వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీ రావు మీద ఒంటి కాలు మీద వెళ్ళే వారు. తన పాలనకు వ్యతిరేకంగా కధనాలు వస్తే చాలు, వారిని ద్రోహులుగా చిత్రీకరించే వారు. కాని వైఎస్ఆర్ ఒక లైన్ దాటి వెళ్ళే వారు కాదు. విమర్శలు వస్తే, కొంచెం వెనక్కు తగ్గి, తెగే దాకా లాగే వారు కాదు. కాని ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం, దానికి పూర్తి భిన్నం. తనకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే చాలు, అటు సోషల్ మీడియాలో ఉన్న సామాన్యులు దగ్గర నుంచి, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఇటు పత్రికులు, టీవీ ఛానెల్స్ దాకా, అందరి సంగతి చూడటం మొదలు పెట్టరు. విమర్శ అనే మాట కూడా తట్టుకోలేక పోతున్నారు. ఇందులో భాగంగానే, గ్రామ సచివాలయ పేపెర్ లీక్ తో పాటుగా, రివెర్స్ టెండరింగ్ లో జరుగుతున్న స్కాం గురించి బయట పెట్టిన ఆంధ్రజ్యోతి కధనాలకు, వివరణ ఇచ్చే ప్రయత్నం చెయ్యకుండా, వాటి పై కక్ష తీర్చుకునే పనిలో ఉన్నారు.

rk 20102019 2

ఇప్పటికే ఏబీఎన్, టీవీ5 బ్యాన్ చేసారు. ఇంకా ఈనాడు జోలికి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు పేపర్ లను కూడా టార్గెట్ చేసారు. 24 గంటల్లో ప్రభుత్వానికి మచ్చ తెచ్చే వ్యతిరేక కధనాల పై కేసులు పెట్టమని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి ఇచ్చిన పరిహారం విషయంలో కూడా, కఠినంగా వెళ్తున్నారు. 1986లో ఆంధ్రజ్యోతి భూమి జాతీయ రహదారి విస్తారణలో పోవటంతో, దానికి పరిహారంగా వైజాగ్ లో భూమి ఇచ్చారు. అయితే ఈ భూమి విషయంలో నిర్ణయం తీసుకున్న జగన్, ఆ భూమి వెనక్కు తీసుకుంది. దీని పై వీకెండ్ కామెంట్ లో ఆర్కే, జగన్ కు సవాల్ విసిరారు. "ఇదంతా అక్రమమనీ, మొదటిసారిగా ‘ఆంధ్రజ్యోతి’కి మాత్రమే అప్పనంగా భూమిని కేటాయించారనీ మంత్రి పేర్ని నానితోపాటు జగన్‌ మీడియా ప్రచారం చేయడాన్ని న్యాయస్థానంలో తేల్చుకుంటాం. ‘ఆంధ్రజ్యోతి’కి కేటాయించిన భూమి అక్రమమని ప్రభుత్వం నిజంగా భావిస్తుంటే ఒక పని చేద్దాం. మేం ఆ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేస్తాం. అంతేకాకుండా ప్రభుత్వానికి చెల్లించిన 50 లక్షలను కూడా వదులుకుంటాం."

rk 20102019 3

"జగన్మోహన్‌రెడ్డి 45 వేల కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని దోచుకున్నారనీ, తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడ్డారనీ సీబీఐ నిర్ధారించినందున.. ఆయన కూడా సదరు మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారా? ఇందుకు సిద్ధమేనా? అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి, ఆయన అనుచరులు ఇతరులకు బురద పూయాలనుకోవడం హాస్యాస్పదంగా ఉండదా!? " అంటూ ఆర్కే జగన్ కు సవాల్ విసిరారు. మరి జగన్ ఆ ఛాలెంజ్ ఒప్పుకుని, తన డేర్ చూపించగలరా ? చూద్దాం. ఇదే సందర్భంలో జగన్ తనకు రాయబారం పంపటం పై కూడా ఆర్కే చెప్పుకొచ్చారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తమను బలపరిస్తే జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద ఉన్న విలువైన భూమిని ‘ఆంధ్రజ్యోతి’కి కేటాయిస్తామని అప్పట్లో ఇదే జగన్మోహన్‌రెడ్డిని, వైఎస్ఆర్ నా వద్దకు రాయబారం పంపారని, కాని షరతులకు లోబడి భూమి తీసుకోవడానికి అప్పుడు నేను అంగీకరించలేదని, జగన్ ఆ విషయం గుర్తుంచుకోవాలని ఆర్కే అన్నారు. మరి ఈ విషయం తప్పు అయితే, జగన్, ఆర్కే పై కేసు పెట్టాలి, ఎలాగూ కొత్త జీవో వచ్చింది కదా. చూద్దాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read