నిన్న వైఎయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై ఉన్న సిబిఐ, ఈడీ కేసుల్లో విచారణకు హాజరు కావటం లేదని, ఇష్టం వచ్చినట్టు విచారణ ఎగ్గోడుతున్నా, కోర్టులు ఏమి అనటం లేదని, అలాగే ఆయన కేసుల్లో సహా నిందితులుగా ఉన్న వారికి, పదవులు ఇస్తున్నారని, మరో పక్క వివిధ పార్టీల నేతలు, మా జగన్ జైలుకు వెళ్తాడాని వార్నింగ్ ఇస్తున్నారని, ఇవన్నీ అసలు ఎందుకు, సిబిఐ జగన్ బెయిల్ రద్దు చేసి, త్వరగా విచారణ చేయాలని, సిబిఐ కోర్టులో పిటీషన్ వేసినట్టు నిన్న చెప్పిన సంగతి తెలిసిందే. అయితే జగన్ బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామరాజు వేసిన పిటీషన్ పై, సిబిఐ కోర్టు ఏమి చెప్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రోజు కొన్ని టీవీ చానల్స్ లో, రఘురామరాజు సిబిఐ కోర్టులో వేసిన పిటీషన్ ని రిజెక్ట్ చేసారు అంటూ వార్తలు వచ్చాయి. రఘురామరాజు వేసిన పిటీషన్ సరిగ్గా లేదని, అందుకే ఆయన పిటీషన్ రిజెక్ట్ చేసారు అంటూ కొన్ని టీవీ చానల్స్ లో వార్తలు వచ్చాయి. అయితే ఇంకేముంది, ఈ వార్త పట్టుకుని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైడ్ సోషల్ మీడియా చెలరేగి పోతుంది. రఘరామరాజు పై బూతులతో విరుచుకు పడుతూ, మా అన్నని టచ్ కూడా చేయలేవు, ఇదీ అదీ అంటూ, వారికి తెలిసిన తాడేపల్లి విద్యతో చెలరేగిపోయారు.

rrr 07042021 2

అయితే వీరి ఆనందం గంట కూడా అవ్వకుండానే, రఘురామ రాజు ఓక వీడియో సందేశం పంపిస్తూ, బ్లూ మీడియా చేస్తున్న అసత్య ప్రచారం పై, విరుచుకు పడ్డారు. ఆయన మాట్లాడుతూ, తన పిటీషన్ ఏదో రిజెక్ట్ చేసినట్టు, ఆ మీడియా చానల్స్ లో వార్తలు వేసుకుని సంబరపడుతున్నారని అన్నారు. అయితే వాస్తవం ఏమిటి అంటే, సిబిఐ కోర్టు తన పిటీషన్ రిజెక్ట్ చేయలేదని, కొన్ని అంశాలు పై క్లారిటీ కోరుతూ వెనక్కు పంపించారని అన్నారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి బెయిల్ కాపీ అడిగారని, మరొక అంశం పైన కూడా మరిన్ని వివరాలు అడిగారని, కొన్ని టెక్నికల్ రీజన్స్ తో వెనక్కు పంపించారు కానీ, రిజెక్ట్ చేయలేదని అన్నారు. అయితే మళ్ళీ శుక్రవారం నాడు, అన్ని వివరాలతో మళ్ళీ, సిబిఐ కోర్టు ముందు పిటీషన్ వేస్తామని అన్నారు. వాళ్ళు ఏదో సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ పిటీషన్ అడ్మిట్ కాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ అవేమి కుదరవు అని, ఈ పిటీషన్ సిబిఐ ముందుకు విచారణకు వస్తుందని, వచ్చే వారం ఈ కేసు పై ఆదేశాలు ఉంటాయని అనుకుంటున్నామని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read