వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పూర్తిగా బీజేపీ మ‌నిషి అని తేలిపోయింది. బీజేపీ కోసం ఏం చేయ‌డానికైనా వైకాపా రెడీ అయ్యింది. వైసీపీ నేత‌ల్ని కేసుల్నించి కాపాడ‌టం, అప్పులు ఇప్పించ‌డం వంటి బాధ్య‌త‌లు కేంద్రంలో పెద్ద‌లు చూసుకుంటున్నారు. వైఎస్ జ‌గ‌న్ రెడ్డి బీజేపీ అనుబంధం అధికారంలోకి రావాల‌నుకుంటున్న కాంగ్రెస్ కి చాలా ప్ర‌తిబంధ‌కంగా మారింది. ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా బీజేపీ పోల్ మేనేజ్మెంటు కోసం ఏపీ నుంచి వైఎస్ జ‌గ‌న్ రెడ్డి నిధులు స‌ర్దుతున్నార‌ని కాంగ్రెస్‌తోపాటు ఇత‌ర పార్టీలు ఆరోపిస్తున్నాయి. వైకాపా ఈ సారి ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని, ఏపీలో వైసీపీ ఓటుబ్యాంకు క్యాప్చ‌ర్ చేసేందుకు కాంగ్రెస్‌కి అనువైన ప‌రిస్థితులున్నాయ‌ని హ‌స్తం పెద్ద‌ల ఆలోచ‌న‌. ఈ దిశ‌గా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ని గ‌ద్దెనెక్కించిన డీకే శివ‌కుమార్‌ని ఏపీ-తెలంగాణ‌లో హ‌స్తం హ‌వా సాగించేలా పావులు క‌ద‌పాల‌ని బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతానికి తెలంగాణ‌లో ఉన్నా..వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏపీ కాంగ్రెస్‌కి ష‌ర్మిల‌ని పెద్ద దిక్కుగా పెట్టి వైసీపీ ప్లేసులోకి రావాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అటు ష‌ర్మిల‌, ఇటు సునీత ఇద్ద‌రి చెల్లెళ్ల‌ను చేర‌దీసి కాంగ్రెస్‌లో కీల‌క‌ప‌ద‌వులు క‌ట్టబెట్టి బీజేపీ పావుగా వాడుతోన్న అన్న జ‌గ‌న్ రెడ్డికి చెక్ పెట్టే వ్యూహం దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయ‌ని డీకే శివ‌కుమార్ ఎత్తుగ‌డ‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి

Advertisements

Advertisements

Latest Articles

Most Read