వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు వ్యవహారం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన, 21 పార్టీలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి. 50 శాతం స్లిప్పులు లెక్కించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరాయి. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలంటూ పార్టీలు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 5 వీవీప్యాట్‌ యంత్రాల స్లిప్పులు లెక్కించాలని తీర్పు ఇచ్చింది. దీనిపై సంతృప్తి చెందని పార్టీలు.. 50 శాతం తప్పనిసరిగా లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి.

cbn supremecourt 24042019

మరో పక్క వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలతో కలిసి మంగళవారం ముంబైలో చంద్రబాబు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా ఎన్నికల్లో రష్యన్‌ హ్యాకర్లు పాత్ర పోషించారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు అమెరికా ప్రస్తావన తీసుకురాకుండానే, రష్యన్‌ హ్యాకర్ల పాత్ర గురించి వ్యాఖ్యానించారు. ‘ఈవీఎం యంత్రాలను హ్యాక్‌ చేయడంలో రష్యన్‌ హ్యాకర్ల పాత్రకు అవకాశం ఉంది. కోట్లు ఖర్చు చేస్తే హ్యాక్‌ చేయగలమని కొన్ని బృందాలు తిరుగుతున్నాయి. అందుకే ఇటువంటి అనుమానాలు వస్తున్నాయి. ప్రోగ్రామింగ్‌ ద్వారా ఈవీఎంలు యంత్రాలు పనిచేస్తాయి. ఆ ప్రోగ్రామింగ్‌ మారిస్తే వాటిలో ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్‌ చెబుతున్న దాని ప్రకారం ఈవీఎంయంత్రాలకు అనుబంధంగా ఉన్న వీవీ ప్యాట్లలో ఓటరు ఎవరికి ఓటు వేసిందీ, ఆ గుర్తు ఏడు సెకండ్లు కనిపించాలి. కానీ కొన్ని చోట్ల మూడు సెకండ్లే కనిపించింది. ట్విటర్‌లో నిర్వహించిన ఒక పోల్‌లో 27 శాతం మంది ఏడు సెకండ్లు కనిపించిందని చెబితే, 55 శాతం మంది మూడు సెకండ్లే కనిపించిందని చెప్పారు. ప్రోగ్రామింగ్‌ మారిస్తే మాత్రమే ఇలా సమయం తగ్గుతుంది. ఎవరు మార్చారు... ఎందుకు మార్చారన్నది తేలాలి’’ అని ఆయన అన్నారు.

cbn supremecourt 24042019

కొన్ని యంత్రాల్లో మూడు సెకండ్లు కనిపించడం, కొన్ని యంత్రాల్లో ఏడు సెకండ్లు కనిపించడంపై తీసిన వీడియోలను ఆయన విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ‘‘ఏడు రాష్ట్రాలకు చెందిన ఈవీఎం యంత్రాలను పోయిన డిసెంబర్‌లో వార్షిక నిర్వహణ పేరుతో కొన్ని కంపెనీలకు ఇచ్చారు. ఆ సమయంలో ఏం జరిగిందన్నది రహస్యంగా మిగిలిపోయింది. ఏమయి ఉంటుందనేది ఎవరికీ తెలియదు. పార్లమెంటుకు కూడా తెలపలేదు. కొందరు సర్వీస్‌ ఇంజనీర్ల ద్వారా వాటిని మరమ్మతు చేయించామని చెబుతున్నారు. ఆ ఇంజనీర్లు ఎవరు... వారిని ఎవరు నియమించుకొన్నారు... వారిపై పర్యవేక్షణ ఎవరిది? ఏ అక్రమాలు జరగకుండా సెక్యూరిటీ ఆడిట్‌ ఎవరు చేశారన్న దానికి ఎవరి వద్దా సమాధానాలు లేవు. అందుకే ఈవీఎం యంత్రాలపై మాకు అనుమానాలు ఉన్నాయని చెబుతున్నాం. ఇవాళ కాకపోతే రేపైనా ఈ దేశం బ్యాలెట్‌ ఓటింగుకు మళ్లాల్సిందే. మన కంటే అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు కలిగిన దేశాలే పేపర్‌ బ్యాలెట్‌తో ఎన్నికలు జరుపుతుంటే అనేక అనుమానాలతో మనం ఈవీఎం యంత్రాలను వినియోగించాల్సిన అవసరం లేదు’’ అని ఆయన తేల్చిచెప్పారు. ఈ దేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరు రాజకీయ నాయకుల కంటే బాగా ఎక్కువ ప్రోత్సహించిన వాడిని తానేనని, తానే ఈ విషయంలో సాంకేతికత వద్దని చెబుతున్నానంటే పరిస్ధితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read