క-రో-నా రక్కసికి మాజీ ఎంపీ సబ్బం హరి బలి అయ్యారు. గత కొద్ది రోజులుగా క-రో-నాతో బాధ పడుతూ చికిత్స తీసుకుంటున్న సబ్బం హరి, ఈ రోజు తుది శ్వాస విడిచారు. 15 రోజులు క్రిందట ఆయనకు వైరస్ సోకటంతో, విశాఖలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో చేరారు. అయితే చికిత్స తీసుకుంటూ ఉండగానే ఆయన ఆరోగ్యం క్షీణించింది. వారం రోజులు క్రిందట ఆయన ఆరోగ్యం క్షీణించి, వెంటిలేటర్ పై ఉన్నారని వార్తలు వచ్చాయి. తరువాత కోలుకుంటున్నారు అంటూ, ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ రోజు ఉదయం నుంచి, మళ్ళీ ఆయన ఆరోగ్యం క్షీణించింది అంటూ వార్తలు వచ్చాయి. ఈ రోజు ఉదయం నుంచి డాక్టర్లు ఆయన్ను కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేసినా, ఆయన కొద్ది సేపటి క్రిందట తుది శ్వాస విడిచారు. సబ్భం హరి మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చేన్నాయుడు, ఇతర టిడిపి నేతలు సంతాపం వ్యక్తం చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read