విశాఖలో ఉన్నటు వంటి స్వరూపానంద సరస్వతి మఠం అక్రమాలకు అడ్డంగా మారింది అంటూ, ఫిర్యాదు చేసారు. విశాఖకు చెందినటు వంటి, రాం దీని పై ఫిర్యాదు చేసారు. విశాఖ భీమిలిలోని 15 పంచాయతీల్లో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడిందని, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కూడా అవకతవకలు జరిగాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసారు. అటు స్వరూపానంద స్వామి ఒక దొంగ స్వామి అంటూ, స్వరూపానంద స్వామి ఆశ్రమం, వైసీపీ పార్టీకి అడ్డాగా మారింది అని కూడా ఫిర్యాదు చేయటం జరిగింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు, ఆశ్రమం మూసివేయాలని, లేని పక్షంలో ఎన్నికలను అక్కడ నుంచి అధికార పార్టీ ప్రభావితం చేసే ప్రమాదం ఉందని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసారు. దేశంలో ఎక్కడా, ఏ ఆశ్రమానికి లేని సెక్యూరిటీ, ఏపి ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసిందని, ఎందుకు ఆశ్రమాలకు ఆ స్థాయిలో సెక్యూరిటీ ఇవ్వాల్సి వచ్చిందో కూడా, ప్రభుత్వం నుంచి వివరణ కోరాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులో తెలిపారు.

ఒకరకంగా గతంలోనే స్వరూపానంద స్వామికి సంబందించినంత వరకు కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా దుర్గ గుడి పైన జరుగుతున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు ఏవైతే ఉన్నాయో, అక్కడ నుంచి నిధులు తరలిపోయాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే, మొత్తం మీద ఇప్పుడు నేరుగా స్వరూపానంద మఠం పై నేరుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయటం, సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. జగన్ మోహన్ రెడ్డి ఆధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి స్వరూపానందకి అధికా ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నారు. డీజీపీ, అధికారులు, మంత్రులు అందరూ వరుస పెట్టి ఆయన దగ్గర మోకరిల్లారు. దీని పై మొదటి నుంచి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే మొన్న ఎన్నికలు జరగటం, అక్కడ స్వరూపానంద ఆశ్రమం పై విమర్శలు రావటంతో, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఈ ఆశ్రమం పై, ఇక్కడ జరుగుతున్న అధికార దుర్వినియోగం పై ఫిర్యాదులు రావటం చర్చకు దారి తీసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read