వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత ప్రభుత్వం పైనే ఆయన విమర్శలు చేస్తూ ఉంటారు. ఆయన్ను లోక్ సభ సభ్యుడిగా అనర్హత వేటు వేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేసారు. అయితే ఈ లోపు ఎంపీ రఘురామకృష్ణరాజు తనకు భద్రత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా, ప్రభుత్వం స్పందించక పోవటంతో, ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసి, కేంద్రం ప్రభుత్వం ద్వారా, వై క్యాటగిరీ భద్రత తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తున్న కొన్ని అవినీతి కార్యక్రమాల పై, ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. ఈ నేపధ్యంలోనే ఆయన ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు అంటూ, నాలుగు సెక్షన్ల కింద ఆయన పై కేసులు నమోదు చేసారు. రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని, మరి కొందరితో కలిసి ఆయన కుట్ర పన్నుతూరు అంటూ, 124ఏ, 153బి, 505 ఐపీసీ, 120బి సెక్తిఒనల కింద కేసు నమోదు చేసారు. ఇవి నాన్ బయిలబుల్ సెక్షన్లు కావటంతో, ఆయనకు బెయిల్ రావటం కష్టం అనే చెప్తున్నారు. ఈ రోజు మధ్యానం 3.30 గంటల సమయంలో ఆయన్ను అరెస్ట్ చేసారు.

rrrr 14052021 2

ఈ క్రమంలోనే ఆయనను బలవంతంగా లిఫ్ట్ చేయటం మీడియాలో కనిపించింది. ఆయన్ను విజయవాడ తీసుకుని వస్తున్నారు. ఈ రోజు రాత్రికి విజయవాడ తీసుకుని వచ్చే అవకాసం ఉంది. రఘురామకృష్ణం రాజుకి నోటీసులు ఇచ్చినా తీసుకోలేదని, నోటీసుల్లో రాసారు. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి అంటూ, ఆయన కుటుంబానికి చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే రఘురామకృష్ణరాజు న్యాయవాదులు వెంటనే హైకోర్ట్ లో పిటీషన్ మూవ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మూడు రోజులు వరుస సెలవులు కావటం, హైకోర్టు వెకేషన్ లో ఉండటం, ఇప్పటి వరకు అరెస్ట్ చూపించకపోవటంతో, వాళ్ళు 24 గంటల్లో అరెస్ట్ చూపించే దాకా, వీళ్ళు కోర్టులో పిటీషన్ వేయటం కుదరదు. సోమవారమే ఈ పిటీషన్ విచారణకు వచ్చే అవకాసం ఉంది. మరో పక్క ముందు సిఐడి కోర్టులో పిటీషన్ వేసి, ఆ తరువాత హైకోర్టుకు వస్తారా లేదా, డైరెక్ట్ గా హైకోర్టులో పిటీషన్ వేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఈ కేసులో బెయిల్ వచ్చిన, మరో కేసులో అరెస్ట్ చూపిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read