి వదిలేయటం పై, విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో షాకింగ్ విషయం బయట పడింది. మొన్న ఆదివారం జగన్ మోహన్ రెడ్డి, హైదరాబాద్ పెళ్లికి వెళ్లారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగిన పెళ్లికి, జగన్, కేసీఆర్ కూడా హాజరు అయ్యి, పక్క పక్కనే కూర్చున్న విషయం తెలిసిందే. జగన్ పక్కనే, పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కూర్చున్న ఫోటోలు, తరువాత అందరూ కలిసి భోజనం చేసిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డికి క-రో-నా సోకినట్టు స్పీకర్ కార్యాలయం తెలిపింది. ఆయన ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది. అయితే తనకు కాంటాక్ట్ లో వచ్చిన వారి అందరినీ టెస్ట్ చేయించుకోమని ఆయన కోరారు. మూడు రోజుల క్రితమే జగన్, కేసీఆర్ ఆయన పక్కన కూర్చుని ఉండటంతో, ఇప్పుడు వీరు కూడా టెస్ట్ లు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఎవరికీ మాస్కులు లేకపోవటం కూడా ఇక్కడ గమనించాలి. గత వరం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కూడా క-రో-నా బారిన పడిన సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read