కొడాలి నాని ఇష్టం వచ్చినట్టు దేవుళ్ళ పై మాట్లాడుతున్నారు అంటే, దాని వెనుక ఉన్న శక్తి మరొకటి ఉంది అంటూ రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. కొడాలి నాని వెనుక ఒక శక్తి ఉందనే విషయం గ్రహించాలని అన్నారు. ఆ శక్తి ఎవరో తెలుసుకోవటానికి పెద్ద భీబత్సమైన తెలివి తేటలు అవసరం లేదని అన్నారు. గతంలో తనను తిట్టాలి అంటే, తన కులం వారిని ఎలా ఉసుగొలిపారో, అలాగే హిందువుల పై హిందువులతో దాడి చేస్తున్నారని అన్నారు. కొడాలి నాని మాట్లాడుతూ, ఏ విగ్రహం విరిగిపోతే ఏమవుతుంది ? ఎవరికి నష్టం అంటూ ఆయన మాట్లాడారు, ఆయనకు నేను చెప్తున్నా, దేవుడికి నష్టం ఉండదు కానీ, విశ్వసించే మాకు నష్టం, హిందువులకు నష్టం అని అన్నారు. దేవాలయాల పై దాడులు చేస్తూ, మా హిందువుల మనసులను గాయ పరుస్తున్నారని అన్నారు. మీరు కూడా ఆ గాయాలే చేస్తున్నారని, మతోన్మాదంతో చేస్తున్న ఈ గాయాలకు తగిన శిక్ష అనుభవిస్తారని అన్నారు. నేను పార్లమెంట్ లో మా ప్రభుత్వం ఏమైతే సిబిఐ ఎంక్వయిరీ అడిగిందో, అదే నేను అడిగితే, మీ సాటి మతస్తుడుతో నా పై దాడి చేసారని అన్నారు.

ప్రభుత్వాన్ని నడుపుతున్న వారు ఆలోచించాలని, ఒక కులం వారి పై బురద చల్లాలి అంటే, అదే కులం వారితో, అలాగే ఒక మతం పై దాడి చెయ్యాలి అంటే, అదే మతం వారితో దాడి చేపిస్తున్నారని, ఇది అత్యంత హేయమైన చర్య అని అన్నారు. మీ బంధువునే అక్కడ పెట్టి, స్వామి డబ్బు పై కన్ను వేసారని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఎండోమెంట్స్ శాఖలో, ఇద్దరు సీనియర్ అధికారులను ఎందుకు మార్చారు ? హిందువుల మనోభావాలను కించ పరిచే విధంగా, హేయమైన విధంగా, క్యాబినెట్ మంత్రితో మాట్లాడించటం హేయం అని అన్నారు. ప్రతి మాతానికి రూల్స్ ఉంటాయని, అవి పాటిస్తేనే వెళ్ళనిస్తారని అన్నారు. మక్కాకు వెళ్ళాలి అంటే, ముస్లింలు మాత్రమే వెళ్ళాలని, మీ ఇష్టం అంటే కుదరదు అని అన్నారు. కొడాలి నాని గారి మాటలు చాలా దారుణం అని, ఈ ధోరణి మార్చుకోవాలని, ఆ అదృశ్య శక్తి కూడా మారాలని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read