ఈ రోజు ఉదయం నుంచి, మొత్తం జగన్ మోహన్ రెడ్డి కేసులు చుట్టూ తిరుగుతున్నాయి. ముందుగా జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిల బెయిల్ రద్దు చేయాలి అంటూ రఘురామరాజు సిబిఐ కోర్టులో వేసిన పిటీషన్ పై ఈ రోజు తీర్పు వచ్చింది. రఘురామరాజు పిటీషన్ కొట్టేస్తూ, జగన్ కు ఊరటను ఇచ్చే తీర్పుని సిబిఐ కోర్టు ప్రకటించింది. దీని పై రఘురామరాజు, తాను హైకోర్టులో అపీల్ కు వెళ్తాను అంటూ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇది ఇలా ఉంటే, ఇంత కంటే ముందు, ఉదయం కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా ఈ రోజు సిబిఐ ఇచ్చే తీర్పు పై తనకు నమ్మకం లేదు అంటూ, రఘురామకృష్ణం రాజు నిన్న తెలంగాణా హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. సిబిఐ కోర్టు తీర్పు రాక ముందే సాక్షిలో వచ్చిందని, అలాగే విజయసాయి రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు ఈ బెంచ్ అనుమతి ఇచ్చిందని, మొత్తంగా ఈ బెంచ్ ఇచ్చే తీర్పు పై నమ్మకం లేదని, వేరే బెంచ్ కు బదిలీ చేయాలి అంటూ, రఘురామరాజు వేసిన లంచ్ మోషన్ పిటీషన్ పై నిన్న వాదనలు జరగగా, ఈ రోజు తీర్పు వచ్చింది. అయితే రఘురామరాజు పిటీషన్ కొట్టివేస్తూ తెలంగాణా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రోజు సిబిఐ కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక మరో అంశం కూడా ఈ రోజు చోటు చేసుకుంది.

sakshi 15092021 2

ఇదే పిటీషన్ విషయంలో, గత నెలలోనే సిబిఐ కోర్టు, జగన్ బెయిల్ పిటీషన్ రద్దు పై తీర్పు వస్తుందని అందరూ భావించారు. ఆ సమయంలో కోర్టు కంటే ముందే, సాక్షి మీడియా ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ, జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ని సిబిఐ కోర్ట్ డిస్మిస్ చేసింది అంటూ, ట్వీట్ చేసింది. కోర్టు చెప్పక ముందే, ఏ మీడియా కూడా వేయక ముందే, సిబిఐ కోర్టు తీర్పుని సాక్షి టీవీ వేసేసింది. అయితే దాని పై ఇప్పటికే సాక్షి మీడియా పై, రఘురామకృష్ణం రాజు కోర్టు దిక్కరణ పిటీషన్ వేసారు. దీని పై వాదనలు జరిగాయి. అయితే ఈ రోజు సిబిఐ కోర్టు, తమకు కోర్టు ధిక్కరణ పిటీషన్ పై చర్యలు తీసుకునే అవకాసం లేదు అంటూ, ఈ కేసుని హైకోర్ట్ కు బదిలీ చేసింది. అయితే ఇందులో సాక్షి మీడియా కోర్టు ధిక్కరణ ఉందని భావించే, విచారణ జరపిన తరువాత, ఒక అంచనాకు వచ్చి సిబిఐ కోర్టు, హైకోర్టుకు బదిలీ చేసిందని రఘురామరాజు అంటున్నారు. దీంతో ఇప్పుడు హైకోర్టు ఈ విషయంలో, సాక్షి మీడియా పై కోర్ట్ ధిక్కరణ చర్యలు మొదలు పెడుతుందేమో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read