విభ‌జ‌న గాయాలు నిలువెల్లా బాధిస్తుంటే చంద్ర‌బాబునాయుడు నాయ‌క‌త్వంలో ఆంధ్రప్రదేశ్ ప‌డిలేచిన కెర‌ట‌మై ఎగిసింది. అభివృద్ధి-సంక్షేమాల‌లో దేశానికే ఆద‌ర్శంగా నిలిచి అగ్ర‌స్థానం అందుకుంది. అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా, ప‌ద‌వీకాంక్ష‌తో త‌ప్పుడు హామీలు ఇస్తూ, ప్ర‌భుత్వంపై అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేస్తూ, చంద్ర‌బాబు పాల‌న‌పై విషం చిమ్ముతూ ప్ర‌జ‌ల్ని న‌మ్మించి న‌వ్యాంధ్ర పాల‌నాప‌గ్గాలు చేప‌ట్టారు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి. న‌ర‌న‌రాన టిడిపి పై విద్వేషం నింపుకున్న జ‌గ‌న్ త‌న క‌క్ష‌నంతా తొమ్మిది నెల‌ల పాల‌న‌లో తీర్చుకుంటు, పరిపాలనను వదిలేసారు. అమ‌రావ‌తి పేరు వినిపించినా, క‌నిపించినా విషం చిమ్ముతున్నారు. న‌వ‌ర‌త్నాలంటూ న‌య‌వంచ‌న చేస్తూనే వున్నారు. అభివృద్ధిలో అగ్ర‌గామిగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని అథఃపాతాళంలోకి తొక్కేశారు. 5 ఏళ్ళ పాటు ప్రజల కోసమే అహర్నిశలు కష్టపడిన చంద్రబాబు, ఇప్పుడు 9 నెలలు తరువాత, మళ్ళీ ప్రజల కోసమే బయలుదేరారు. జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ‌ పాల‌నపై ప్ర‌జల్ని చైత‌న్యం చేసేందుకే తెలుగుదేశం పార్టీ చేప‌ట్టింది ప్ర‌జాచైత‌న్య‌యాత్ర‌.

45 రోజుల పాటు ప్రజల మధ్యే ఉంటూ, ప్రజల కష్టాలు తెలుసుకుని, ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి, ప్రతిపక్ష పాత్ర పోషించటానికి, 70 ఏళ్ళ వయసులో చంద్రబాబు సిద్ధం అయ్యారు. తెలుగుదేశం పార్టీ, న‌వ‌మాసాలు-న‌వ మోసాలు అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్తుంది. ఇవి ఆ 9 మోసాలు. 1.వెన‌క‌బ‌డిన త‌ర‌గతుల‌కు వెన్నుపోటు, మూడు వేల కోట్లకు పైగా బీసీల నిధుల్ని మ‌ళ్లింపు, బీసీల‌కు ఆద‌ర‌ణ ప‌థ‌కం దూరం , కులానికో కార్పొరేష‌న్ అనే హామీపై దాట‌వేత. 2. ముస్లింల ఉనికికే ముప్పు, CAA, NRCల‌కు వైకాపా మ‌ద్ద‌తుతో ముస్లింల‌కు తీర‌ని న‌ష్టం, రంజాన్ తోఫా కానుక‌లు ర‌ద్దు, మండ‌లి చైర్మ‌న్ ష‌రీఫ్‌ని మ‌తంపేరుతో తిట్టిన వైకాపా మంత్రులు, జ‌గ‌న్‌ని అల్లాతో పోల్చుతూ ప్ర‌వ‌క్త‌ని కించ‌ప‌ర్చిన‌ వైకాపా నేత‌లు, మైనార్టీ కార్పొరేషన్ నుండి 442 కోట్లు మ‌ళ్లింపు

3. పింఛ‌న్ల న‌య‌వంచ‌న, పింఛ‌ను సొమ్ము వెయ్యి పెంచుతామ‌ని 750 త‌గ్గింపు, అమ‌లుకు నోచుకోని పింఛ‌ను అర్హ‌త 60 ఏళ్ల హామీ, రాష్ర్ట‌వ్యాప్తంగా 13 ల‌క్ష‌ల‌కు పైగా పింఛ‌న్లు కోత‌. 4. వ్య‌వ‌సాయం ..ఏదీ సాయం? చంద్ర‌బాబు చేసిన రుణ‌మాఫీ విడ‌త‌లు ర‌ద్దు, అప్పుల‌బాధ‌తో 270 మంది రైతుల ఆత్మ‌హ‌త్య‌, 12500 రైతుభ‌రోసా అంటూ 7,500 చెల్లింపు 5.ఉసూరుమంటున్న ఉద్యోగులు, సీపీఎస్ ర‌ద్దు చేస్తామ‌ని హామీ ఇచ్చి క‌మిటీల‌తో కాల‌యాప‌న‌, ఆర్టీసీ విలీనం పేరుతో సిబ్బంది ప్ర‌యోజ‌నాల కోత , నాలుగు విడ‌త‌ల డీఏ బ‌కాయిలు ఇంకా పెండింగ్‌, ఉపాధ్యాయుల‌కు బ‌దిలీల‌కు నో చాన్స్‌, పీఆర్సీ వేయ‌కుండా జాప్యం 5. మ‌ద్యం లంచాల‌కు నైవేద్యం, ద‌శ‌ల‌వారీ మ‌ద్య‌నిషేధమంటూనే విచ్చల‌విడి అమ్మ‌కాలు, బాటిల్‌కి 50, కేసుకు 150 చొప్పున‌ లిక్క‌ర్‌లో 3 వేల కోట్లు లంచాలు, మ‌ద్యం తయారీ కంపెనీల 1600 కోట్లు ఎగ‌వేత‌, రేటు రెండింత‌లు కావ‌డంతో పెరిగిపోతున్న సారా వంట‌లు

6.ఇళ్లు నిల్లు, చంద్ర‌బాబు క‌ట్టించిన ఇళ్లూ కేటాయించ‌కుండా ర‌ద్దు చేసిన జ‌గ‌న్‌, 9 నెల‌ల్లో ఒక్క కొత్త గృహం మంజూరు చేయ‌ని ప్ర‌భుత్వం, రివ‌ర్స్ టెండ‌రింగ్ పేరుతో నాసిర‌కం ఇళ్ల నిర్మాణాలు. 7.యువ‌త‌కు ఏదీ చేయూత‌?, నిరుద్యోగ భృతి ర‌ద్దు, ఉద్యోగాలు క‌ల్పిస్తున్న కంపెనీలను త‌రిమివేత‌, వాలంటీర్ల పేరుతో 4 ల‌క్ష‌ల మంది వైకాపా కార్య‌క‌ర్త‌ల‌కు చోటు, స‌చివాల‌య ఉద్యోగాల ప‌రీక్ష పేప‌ర్ ఒక్కోటి 10 ల‌క్ష‌ల‌కు అమ్మేసి 20 ల‌క్ష‌ల మందికి మోసం. 8. ఇసుక‌లో కోట్లు, వైకాపా నేత‌ల క‌నుస‌న్న‌ల్లో ఇసుక రీచ్‌లు.., ఒక్కో రీచ్ ద్వారా నెల‌కు కోట్లు కొల్ల‌గొడుతున్న నేత‌లు, ఇసుక‌దందాలో మంత్రులు, స్పీక‌ర్‌.

Advertisements

Advertisements

Latest Articles

Most Read