సీబీఐ ఈడీ న‌మోదు చేసిన 43 వేల కోట్ల అక్ర‌మాస్తుల కేసుల్లో వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ఏ1. ఈ కేసుల ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు జ‌గ‌న్ రెడ్డిని ఏ ప‌త్రికైనా ఏ1గానే రాస్తుంది. చివ‌రికి అదే అక్ర‌మ సంపాద‌న‌తో పెట్టుకున్న సాక్షిలో కూడా సీబీఐ-ఈడీ క్విడ్ ప్రోకో కేసులు గురించి వార్త రాయాల్సి వ‌స్తే ఏ1 జ‌గ‌న్ రెడ్డి అనే రాస్తాయి. అయితే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నైజం, బుద్ధి వేరు. త‌న‌ని అరెస్ట్ చేశారు కాబ‌ట్టి, త‌న ప్ర‌త్య‌ర్థులంద‌రూ అరెస్టు కావాలి. తాను దొంగ‌త‌నం మాన‌డు, దొంగ అంటే ఊరుకోడు ఇదీ జ‌గ‌న్ మెంటాలిటీ. త‌న పేరుని అక్ర‌మాస్తుల కేసుల సంద‌ర్భంగా ఏ1 అని రాసిన ఈనాడుపై క‌క్ష క‌ట్టారు. ఎవ‌రూ ఫిర్యాదు ఇవ్వ‌కుండానే త‌న అధికార‌యంత్రాంగాన్ని పంపి కేసులు న‌మోదు చేయించారు. ఫిర్యాదులేవు, అక్ర‌మాలు లేవు. కేవ‌లం జ‌గ‌న్ రెడ్డి త‌నని ఏ1 అన్న రామోజీరావు పేరు ప‌క్క‌న ఏ1 అని పెట్టాల‌నే శాడిజం కోరిక‌తోనే ఈ కేసులు న‌మోద‌య్యాయ‌ని అధికారులే ఆఫ్ ది రికార్డుగా చెప్పేస్తున్నారు. తాజాగా మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో అక్ర‌మాలు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌లతో ఏపీ సీఐడీ ఏ1గా రామోజీరావు, ఏ2గా చెరుకూరి శైల‌జ‌ను పేర్కొంది. ఈ కేసులో  రామోజీరావు కోడ‌లు  శైల‌జ‌కు , రామోజీరావుకు సైతం నోటీసులు పంపింది. ఈ నెల 29, 31, ఏప్రిల్ 3, 6 తేదీల్లో విచార‌ణ‌కు అందుబాటులో ఉండాల‌ని ఆ నోటీసుల‌లో పేర్కొన్నారు.  1982 చిట్ ఫండ్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసిన ఈ కేసుల్లో చాలా రోజులుగా సోదాలు చేస్తున్నారు. మార్గదర్శిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని  ఏ 1 గా చెరుకూరి రామోజీరావు, ఏ 2 గా చెరుకూరి శైలజ, ఏ 3 గా సంబంధిత బ్రాంచ్ మేనేజర్లపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రామోజీరావుకి ఊడిపోయేదీ ఏమీ ఉండ‌దు. కానీ రామోజీరావుని ఏ1 చేశాన‌నే పైశాచిక ఆనందం ఒక్క‌టే జ‌గ‌న్ రెడ్డికి మిగులుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read