వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకో రాదంటూ ఆదివారం ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, మరుసటిరోజైన సోమవారం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఎన్నికల ప్రక్రియ సందర్భంగా ఏకగ్రీవాలైన 11 చోట్ల రీ నామినేషన్ కు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్‌ వేయకుండా అడ్డుకుని బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నందునే రీనామినేషన్ కి అవకాశమిస్తున్నట్లు సోమవారం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి కార్పొరేషన్లో ఆరు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు, కడప జిల్లా రాయచోటిలో రెండు ఏకగ్రీవాలలో రీ నామినేషన్ జరగనున్నది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2, 8, 10, 21,41, 45 డివిజన్లు, పుంగనూరు మున్సిపాలిటీలో 9, 14, 28 వార్డులు, రాయచోటి మున్సిపాలిటీలో 20, 21 వార్డుల్లోనూ రీనామినేషను ఆదేశాలు జారీచేశారు. అలాగే, కడప జిల్లా యర్రగుంట్ల నగర పంచాయతీకి సంబంధించి 6,11, 15 వార్డుల్లో 2020 మార్చి నెలలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని పునరుద్ధరించడానికి కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని, ఇప్పుడు కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి అభ్యర్థులకు తెలియజేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు మరియు సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఎన్నికల అధికారులను ఆదేశించారు.

రీ నామినేషన్‌కు షెడ్యూల్ ఇలా.. రీనామినేషన్ కొరకు ఆయనషెడ్యూల్‌ను కూడా ఆ ఆదేశాల్లోనే పేర్కొన్నారు. నామినేషన్ దాఖలుకు 2వ తేదీ అనగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలు వరకూ సమయం ఇచ్చారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి నామి నేషన్ల పరిశీలన చేస్తారని, 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు ఉపసం హరణలకు సమయం ఇస్తన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఏకగ్రీవంగా ఎన్నికైన ఆ 11 చోట్లరీ నామినేషను అవకాశం ఇవ్వడంపై గెలిచిన అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎఈసీ నిర్ణయంపై కోర్టుని ఆశ్రయించనున్నట్లు తెలిసింది. అయితే మిగతా చోట్ల కూడా బలవంతపు ఏకాగ్రీవాలు జరిగాయని, వాటి పై కూడా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను వివిధ పార్టీలు కోరుతున్నాయి. వీటికి సంబంధించి ఆధారాలను ఎన్నికల కమిషన్ కు పంపించినా, వాటి పై నిర్ణయం తీసుకోలేదని అసంతృప్తిలో ఉన్నారు. ఎన్నికలు అంటేనే ఎన్నిక జరగాలని, ఇలా బలవంతంగా ఏకాగ్రీవాలు చేసుకోవటం ఏమిటి అని వాపోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read