రాష్ట్రంలో ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఫ‌లితాలు వివిధ రాజ‌కీయ పార్టీల‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. వైసీపీ నేత‌ల్లో ఆందోళ‌న నెల‌కొన‌గా, బీజేపీ నేత‌లు నైరాశ్యంలో ఉన్నారు. ఈ ఫ‌లితాల‌పై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.  వైసీపీ, బీజేపీ దొందూ దొందే అని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌ధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలతో జగన్ ఫొటోలు తీసుకోవడం చూసి వైసీపీ, బీజేపీ ఒకటే అనుకుంటున్నార‌ని చెప్పుకొచ్చారు.  విశాఖను పాలన రాజధాని అని వైసీపీ ప్ర‌క‌టించ‌డం స్థానిక ప్రజలకు ఇష్టం లేద‌ని, అందుకే వైసీపీని ఓడించార‌ని చెప్పుకొచ్చారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి శుభపరిణామం అని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలి అని  విష్ణుకుమార్ రాజు ఆకాంక్షించారు. బీజేపీ నేత వ్యాఖ్య‌ల‌తో నేడో రేపో టిడిపిలో చేర‌డం ఖాయం అని ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు ఇప్ప‌టివ‌ర‌కూ వైసీపీ పాల‌న‌లో ఎన్ని ఘోరాలు జ‌రిగినా, నేరాలు చేస్తున్నా కాపాడుకుంటూ వ‌స్తోంది బీజేపీ పెద్ద‌లేన‌ని..విష్ణుకుమార్ రాజు చెప్ప‌క‌నే చెప్పేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read