మొగుడ్ని కొట్టి మొగ‌సాల‌కెక్క‌డం అనే సామెత ఎప్పుడైనా విన్నారా? విన‌క‌పోతే వైసీపీ ఎమ్మెల్యేల‌ని చూడండి చాలు. 151 సొంత ఎమ్మెల్యేలు, జంపింగ్ జాపాంగ్ మ‌రో ఐదుగురు ఎమ్మెల్యేలున్న క‌లిసి 156 మంది ఎమ్మెల్యేల‌పై 15 మంది కూడా అసెంబ్లీలో లేని టిడిపి ఎమ్మెల్యేలు దాడి చేశార‌ని క‌ట్టుక‌థ అల్లారు. ఐప్యాక్ బీహార్ బ్యాచీల‌తో బ్లాక్ డే అంటూ బాగానే  క్యాంపెయిన్ చేశారు. అయితే ఐప్యాక్ డ్రామా ర‌క్తిక‌ట్టించే లోపు సాక్షి వైసీపీనే మొత్తం అడ్డంగా బుక్ చేసింది. అసెంబ్లీలో  స్పీకర్ పై టీడీపీ ఎమ్మెల్యేల దాడి అంటూ పాత ఫోటోలతో మొదటి పేజీలో తప్పుడు కథనం వేసి మొత్తం వైసీపీది డ్రామా అని తేల్చేసింది సాక్షి. వాస్త‌వంగా టీడీపీ ద‌ళిత ఎమ్మెల్యే డోలా బాల‌వీరాంజ‌నేయ‌స్వామిపై వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మ‌డి దాడి చేశారు. ఈ దాడిని కప్పిపుచ్చేందుకు, పాత ఫోటోలు తీసి స్పీక‌ర్ పై దాడి అంటూ సాక్షి బేన‌ర్ వేసేసింది. సాక్షి మొదటి పేజీలో ప్రచురించిన ఫోటోలో రాజ‌మండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలున్నారు. ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ బ‌య‌ట‌ప‌డింది. తాను శాస‌న‌స‌భ స‌మావేశాల‌కే రాలేద‌ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ప్ర‌క‌టించ‌డంతో వైసీపీ, సాక్షి చేసిన ఫేక్ డ్రామాలు అన్నీ బ‌య‌ట‌ప‌డ్డాయి.  ఎమ్మెల్యే స్వామిపై దాడి వ్యవహారంతో తీవ్ర విమర్శల పాలనై అధికారపక్షం. దీంతో పాత ఫోటోలతో స్పీకర్ పై దాడి అంటూ కట్టుకథ అల్లి మ‌రోసారి వైసీపీని సాక్షి బుక్ చేసేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read