సొంత పార్టీ, ఎమ్మెల్యేలకు టార్గెట్ అయిన సర్సావురం ఎంపి కనుమూరు రఘురామకృష్ణంరాజు పై పోరు పోలీస్ స్టేషన్ వరకు ఎక్కింది. రఘురామకృష్ణంరాజుపై వైఎస్సార్సీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ప్రసాదరాజు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గ్రంధి శ్రీని వాస్ భీమవరం పోలీసులకు, మరో ఎమ్మెల్యే ప్రసాదరాజు నర్సాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సహచర ఎమ్మెల్యేలను అసభ్య పదజాలంతో కించపరిచారని, తమ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తూ, తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన ఎంపీ రఘు రామకృష్ణంరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి బుధవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదులో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటికే మంత్రి శ్రీరంగనాథరాజు కూడా పోడూరు పిఎస్లో నర్సాపురం ఎంపీ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఇళ్ల పథకంలో స్థలాలు కేటాయింపులో అక్రమాలు జరిగిన విషయం, కొనుగోళ్లలో కూడా గోల్ మాల్ జరుగుతున్న విషయం, ఇసుక స్కాం పై గతంలో రఘురామకృష్ణంరాజు జగన్ దృష్టికి తెచ్చారు. అయితే దీనిపై వైకాపా నేతలు తీవ్రంగా స్పందించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అయితే ఆ పార్టీ నాయకులు కాళ్ల వేళ్లా పడి బతిమాలితేనే తాను పార్టీలో చేరానంటూ రఘు రామకృష్ణంరాజు కూడా ఘాటుగానే స్పందించారు. ఇది రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత రఘురామకృష్ణంరాజుకు పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిపైనా అభ్యంతరం చెబుతూ ఎంపీ కౌంటర్ ఇచ్చారు. రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఇటు ఎంపీ కూడా హైకోర్టులో పిటిషన్ వేయగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు కూడా పోలీసు ఫిర్యాదులతో షాకిస్తున్నారు. అయితే రఘురామరాజు దీని పై తనదైన శైలిలో ముందుకు వచ్చారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసి, తన పై వీళ్ళు పెడుతున్న కేసులు, అసలు కేసులే కాదని, వాటిని క్వాష్ చెయ్యాలి అంటూ, పిటీషన్ వేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read