ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సహానీ పదవీ కాలం, మరో సారి పొడిగించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఇప్పటికే నీలం సాహనీ పదవి మరో మూడు నెలలు పొడిగించాలని, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే నీలం సహానీ పదవీ కాలం జూన్ 30తో ముగిసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న పరిస్థితిలో కొత్త సీయస్ వద్దని, ఆమెను కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఆరు నెలలు పొడిగించాలని కేంద్రాన్ని కోరగా, కేంద్రం మూడు నెలలు పొడిగించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో, చీఫ్ సెక్రటరీ నీలం సహానీ పదవీ కాలం సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ నేపధ్యంలో, మరోసారి ఆమె పదవీ కాలం పొడిగించాలని కోరుతూ, జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వం కేంద్రనికి లేఖ రాసింది. చీఫ్ సెక్రటరీ నీలం సాహనీ, 1984 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆమె సుదీర్ఘ కాలం, సర్వీస్ లో అనే పదవుల్లో పని చేసారు. నల్గొండ, జాయింట్ కలెక్టర్ గా, మచిలీపట్నంలో అసిస్టంట్ కలెక్టర్ గా నీలం సహానీ పని చేసారు.

శిశు సంక్షేమ శాఖతో పాటు, మునిసిపల్ శాఖలో కూడా ఉన్నత పదవుల్లో పని చేసారు. 2019 నవంబర్ నెలలో ఎపి చీఫ్ సెక్రటరీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పటికే ఒకసారి ఆమె బాధ్యతలు పొడిగించిన ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్రంలో క-రో-నా వైరస్ అధికంగా ఉన్న సమయంలో, ఆమెనే కొనసాగించాలని, కొత్త వారు అయితే సెటిల్ అవ్వటం కష్టం అని లేఖలో రాసారు. మరో మూడు నెలలు అనుమతి కోరారు. అయితే ఈ సారి మాత్రం పొడిగింపు కష్టం అని తెలుస్తుంది. కేంద్రంలో పని చేస్తున్న హెల్త్ సెక్రటరీ ప్రతీసూడాన్ పదవీ కాలం ఏప్రిల్ తో ముగియటంతో, క-రో-నా దృష్టిలో పెట్టుకుని పొడిగించారు. ఇప్పుడు ఆమె పదవీ కాలం ముగుస్తు ఉండటంతో, పొడిగింపు లేదని కేంద్రం చెప్పటంతో, ఆమె రిటైర్ కానుకున్నారు. కేంద్రంలో ఉన్న వారికే పొడిగింపు లేకపోతే, రాష్ట్రంలో పని చేస్తున్న వారికి పొడిగింపు ఇచ్చే అవకాసం లేదని తెలుస్తుంది. చూద్దాం కేంద్రం ఏమి చేస్తుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read