ప‌ట్టు విడ‌వ‌కుండా పోరాడేవారిని ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు అంటారు. న్యాయం కోసం, త‌న తండ్రి హంత‌కుల‌ని చ‌ట్టం ముందుకు నిల‌బెట్ట‌డానికి ఒక్క మ‌హిళ ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కురాలిలా పోరాడుతోంది సునీతారెడ్డి. అన్న‌లే గ‌న్‌లు ఎక్కుపెట్టి బెదిరిస్తున్నా, కాపాడాల్సిన వారే కాటేయ‌జూస్తున్నా వెన‌క్కి త‌గ్గ‌ని ధీర వ‌నిత వైఎస్ సునీతారెడ్డి మ‌రో సంచ‌ల‌న పిటిష‌న్ సుప్రీంకోర్టులో దాఖ‌లు చేసింది. పులివెందుల పోలీస్ స్టేష‌న్ నుంచి సీబీఐ దాకా నిందితుల్ని కాపాడుకుంటూ, అరెస్టు కాకుండా మేనేజ్ చేస్తూ వ‌స్తున్న అన్న‌పై న్యాయ‌పోరాటానికి అత్యున్న‌త న్యాయ‌స్థానం త‌లుపు మ‌రోసారి త‌ట్టింది. త‌న తండ్రి వివేకానంద‌రెడ్డి హత్య కేసులో క‌డ‌ప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో  సునీతారెడ్డి పిటిష‌న్ వేసింది. మే 31న అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు లో సవాల్ చేసింది. తన తండ్రి హత్య కేసులో అవినాశ్ రెడ్డిపై మోపినవి కీలక అభియోగాలని, హైకోర్టు తీర్పులో లోపలున్నాయన్న సునీతారెడ్డి పిటిష‌న్‌లో పేర్కొన్నారు. సీబీఐ అభియోగాలు హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని కోర్టుకి విన్న‌వించింది. రేపు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందు ప్రస్తావించే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.  సుప్రీంకోర్టుకి సునీతారెడ్డి చేర‌డంతో మ‌ళ్లీ లాబీయిస్టు విజ‌య‌కుమార్ ద‌గ్గ‌ర‌కి వైఎస్ జ‌గ‌న్ రెడ్డి టీము భేటీ అయ్యే అవ‌కాశాలున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read