నర్సాపురం ఎంపీ రఘురామరాజు, తనకు జరిగిన అన్యాయం పై, పోరాటం చేస్తూనే ఉన్నారు. తనదైన శైలిలో, తనకు జరిగిన అన్యాయం పై, దేశ వ్యాప్త చర్చకు దారి తీసారు. జగన మోహన్ రెడ్డి అండ్ కో చేస్తున్న దురాగతాలను ఇవి అంటూ వివరిస్తూ, అందరికీ లేఖలు రాస్తున్నారు. ఇప్పటికే రఘురామరాజు ఎంపీలు అందరికీ లేఖలు రాసారు. అలాగే స్టాండింగ్ కమిటీ సభ్యులకు లేఖలు రాసారు. అయితే నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆయన లేఖలు రాసారు. జగన్ మోహన్ రెడ్డి తప్ప, దేశంలో ఉన్న ముఖ్యమంత్రులకు ఆయన లేఖలు రాసారు. 124 ఏ అనే రాజద్రోహం కేసుని ఎత్తివేసలా కేంద్రం పై ఒత్తిడి తేవాలని, ఆ చట్టం ఎలా దుర్వినియోగం అవుతుంది తెలుపుతూ, ఆయన లేఖలో పేర్కొన్నారు. సిట్టింగ్ ఎంపీ అయిన తన పై, ఇష్టం వచ్చినట్టు ఏపి ప్రభుత్వం ప్రవర్తించిన తీరు పై ఆయన స్పందిస్తూ, లేఖలో మొత్తం వివరించారు. అయితే రఘురామరాజు లేఖపై బీహార్ సియం నితీష్ కుమార్ స్పందించారు. రఘురామరాజు రాసిన లేఖను ఆయన బీహార్ చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి, అలాగే న్యాయశాఖ కార్యదర్శులకు పంపించారు. 124 ఏ సెక్షన్ పై రఘురామరాజు లేవనెత్తిన అభ్యంతరాల పై ఎలా స్పందించాలి, చట్టం రద్దు చేసే సాధ్యాసాద్యాల పై కేంద్రానికి ఎలాంటి నివేదిక ఇవ్వాలి అనే అంశం పై వాళ్లకు పంపించి ఉండవచ్చనే చర్చ జరుగుతుంది.

rrr 08062021 2

ఇక ఢిల్లీ సియం కూడా దీని పై స్పందించినట్టు చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఎంపీలు, సియంలకు లేఖ రాసిన రఘురామరాజు, గవర్నర్లకు , లెఫ్టినెంట్ గవర్నర్లకు కూడా లేఖలు రాసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కు కూడా ఈ లేఖ రసారు. త్వరలోనే గవర్నర్ల సదస్సు జరుగుతుందని, అందుకే ఈ లేఖ రాస్తున్నట్టు తెలిపారు. సెక్షన్ 124ఏ చట్టం రద్దు పై గవర్నర్ల సదస్సులో చర్చించాలని ఆ లేఖలో అందరి గవర్నర్లను కోరారు. ఈ సెక్షన్ ని అందరూ దుర్వినియోగం చేస్తున్నారని, రఘురామరాజు తెలిపారు. తనకు జరిగిన అన్యాయం పై వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు ప్రశ్నిస్తున్నానని, తన పై రాజద్రోహం కేసు పెట్టారని, అక్రమ కేసులు పెట్టి వేధించారని, ఇది సరైన సంస్కృతి కాదని, ఈ చట్టం వ్యక్తగత కక్ష తీర్చుకోవటానికి, తన పై అక్రమ కేసులు పెట్టారు అంటూ, రఘురామరాజు ఆ లేఖలో తెలిపారు. మొత్తానికి, అన్ని వర్గాల నుంచి రఘురామ రాజు రాసిన లేఖకు మద్దతు లభిస్తుంది. మరి దీని పై జగన్ ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read