కోవిడ్ బాధితుల పరిహారాన్ని వారి బాంధవులకి చెల్లించటంలో, దేశంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా, బీహార్ ప్రభుత్వాలు, చెల్లించక పోవటం పై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గతంలో సుప్రీం కోర్టు ఈ విషయంలో కోవిడ్ బాధితులకు సంబంధించి, మరణించిన వారి కుటుంబాలకు, వారు బంధువులకు 50 వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశించటానికి ముందే, కేంద్ర ప్రభుత్వం కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాలకు ఉన్న స్టేట్ డిజాస్టర్ ఫండ్స్ కింద, ఈ నిధులు ఇవ్వచ్చు అని కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారం కోవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు, ఈ నష్ట పరిహారం, రాష్ట్రాలు చెల్లించాలి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ చెల్లింపులు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ పైన ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించినా కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించకపోవటం పై, చట్ట వ్యతిరేకం అంటూ ధర్మాసనం పేర్కొంది.

sc 19012022 2

ఈ రాష్ట్రాలు చట్టాలకు అతీతులు కారని, రెండు రాష్ట్రాలు ఇలా తమ ఆదేశాలు పాటించపొతే కుదరదు అంటూ, సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్, అలాగే బీహార్ రాష్ట్రానికి చెందిన చీఫ్ సెక్రటరీలను తమ ముందు హాజారు కావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తమ ముందు హాజరు కావాలి అంటూ సుప్రీం కోర్టు ఆదేశించిటం చూస్తే, ఎంత సీరియస్ గా ఈ అంశం పై సుప్రీం కోరుట్ ఉందో అర్ధం అవుతుంది. రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు ఈ రోజు నోటీసులు జారీ చేస్తూ, చట్టానికి అతీతులు కారని, వీరు తమ ముందు హాజరు కావలసిందే అంటూ అగ్రహ వ్యక్తం చేసింది. ఎందుకు ఈ విధంగా రెండు రాష్ట్రాలు ఇలా నిర్లక్షం చేస్తున్నారో చెప్పాలి అంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ విషయంలో సుప్రీం కోర్టు మోదటి నుంచి సీరియస్ గ ఆంది. ముందుగా 2 లక్షలు ఇవ్వాలని ఆదేశించినా, నిధులు కొరత అని చెప్పటంతో, 50 వేలకు కుదించారు. అయితే ఇక్కడ ఆ డబ్బులు కూడా ఇవ్వలేక పోవటంతో, సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read