ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎట్టకేలకు సుప్రీం కోర్టు తీర్పు పై స్పందించింది. ఈ రోజు సుప్రీం కోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలు పై, తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వేసిన పిటీషన్ ను, సుప్రీం కోర్టు కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకోం అని, ఈ పిటీషన్ చూస్తుంటే ఉద్దేశాలు ఆపాదిస్తున్నట్టు ఉందని, సుప్రీం కోర్టు వాపోయింది. ఇక ఉద్యోగులు పిటీషన్ పై కూడా సుప్రీం కోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. అయితే ఈ తీర్పు తరువాత, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనే టెన్షన్ నెలకొంది. అయితే తీర్పు వచ్చిన వెంటనే, సమీక్షలు అన్నీ రద్దు చేసిన జగన్ మోహన్ రెడ్డి, ఒక అర్జెంటు మీటింగ్ కు పిలుపిచ్చారు. సజ్జల, డీజీపీ, అడ్వొకేట్ జెనెరల్ కలిసి, దాదాపుగా నాలుగు గంటలుగా, తీర్పు పై స్పందించారు. ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయేమో అని చూసిన తరువాత, ఇక సుప్రీం కోర్టు తీర్పుని సిరసహావహించటం మినిహా, మరో ఆప్షన్ లేదనే నిర్ణయానికి వచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు పై, ప్రభుత్వం తరుపున ప్రధాన సలహాదారు, సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకటించిన తరువాత, ఇక ఇందులో వేరే ఉద్దేశం ఉండదని, సుప్రీం కోర్టు తీర్పుని సిరసహావహిస్తున్నమాని సజ్జల తెలిపారు.

sajjala 25012021 2

ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పినట్టే నడుచుకుని, వారికి సహకరిస్తామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం ప్రకరామే ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఉద్యోగులతో చర్చించి, చీఫ్ సెక్రటరీ సరైన నిర్ణయం తీసుకుంటారని సజ్జల అన్నారు. మేము కేవలం వ్యాక్సిన్, ఎన్నికలు ఒకేసారి జరిగితే ఇబ్బంది అని చెప్పి మాత్రమే ఎన్నికలు వద్దు అన్నామని సజ్జల అన్నారు. ఎన్నికల ద్వారా కరోనా పెరిగితే మాత్రం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దే బాధ్యత అని సజ్జల అన్నారు. ఉద్యోగులు మా ప్రభుత్వంలో భాగం అని, వారి ప్రాణాలు తమకు ముఖ్యం అని అన్నారు. కేంద్రం వ్యాక్సిన్ గ్యారెంటీ అంటున్నారని, అలాగే ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటుందని, సుప్రీం కోర్టు, రెండు ముఖ్యమే అంటుందని, కాబట్టి ఇక కోర్టు చెపినట్టు చేస్తాం అని సజ్జల అన్నారు. మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కనపెట్టి.. పంచాయతీ ఎన్నికలను ముందుకు తీసుకురావడంలోనే కుట్ర ఉందని అర్ధమవుతుందని సజ్జల అన్నారు. ఎన్నికల్లో పోటీకి మా పార్టీ రెడీ గా ఉందని, మేము ఎన్నికలకు భయ పడటం లేదని సజ్జల అన్నారు. మొత్తానికి సుప్రీం కోర్టు తీర్పుకి ఎదురు చెప్పలేక, ఇప్పటికీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తిడుతూనే ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read