జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై, భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజు వేసిన ఈ పిటీషన్ పై, రేపు అంటే, సెప్టెంబర్ 15వ తేదీన తీర్పు ఇస్తాం అంటూ సిబిఐ కోర్టు ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. అయితే గత నెలలోనే జగన్ కేసు పై తీర్పు రావాల్సి ఉంది. అయితే అదే రోజు జగన్ మోహన్ మోహన్ రెడ్డి కేసుతో పాటు, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై కూడా కోర్టు తుది వాదనలు విని, జగన్ కేసుతో పాటుగా, విజయసాయి రెడ్డి కేసు పై కూడా సెప్టెంబర్ 15న తీర్పు ఇస్తాం అంటూ, సిబిఐ కోర్టు చెప్పటంతో, ఇరు పక్షాల న్యాయవాదులు ఒప్పుకున్నారు. అయితే అదే రోజు మరో ట్విస్ట్ కూడా రాష్ట్ర ప్రజలు చూసారు. ఒక పక్క వాదనలు జరుగుతూ ఉండగానే, సాక్షి ట్విట్టర్ లో, జగన్ బెయిల్ రద్దు కేసు కొట్టేసారు అంటూ, ట్వీట్ చేయటం సెన్సేషన్ అయ్యింది. ఇదే విషయం పై, రఘురామరాజు కోర్టులో కేసు కూడా వేసారు. ఇందులో కుట్ర ఉందని, అలాగే ఇది కోర్టు దిక్కరణ కిందకు కూడా వస్తుంది అంటూ కోర్టులో కేసు వేసారు. దీని పైన వాదనలు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే, రేపు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై, తీర్పు రానున్న నేపధ్యంలో, సరిగ్గా ఇదే పాయింట్ పట్టుకుని, రఘురామకృష్ణం రాజు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి, అందరినీ ఆశ్చర్య పరిచారు.

cbi 14092021 2

రఘురామకృష్ణం రాజు ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. రేపు జగన్ బెయిల్ రద్దు కేసు పై సిబిఐ కోర్టులో తీర్పు వస్తుందని, అయితే తనకు ఆ తీర్పు మీద నమ్మకం లేదు అంటూ, రఘురామకృష్ణం రాజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంతో, తీర్పు ప్రభావితం అయ్యే అవకాసం ఉంది అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ, పిటీషన్ దాఖలు చేసారు రఘురామరాజు. నిష్పాక్షికమైన తీర్పు రావాలి అంటే, ఈ పిటీషన్ ను వేరే బెంచ్ కు మార్చాలి అంటూ, ఆయన తెలంగాణ హైకోర్టుని కోరుతూ పిటీషన్ దాఖలు చేసారు. రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ ని తెలంగాణా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీని పై మరి కొద్ది సేపట్లో విచారణ జరగనుంది. లాస్ట్ మినిట్ లో చోటు చేసుకున్న ఈ పరిణామం భారీ ట్విస్ట్ అనే చెప్పాలి. ఈ మొత్తం పరిణామం పై జగన్ మోహన్ రెడ్డి తరుపు న్యాయవాదులు కూడా పరిశీలన చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read