సొంత ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి చేసే తప్పుల పైన, తనదైన శైలిలో స్పందించే వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణ గారు, ఈ రోజు రాజధాని రచ్చబండలో, చంద్రబాబు గారి పై, విజయసాయి రెడ్డి పెట్టిన మురికి ట్వీట్ పై విరుచుకు పడ్డారు. నిన్న చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా, అందరూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని విషెస్ చెప్తుంటే, విజయసాయి రెడ్డి మాత్రం, ఏప్రిల్ 20 న పుట్టారు కాబట్టి, చంద్రబాబుని 420 అంటూ, పేటీయం కూలీల చేత ఒక చెత్త పోస్టర్ చేపించి అది పోస్ట్ చేసారు. దీని పై అన్ని వైపుల నుంచి, విజయసాయి రెడ్డి పై విమర్శలు వచ్చాయి. అలాగే సొంత పార్టీ నుంచి కూడా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ పై, ఎంపీ రఘురామకృష్ణం గారు మండి పడ్డారు. విజయసాయి రెడ్డి పీట్టిన ఆ ట్వీట్ ఒక దిక్కుమాలిన, దౌర్భాగ్యమైన ట్వీట్ అంటూ నిప్పులు చెరిగారు. ఈ రోజు శ్రీరామ నవమి అని, మన ప్రత్యర్ధి అయిన సరే, గౌరవించాలని రామాయణంలో రాసిన విషయం గుర్తు చేసారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి గ్రంధాలు, పురాణాలు చదువుకుని ఉంటే, కొంచెమైన మర్యాదస్తులకు ఉండే లక్ష్యణాలు విజయసాయి రెడ్డికి వచ్చి ఉండేయని వాపోయారు. విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ వల్ల, అతనికి ఏమో కానీ, పార్టీ పరువు అయితే పోయిందని అన్నారు.

rrr 21042021 2

విజయసాయి రెడ్డి సంస్కారం లేకుండా పెడుతున్న ట్వీట్ ల వల్ల , పార్టీ పరువు పోతుందని రఘురామరాజు అన్నారు. ఆయన మా పార్టీ జాతీయ కార్యదర్శి అని, అలాగే రాజ్యసభలో సభ్యడు అని, అంతే కాకుండా, మా ఎంపీలు అందరికీ నాయకుడు అని, ఇలాంటి మాటలు మాట్లాడటానికి బుద్ధి ఉందా, ఇదేనా నీ సంస్కారం అంటూ ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి విష్ చేసారు, నేను చేసాం,అనేక మంది చేసారు, ఈ సాయి రెడ్డికి ఏమైందో, సంకుచిత స్వాభావం చూపించారు అంటూ ధ్వజమెత్తారు. మీరు పెట్టే ఆ మురికి ట్వీట్స వల్ల, సంస్కారం ఉన్న ఎవరూ కూడా వాటిని లైక్ చేయరని, ఇలాంటి వాటి వల్ల న్యూట్రల్ గా ఉండే ప్రజలు, పార్టీ నుంచి దూరం అవుతారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఇలాంటి వారిని కాకుండా వేరే వారిని పెట్టాలని, ఉమ్మారెడ్డి లాంటి పెద్దల్ని ఆ స్థానంలో పెట్టాలని, అలా కాదు, మీరే విజయసాయి రెడ్డి చేత, ఆ ట్వీట్ పెట్టించి ఉంటే, ఇక నేను మాట్లాడేది ఏమి లేదు అంటూ రఘురామకృష్ణం రాజు చెప్పుకొచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read