ఏపీ పై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు న్యూఢిల్లీలో తలపెట్టిన ‘ధర్మ పోరాటం’ దీక్షకు బీజేపీ అసమ్మతి నేతలు శత్రుఘన్ సిన్హా, యశ్వంత్ సిన్హా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శత్రుఘన్ సిన్హా మాట్లాడుతూ చంద్రబాబును కొనియాడారు. ‘ఆంధ్రా హీరో.. హీరో ఆఫ్ ది నేషన్..మోస్ట్ లవుడ్, ఫాలోడ్, admired ’ అని చంద్రబాబును కీర్తించారు. తాము పార్టీకి హాని చేసే కార్యకలాపాలేవీ చేయడం లేదని, అన్యాయానికి వ్యతిరేకంగా తమ గొంతు వినిపిస్తామని శత్రుఘన్ సిన్హా అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘వ్యక్తి కంటే పార్టీ గొప్పది, పార్టీ కంటే దేశం గొప్పది’ అని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన పార్టీని అవమానించినట్టు కాదని ఆయన అన్నారు. తాను పార్టీలోనే ఉన్నానని, ఇంకా పార్టీ ఎంపీనేనని సిన్హా అన్నారు. ప్రత్యేక హోదా అనేది ఏపీకి సంబంధించిన విషయం కాదని అది దేశానికి సంబంధించిన విషయమని సిన్హా ఉద్ఘాటించారు.

babu 11022019

శత్రుఘ్నసిన్హా ధర్మపోరాట దీక్షకు హాజరుకావడం వెనుకనున్న ఒక విశేషాన్ని టీడీపీ నేత, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ సభావేదికపై తెలియజేశారు. శత్రుఘ్నసిన్హాకు ఎంతో ముఖ్య స్నేహితుడు అయిన తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ కుమార్తె పెళ్లికి వెళ్లవలసి ఉండగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని మరీ ధర్మపోరాట దీక్షకు వచ్చారని మురళీమోహన్ తెలిపారు. చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేస్తున్నారని తెలుసుకున్న శత్రుఘ్నసిన్హా.. పెళ్లికంటే ఇది ముఖ్యమైన పని అని.. ఫ్లైట్ టిక్కెట్ రద్దు చేసుకుని చంద్రబాబు దీక్షా స్థలికి వచ్చారని టీడీపీ ఎంపీ మురళీ మోహన్ వివరించారు. చంద్రబాబు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారంటే.. పెళ్లికంటే ఇదే ఎంతో ముఖ్యమైందని భావించి, వచ్చి ప్రసంగించినందుకు మురళీమోహన్ అక్కడ ఉన్న అందరి తరఫున, టీడీపీ పార్టీ, ఆంధ్రప్రదేశ్ తరఫున శత్రుఘ్నసిన్హాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

babu 11022019

మరో పక్క,ధర్మపోరాట దీక్షలో చంద్రబాబుపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రశంసలు కురిపించారు. ఇందుకు ప్రతిగా చంద్రబాబు సైతం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న కమల్‌నాథ్...చంద్రబాబు తనకు మంచి మిత్రుడని, సిద్ధాంతాలకు కట్టుబడిన రాజకీయ నేత అని తొలుత ప్రశంసలు కురిపించారు. ఏపీ ప్రజలకు మధ్యప్రదేశ్ రాష్ట్రం తరఫున, కాంగ్రెస్ తరఫున సంఘీభావం తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు చంద్రబాబు చేస్తున్న దీక్ష ప్రశంసనీయమని అన్నారు. ఇవాళ దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, వ్యవస్థలన్నింటినీ కేంద్రం నీరుగారుస్తోందని ఆరోపించారు. న్యాయవ్యవస్థ నుంచి, ఆర్బీఐ, సీబీఐ వరకూ వ్యవస్థలన్నింటిపై దాడి జరుగుతోందన్నారు. ప్రజాస్వామ్య పరరిక్షణకు అంతా కంకణబద్ధులు కావాలన్నారు. చంద్రబాబునాయుడు ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read