ప్రసిద్ధ హిందు ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశవ్యాప్తంగా వున్న వేలాది ఎకరాల ఆస్తు ల్లో తమిళనాడు రాష్ట్రంలో పలు చోట్ల వున్న ఆస్తు లను విక్రయించడానికి తిరుమల తిరుపతి దేవ స్థానం పెద్దలు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీలు కూడా తమిళనాడు లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న టిటిడి ఆస్తులకు సంబంధించి నివేదిక కూడా సమర్పించారు. నివేదిక అందడంతో తమిళనాడులోని వేలాది ఎకరాల ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. తమిళనాడులోని చెన్నై, మధురై, కాంచీపురం, ఈరోడ్, కోయంబత్తూరు, నామ క్కల్, తిరుచ్చి, రాలయవేలూరు, విల్లుపురం, తిరువళ్ళూరు, నాగపట్నం, తిరువణ్నామలై, తిరుచిరాపల్లి, ధర్మపురి జిల్లాల్లో ఇళ్ళస్థలాలు, భూములు, ఆస్తులు వున్నాయి, ఈ ఆస్తులన్నీ నిరర్ధకంగా మారాయనే నెపంతో ఏకంగా దేవుని సొత్తు విక్రయాలకు టెండర్ పెట్టారు.

తొలివిడతగా శనివారం తమిళనాడులోని 1.50 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు అమ్మకానికి పెడుతూ టిటిడి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే నిరర్ల కంగా వున్న ఈ ఆస్తుల విక్రయాలపై టిటిడి ధర్మ కర్తలమండలి కూడా పాలకమండలి సమావేశంలోనే తీర్మానం చేసింది. ఈ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసే అధికారాలను టిటిడి అధికారులకు బాధ్యత అప్పగించారు. ఈ నేపధ్యంలో టిటిడి ఆస్తుల విక్రయాల ప్రక్రియను నిలువుదల చేయాలని ప్రతిపక్షనాయకులు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశవ్యా ప్తంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ, కేరళ, కర్నాటక, గుజరాత్, ఒడిశా, హర్యానా,వుదుచ్చేరి, మహారాష్ట్ర, నేపాల్ లో ఆస్తులు భారీ మొత్తంలో ఉన్నాయి. ఇందులో 125.75ఎకరాల విలువైన ఆస్తులు ఇతర రాష్ట్రాల్లో ఉండటం విశేషం.

భక్తులు ఉదారంగా ఇచ్చిన ఆన్తు లను నేడు టిటిడి పెద్దలు అమ్మకాలకు పెట్టడం పెద్ద దుమారాన్నే రేవు తోంది. అయితే టిటిడి ఆస్తులను తమవారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిసు న్నాయి. ఈ ఆస్తుల విక్రయాలను ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం పెద్దల కన్ను శ్రీవారి ఆస్తులపై వడిందనే ఆరోపణలు ప్రతిపక్షాలు బహిరంగంగా వ్యక్తంచేస్తున్నాయి. అయితే ఈ విమర్శల పై అధికార పక్షం స్పందించింది. మంత్రి సుచరిత మాట్లాడుతూ, నిరర్ధక ఆస్తులను అమ్ముకుంటే తప్పు ఏమి ఉంది అని ప్రశ్నించారు. అయితే మరో మంత్రి అవంతి శ్రీనివాస్ మాత్రం, టిటిడి తీసుకునే నిర్ణయాలకు, ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. టిటిడి బోర్డు నిర్ణయాల ప్రకారం, అన్నీ జరుగుతాయని అన్నారు. ఇరువురు మంత్రులు, తలా ఒక విధంగా స్పందించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read