జ‌న‌సేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప‌ద‌వికి రాజీనామా చేయ‌కుండానే వైసీపీలో చేరిన అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు  ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నీతులు వ‌ల్లించ‌డంపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. సోష‌ల్మీడియాలో ప‌తివ్ర‌త పలావ్ వండితే తెల్లారేవ‌ర‌కూ స‌ల్లార‌లేదంటూ రాపాకపై సైటైర్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్య‌ర్థికి ఓటేస్తే  టీడీపీ పదికోట్లు ఆఫర్ చేసింద‌ని చెప్పారు. జగన్‍ను నమ్మాను కాబట్టి టీడీపీ ఆఫర్‍ను తిరస్కరించాన‌ని చెప్పుకొచ్చారు. జ‌న‌సేన నుంచి గెలిచిన రాపాక వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నిక‌లో ఓటు వేయ‌డం నీతివంతం అట‌, టిడిపి వాళ్లు ఓటేయ‌మంటే ప‌దికోట్లు ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్ట‌ట‌. ఇదేం లాజిక్ రాపాక అంటూ సోష‌ల్మీడియాలో ప్ర‌శ్న‌లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సిగ్గు శరం వదిలేస్తే పదికోట్లు వచ్చి ఉండేవ‌ని,ఒకసారి పరువుపోతే సమాజంలో ఉండలేమంటూ స‌న్నీలియోన్ క‌బుర్లు  ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నుంచి రావ‌డంతో జ‌న‌సేన‌, టిడిపి ఒక రేంజులో ఆటాడుకుంటోంది. జ‌న‌సేన అభ్య‌ర్థిగా గెలిచి,  వైసీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం సిగ్గు శ‌ర‌మూ వ‌దిలేసిన‌ట్టు కాదా?  అని నిల‌దీస్తున్నారు. ఎటాకింగ్ తీవ్రం కావ‌డంతో త‌న‌ను ఓటు వేయాల‌ని అడిగారని, ప‌ది కోట్లు ఇస్తామ‌న‌లేదంటూ కొత్త వివ‌ర‌ణతో మ‌ళ్లీ మ‌రో వీడియో రిలీజ్ చేశారు రాపాక‌. తాను అమ్ముడుబోయే స‌రుకేన‌ని ఎప్పుడో నిరూపించుకున్న రాపాక, ఉద‌యం ఆడిన మాట‌ని సాయంత్రానికి మార్చేయ‌డంతో ఇది ఎనీ టైమ్‌ సేల్ కేండిడేట్ అని తేలిపోయింది. టిడిపి ఆఫ‌ర్ ఇచ్చి ఉంటే, ఓటేయ‌క ముందు ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని చ‌ర్చ వ‌స్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read