ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పాత్ర పై ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవి శంకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ నడుం కడుతుందా, రాజ్యాంగ పరిరక్షణకు ముందుకు వస్తుందా, ప్రజల్లో గూడు కట్టుకున్న అసహనాన్ని తొలగించేందుకు బీజేపీ ముందుకు వస్తుందా అంటూ, ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ల పై, ఇప్పుడు ఏపిలో చర్చా జరుగుతుంది. అయితే ఈ ట్వీట్లు చెయ్యటం వెనుక, ఏ కారణం ఉంది అనేది క్లారిటీ రావటం లేదు. వరుసగా కోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పై ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అలాగే రాష్ట్రంలో అన్ని వ్యవస్థల పై ప్రభుత్వం దాడి చేస్తుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఎవరైనా ఎదురు తిరిగితే ఏమి జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఇక ఎన్నికల కమీషనర్ వ్యవహారంలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇటీవలే, ఏకంగా న్యాయవ్యవస్థ పైనే దాడి మొదలైంది.

మరో పక్క సొంత పార్టీ ఎంపీ కూడా, ప్రభుత్వానికి ఏమైనా సూచనలు ఇస్తే, దాడి జరుగుతుంది. ఆయన ఏకంగా కేంద్రానికి లేఖ రాసి, తనకు సెక్యూరిటీ కావాలని కోరారు. ఇక అమరావతిని మూడు ముక్కలు చెయ్యటం కూడా, దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరో పక్క రాజకీయ దాడులు, కక్ష సాధింపు చర్యలు కూడా అధికం అయ్యాయి. ఇక రాష్ట్రంలో ఇసుక దొరక్క, పనులు లేక, జీవితాలు అస్తవ్యసంగా ఉన్నాయి. అప్పు తెచ్చి, ఉచితాలు పంచి పెట్టటం తప్ప, రాష్ట్రంలో జరుగుతున్నది ఏమి లేదు. ఈ నేపధ్యంలో జంధ్యాల రవి శంకర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఎలా వస్తుంది ? ఫెడరల్ వ్యవస్థలో మరో ప్రభుత్వాన్ని శాసించటం సాధ్యమయ్యే పనేనా ? ఏ రూపంలో బీజేపీ వచ్చి, జగన్ మోహన్ రెడ్డిని కట్టడి చేస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read